Amit Shah: అగ్నిపథ్ స్కీమ్ పై స్పందన.. ఆందోళనలపై కిషన్ రెడ్డితో మాట్లాడిన అమిత్ షా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా అగ్నిపథ్ స్కీమ్ ప్రకంపనలు పుట్టిస్తోంది. మొన్నబీహార్ లో మొదలైన ఆందోళనలు నెమ్మదిగా ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ఆర్మీ ఆశావహులు రోడ్డెక్కారు. ముఖ్యంగా రైల్వే ఆస్తులను టార్గెట్ చేస్తూ విధ్వంసం చేస్తున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా 200పైగా ట్రైన్స్ పై ప్రభావం పడింది. ఇదిలా ఉంటే ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిరసనకారులు రైళ్లకు మంటపెట్టారు. హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. ఈ ఘటనల్లో ఒకరు మరణించారు.
ఇదిలా ఉంటే అగ్నిపథ్ స్కీమ్ పై కేంద్ర మంత్రులు స్పందిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, క్రీడలు, యువజన శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ అగ్నిపథ్ స్కీమ్ వల్ల దేశానికి, యువతకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఇండియన్ ఆర్మీ మరింత బలోపేతం అవుతుందని వాళ్లు అభిప్రాయపడ్డారు.
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
ఇదిలా ఉంటే తాజాగా కేంద్రం హోంమంత్రి అమిత్ షా అగ్నిపథ్ స్కీమ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న అల్లర్లపై స్పందించారు. గత రెండేళ్ళలో, కరోనా మహమ్మారి కారణంగా సైన్యంలో నియామక ప్రక్రియ ప్రభావితమైందని..ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ‘అగ్నిపథ్ యోజన’లో యువకుల ప్రయోజనాలను సంరక్షిస్తూ, అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచారని అన్నారు. ప్రస్తుతం ఉన్న వయోపరిమితిని 21 ఏళ్ల నుంచి 23 ఏళ్లకు పెంచారని..దీని వల్ల యువత పెద్ద సంఖ్యలో ప్రయోజనం పొందుతుందని.. అగ్నిపథ్ స్కీమ్ ద్వారా వారు దేశానికి సేవ చేసే దిశలో ముందుకు వెళ్లారని అన్నారు. ఇదిలా ఉంటే సికింద్రాబాద్ లో చెలరేగిన హింసపై అమిత్ షా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడారు. హింసకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు.
తాజావార్తలు
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!