Amit Shah: పాకిస్థాన్పై ఎందుకు యుద్ధం చేయలేదు.. విపక్షాల ప్రశ్నకు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్
- పాకిస్థాన్పై ఎందుకు యుద్ధం చేయలేదు
- విపక్షాల ప్రశ్నకు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపరేషన్ సిందూర్పై రెండోరోజు వాడీవేడిగా పార్లమెంట్లో చర్చ జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. పదే పదే విపక్షాలు అడ్డుపడ్డాయి. పాకిస్థాన్పై ఎందుకు యుద్ధం చేయలేదంటూ నినాదాలు చేశాయి. దీంతో అమిత్ షా.. ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ చారిత్రాత్మక వైఫల్యాల కారణంగానే పాకిస్థాన్పై యుద్ధం కొనసాగించలేదన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి బదులుగా ప్రతీకారం తీర్చుకున్నామన్నారు.
ఇది కూడా చదవండి: UP: ప్రియురాలి కోసం అర్ధరాత్రి గ్రామంలోకి ఎంట్రీ.. స్థానికులు ఏం చేశారంటే..!
Also Read
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
జవహర్లాల్ నెహ్రూ వల్లే పీఓకే ఉనికిలో ఉందన్నారు. 1960లో జరిగిన సింధు జలాల ఒప్పందం గురించి గుర్తుచేశారు. దేశానికి సంబంధించిన 80 శాతం నదీ జలాలను కాంగ్రెస్ పాకిస్థాన్కు అప్పగించిందని ధ్వజమెత్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశం గైర్హాజరవ్వడానికి మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తీసుకున్న నిర్ణయాలే కారణమని ఆరోపించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చైనా ఉంది.. కానీ భారతదేశం లేదన్నారు. భారతదేశం తన స్థానాన్ని దక్కించుకోవడానికి మోడీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం నెహ్రూ తీసుకున్న చారిత్రక వైఖరే కారణమని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Amit Shah: మహాదేవ్ ఆపరేషన్తో పహల్గామ్ ఉగ్రవాదులు హతమయ్యారు
ఇక రాహుల్గాంధీపై కూడా విమర్శలు గుప్పించారు. గాంధీ కుటుంబం చైనాకు అనుకూలంగా ఉంటుందని ఆరోపించారు. డోక్లాంలో మన సైనికుల్ని చైనీయులు వ్యతిరేకంగా నిలబడితే.. రాహుల్గాంధీ మాత్రం చైనా రాయబారిని కలిశారన్నారు. చైనా పట్ల అనుకూల వైఖరి జవహర్లాల్ నెహ్రూ నుంచి సోనియా గాంధీ నుంచి ఇప్పుడు రాహుల్ గాంధీకి సంక్రమించిందని ఆరోపించారు.
మాజీ హోంమంత్రి పి. చిదంబరంపై కూడా నిప్పులు చెరిగారు. పరోక్షంగా చిదంబరం పాకిస్థాన్ను సమర్థిస్తున్నారని ఆరోపించారు. ఉగ్రవాదుల పాకిస్థాన్ గుర్తింపుకు సంబంధించిన ఆధారాలను ప్రశ్నించారని.. పాకిస్థాన్కు క్లీన్ చిట్ ఇవ్వడం వల్ల ఏమి లభిస్తుంది? అని ప్రశ్నించారు. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులు పాకిస్థానీలేనని తెలిపారు. మహాదేవ్ ఆపరేషన్లో హతమైన ఉగ్రవాదుల దగ్గర ఓటరు ఐడీ నంబర్లు ఉన్నాయని… పాకిస్థాన్లో తయారైన చాకెట్లు ఉన్నాయని వెల్లడించారు. పహల్గామ్ దాడిలో ఇస్లామాబాద్ హస్తం ఉందని చెప్పడానికి ఇంతకంటే స్పష్టమైన రుజువు ఏం కావాలని అడిగారు. చిదంబరం పాకిస్థాన్కు మద్దతుగా నిలిచారని.. ఇక ముగ్గురు ఉగ్రవాదులు హతం కావడం కూడా విపక్షాలకు నచ్చకపోవచ్చని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
-
Dil Raju: టాలీవుడ్కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!