Amit Shah: పాకిస్థాన్పై ఎందుకు యుద్ధం చేయలేదు.. విపక్షాల ప్రశ్నకు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్
- పాకిస్థాన్పై ఎందుకు యుద్ధం చేయలేదు
- విపక్షాల ప్రశ్నకు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపరేషన్ సిందూర్పై రెండోరోజు వాడీవేడిగా పార్లమెంట్లో చర్చ జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. పదే పదే విపక్షాలు అడ్డుపడ్డాయి. పాకిస్థాన్పై ఎందుకు యుద్ధం చేయలేదంటూ నినాదాలు చేశాయి. దీంతో అమిత్ షా.. ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ చారిత్రాత్మక వైఫల్యాల కారణంగానే పాకిస్థాన్పై యుద్ధం కొనసాగించలేదన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి బదులుగా ప్రతీకారం తీర్చుకున్నామన్నారు.
ఇది కూడా చదవండి: UP: ప్రియురాలి కోసం అర్ధరాత్రి గ్రామంలోకి ఎంట్రీ.. స్థానికులు ఏం చేశారంటే..!
Also Read
జవహర్లాల్ నెహ్రూ వల్లే పీఓకే ఉనికిలో ఉందన్నారు. 1960లో జరిగిన సింధు జలాల ఒప్పందం గురించి గుర్తుచేశారు. దేశానికి సంబంధించిన 80 శాతం నదీ జలాలను కాంగ్రెస్ పాకిస్థాన్కు అప్పగించిందని ధ్వజమెత్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశం గైర్హాజరవ్వడానికి మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తీసుకున్న నిర్ణయాలే కారణమని ఆరోపించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చైనా ఉంది.. కానీ భారతదేశం లేదన్నారు. భారతదేశం తన స్థానాన్ని దక్కించుకోవడానికి మోడీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం నెహ్రూ తీసుకున్న చారిత్రక వైఖరే కారణమని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Amit Shah: మహాదేవ్ ఆపరేషన్తో పహల్గామ్ ఉగ్రవాదులు హతమయ్యారు
ఇక రాహుల్గాంధీపై కూడా విమర్శలు గుప్పించారు. గాంధీ కుటుంబం చైనాకు అనుకూలంగా ఉంటుందని ఆరోపించారు. డోక్లాంలో మన సైనికుల్ని చైనీయులు వ్యతిరేకంగా నిలబడితే.. రాహుల్గాంధీ మాత్రం చైనా రాయబారిని కలిశారన్నారు. చైనా పట్ల అనుకూల వైఖరి జవహర్లాల్ నెహ్రూ నుంచి సోనియా గాంధీ నుంచి ఇప్పుడు రాహుల్ గాంధీకి సంక్రమించిందని ఆరోపించారు.
మాజీ హోంమంత్రి పి. చిదంబరంపై కూడా నిప్పులు చెరిగారు. పరోక్షంగా చిదంబరం పాకిస్థాన్ను సమర్థిస్తున్నారని ఆరోపించారు. ఉగ్రవాదుల పాకిస్థాన్ గుర్తింపుకు సంబంధించిన ఆధారాలను ప్రశ్నించారని.. పాకిస్థాన్కు క్లీన్ చిట్ ఇవ్వడం వల్ల ఏమి లభిస్తుంది? అని ప్రశ్నించారు. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులు పాకిస్థానీలేనని తెలిపారు. మహాదేవ్ ఆపరేషన్లో హతమైన ఉగ్రవాదుల దగ్గర ఓటరు ఐడీ నంబర్లు ఉన్నాయని… పాకిస్థాన్లో తయారైన చాకెట్లు ఉన్నాయని వెల్లడించారు. పహల్గామ్ దాడిలో ఇస్లామాబాద్ హస్తం ఉందని చెప్పడానికి ఇంతకంటే స్పష్టమైన రుజువు ఏం కావాలని అడిగారు. చిదంబరం పాకిస్థాన్కు మద్దతుగా నిలిచారని.. ఇక ముగ్గురు ఉగ్రవాదులు హతం కావడం కూడా విపక్షాలకు నచ్చకపోవచ్చని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Kashmir Issue: పాకిస్థాన్పై భారత్ ఆగ్రహం.. ఉగ్రవాదాన్ని పెంచే దేశం మానవ హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం..
-
West Bengal repolling: బెంగాల్లో మళ్లీ ఎన్నికల వేడి.. ఫల్తాలో రీ-పోలింగ్ షురూ! అసలు ట్విస్ట్ ఇదే..
-
Manish Pandey: వర్షం వచ్చినా, ఎండ ఉన్నా ఆగం.. కేకేఆర్ హీరో మనీష్ పాండే ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
-
RBI: లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకు మీ మొబైల్ ఫోన్ను లాక్ చేస్తుందా? షాకిస్తున్న ఆర్బిఐ కొత్త ప్రతిపాదన
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!