Amit Shah: దశాబ్ద కాలంలో మోడీ చేసినంత అభివృద్ధి ఏ ప్రధానైనా చేశారా? జీఎస్టీని ప్రశంసించిన అమిత్ షా
- దశాబ్ద కాలంలో మోడీ చేసినంత అభివృద్ధి ఏ ప్రధానైనా చేశారా?
- జీఎస్టీని ప్రశంసించిన అమిత్ షా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక దశాబ్ద కాలంలో భారతదేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి కూడా సాధించలేని అభివృద్ధిని మోడీ చేసి చూపించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశంలో ఎన్నో సంస్కరణలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్లు వివరించారు.
ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: ఆదివారం అస్సాం రానున్న సింగర్ జుబీన్ గార్గ్ భౌతికకాయం.. శోకసంద్రంలో అభిమానులు
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
ప్రస్తుతం ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయని ఆరోపించారు. ప్రజలు వారిని జవాబుదారీగా చేస్తారని పేర్కొన్నారు. 16 వేర్వేరు పన్నులను ఒకే చట్రంలోకి ఏకీకృతం చేసి.. వ్యవస్థను మరింత పౌర కేంద్రీకృతం చేసేందుకు జీఎస్టీ విషయంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు.
ఇది కూడా చదవండి: Trump-Netanyahu: నెతన్యాహు మోసం చేశాడు.. ఖతార్ దాడులపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి
ప్రజాస్వామ్యం, పాలన, జాతీయ భద్రత, విదేశాంగ విధానం, జీఎస్టీ సంస్కరణలు ఇలా ఎన్నో మోడీ నాయకత్వంలో జరిగాయని తెలిపారు. కానీ ప్రతిపక్షాలు ఉపయోగించే భాష మాత్రం ప్రజాస్వామ్య మూలాలను బలహీనపరిచే విధంగా ఉన్నాయని ఆరోపించారు. అలాంటి వ్యక్తులను ప్రజలు జవాబుదారీగా ఉంచాలన్నారు. మోడీ తల్లి గురించి అగౌరవంగా మాట్లాడిన వారిని ప్రజలే శిక్షించాలని అమిత్ షా కోరారు.
మోడీ కారణంగా ప్రపంచ దేశాల సంబంధాలు భారతదేశానికి ప్రయోజనం చేకూర్చాయన్నారు. ప్రపంచ నాయకులందరితో మోడీకి మంచి సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఈ సంబంధాలన్నీ కూడా దేశానికి ఎంతగానో ప్రయోజనకరంగా ఉపయోగపడుతున్నట్లు తెలిపారు. మోడీ 11 ఏళ్ల పాలనలో ఉగ్రవాదాన్ని అరికట్టారని తెలిపారు. దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి ఉగ్రవాదం పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమే ఉదాహరణ అన్నారు. ఆపరేషన్ సిందూర్, మహాదేవ్ ఆపరేషన్లే ఉదాహరణలు అని చెప్పారు.
కోవిడ్-19పై మోడీ ప్రభుత్వం పెద్ద విజయం సాధించిందన్నారు. మహమ్మారిని సమర్థవంతమైన పాలనతో అడ్డుకోగలిగామని చెప్పారు. అలాగే పేదరిక నిర్మూలన కోసం కూడా విశేష కృషి చేశారని స్పష్టం చేశారు. ఇంత గొప్ప విజయాన్ని ఈ పదేళ్లలో మోడీ చేసినట్టుగా ఏ ప్రధానైనా చేయగలిగారా? అని అమిత్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!