Amit Shah: అగ్నిపథ్ స్కీమ్ పై స్పందన.. ఆందోళనలపై కిషన్ రెడ్డితో మాట్లాడిన అమిత్ షా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా అగ్నిపథ్ స్కీమ్ ప్రకంపనలు పుట్టిస్తోంది. మొన్నబీహార్ లో మొదలైన ఆందోళనలు నెమ్మదిగా ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ఆర్మీ ఆశావహులు రోడ్డెక్కారు. ముఖ్యంగా రైల్వే ఆస్తులను టార్గెట్ చేస్తూ విధ్వంసం చేస్తున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా 200పైగా ట్రైన్స్ పై ప్రభావం పడింది. ఇదిలా ఉంటే ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిరసనకారులు రైళ్లకు మంటపెట్టారు. హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. ఈ ఘటనల్లో ఒకరు మరణించారు.
ఇదిలా ఉంటే అగ్నిపథ్ స్కీమ్ పై కేంద్ర మంత్రులు స్పందిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, క్రీడలు, యువజన శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ అగ్నిపథ్ స్కీమ్ వల్ల దేశానికి, యువతకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఇండియన్ ఆర్మీ మరింత బలోపేతం అవుతుందని వాళ్లు అభిప్రాయపడ్డారు.
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
ఇదిలా ఉంటే తాజాగా కేంద్రం హోంమంత్రి అమిత్ షా అగ్నిపథ్ స్కీమ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న అల్లర్లపై స్పందించారు. గత రెండేళ్ళలో, కరోనా మహమ్మారి కారణంగా సైన్యంలో నియామక ప్రక్రియ ప్రభావితమైందని..ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ‘అగ్నిపథ్ యోజన’లో యువకుల ప్రయోజనాలను సంరక్షిస్తూ, అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచారని అన్నారు. ప్రస్తుతం ఉన్న వయోపరిమితిని 21 ఏళ్ల నుంచి 23 ఏళ్లకు పెంచారని..దీని వల్ల యువత పెద్ద సంఖ్యలో ప్రయోజనం పొందుతుందని.. అగ్నిపథ్ స్కీమ్ ద్వారా వారు దేశానికి సేవ చేసే దిశలో ముందుకు వెళ్లారని అన్నారు. ఇదిలా ఉంటే సికింద్రాబాద్ లో చెలరేగిన హింసపై అమిత్ షా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడారు. హింసకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు.
తాజావార్తలు
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!