Amit Shah: రాజ్యాంగానికి ఎలాంటి హాని కలుగదు..తప్పుదోవ పట్టించేందుకే ప్రతిపక్షాల విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: రిజర్వేషన్లపై కేంద్రం హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోలు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. కొందరు కావాలనే జనాల్లో భయాందోళనలు రెకెత్తించి, బీజేపీని అడ్డుకునేలా చేసేందుకు ఈ వీడియోలను వైరల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఢిల్లీ పోలీసులు ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. ముఖ్యంగా పలు రాష్ట్రాల్లోని విపక్ష నేతలు, కార్యకర్తలు వీటిని విస్తృతంగా షేర్ చేశారు. ఈ కేసులో అస్సాంకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ వీడియోను తెలంగాణ కాంగ్రెస్ తన ఎక్స్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నిజానికి అమిత్ షా రిజర్వేషన్లను మత ప్రాతిపదికన అమలు చేయమని వ్యాఖ్యానించిన వీడియోను మార్పింగ్ చేసి వైరల్ చేస్తున్నారు.
Read Also: Mahindra XUV 3XO: మహీంద్రా XUV 3XO లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలు..
Also Read
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
ఇదిలా ఉంటే, తాజాగా అమిత్ షా మాట్లాడుతూ.. ఎన్డీయే ప్రభుత్వం రాజ్యాంగానికి ఎప్పటికీ హాని చేయదని, ఓటర్లలో భయాందోళనలు పెంచేందుకు ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు. అస్సాంలో సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అస్సాంలోని అన్ని స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘మనకు ఇప్పటికే పూర్తి మెజారిటీ ఉందని, ప్రతిపక్షాలకు సంపూర్ణ మెజారిటీ వచ్చిన అలవాటు లేదు. ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ రద్దు చేయడానికి సంపూర్ణ మెజారిటీని ఉపయోగించాము. మోడీని ప్రధానిని చేయడానికి, దేశాన్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దడానికి 400 సీట్లు అవసరం’’ అని షా అన్నారు. ఎవరూ కూడా రిజర్వేషన్లను అంతం చేయలేరు, రాజ్యాంగానికి హాని చేయలేరని స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వంలో తీవ్రవాదం వెన్నువిరిచామని అన్నారు. ప్రతిపక్షాలు పాకిస్తాన్ టెర్రరిజంపై పెదవి విప్పడం లేదని అన్నారు. రాహుల్ గాంధీని ఎవరూ సీరియస్గా తీసుకోరని చెప్పారు.
తాజావార్తలు
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
-
2026 Audi Q7: సూపర్ ఫాస్ట్ SUV.. 4.8 సెకన్లలోనే 100 కిమీ వేగాన్ని అందుకునే 2026 Audi Q7
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
Jayam Ravi Case : పిల్లల పాఠశాల ఫీజు, నా భరణం ఏడాదిగా రవి ఇవ్వడం లేదు : ఆర్తి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!