Amit Shah: రాజ్యాంగానికి ఎలాంటి హాని కలుగదు..తప్పుదోవ పట్టించేందుకే ప్రతిపక్షాల విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: రిజర్వేషన్లపై కేంద్రం హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోలు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. కొందరు కావాలనే జనాల్లో భయాందోళనలు రెకెత్తించి, బీజేపీని అడ్డుకునేలా చేసేందుకు ఈ వీడియోలను వైరల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఢిల్లీ పోలీసులు ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. ముఖ్యంగా పలు రాష్ట్రాల్లోని విపక్ష నేతలు, కార్యకర్తలు వీటిని విస్తృతంగా షేర్ చేశారు. ఈ కేసులో అస్సాంకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ వీడియోను తెలంగాణ కాంగ్రెస్ తన ఎక్స్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నిజానికి అమిత్ షా రిజర్వేషన్లను మత ప్రాతిపదికన అమలు చేయమని వ్యాఖ్యానించిన వీడియోను మార్పింగ్ చేసి వైరల్ చేస్తున్నారు.
Read Also: Mahindra XUV 3XO: మహీంద్రా XUV 3XO లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలు..
Also Read
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
ఇదిలా ఉంటే, తాజాగా అమిత్ షా మాట్లాడుతూ.. ఎన్డీయే ప్రభుత్వం రాజ్యాంగానికి ఎప్పటికీ హాని చేయదని, ఓటర్లలో భయాందోళనలు పెంచేందుకు ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు. అస్సాంలో సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అస్సాంలోని అన్ని స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘మనకు ఇప్పటికే పూర్తి మెజారిటీ ఉందని, ప్రతిపక్షాలకు సంపూర్ణ మెజారిటీ వచ్చిన అలవాటు లేదు. ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ రద్దు చేయడానికి సంపూర్ణ మెజారిటీని ఉపయోగించాము. మోడీని ప్రధానిని చేయడానికి, దేశాన్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దడానికి 400 సీట్లు అవసరం’’ అని షా అన్నారు. ఎవరూ కూడా రిజర్వేషన్లను అంతం చేయలేరు, రాజ్యాంగానికి హాని చేయలేరని స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వంలో తీవ్రవాదం వెన్నువిరిచామని అన్నారు. ప్రతిపక్షాలు పాకిస్తాన్ టెర్రరిజంపై పెదవి విప్పడం లేదని అన్నారు. రాహుల్ గాంధీని ఎవరూ సీరియస్గా తీసుకోరని చెప్పారు.
తాజావార్తలు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
-
STORY Board : తెలుగు సినీ పరిశ్రమ సంక్షోభంలో..!
-
Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
-
OTR : అమరావతిపై మంత్రి నారాయణ స్పీడ్ తగ్గిందా? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?