Amit shah: 15 రోజులు బెంగాల్లోనే ఉంటా.. మమత సర్కార్ను గద్దె దించుతామని సవాల్
- 15 రోజులు బెంగాల్లోనే ఉంటా
- మమత సర్కార్ను గద్దె దించుతామని సవాల్
- సువేందు అధికారి నామినేషన్కు హాజరైన షా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
15 రోజుల పాటు బెంగాల్లోనే ఉంటానని.. మమత సర్కార్ను గద్దె దించుతామని అమిత్ షా సవాల్ విసిరారు. సువేందు అధికారి నామినేషన్ కార్యక్రమానికి అమిత్ షా హాజరయ్యారు. అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ.. తాను రాబోయే 15 రోజుల పాటు బెంగాల్లోనే ఉంటానని కీలక ప్రకటన చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని రాష్ట్ర ప్రజలు ఇప్పుడు నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు.
సువేందు అధికారి నామినేషన్ కోసమే ప్రత్యేకంగా బెంగాల్కు వచ్చానని.. సువేందు విజయం బెంగాల్లో మార్పునకు పునాది వేస్తుందన్నారు. గతసారి నందిగ్రామ్లో ఓడిపోయిన మమతా బెనర్జీ.. ఈసారి భవానీపూర్తో పాటు యావత్ బెంగాల్లోనూ ఓడిపోతారని జోస్యం చెప్పారు. సువేందు అధికారి నామినేషన్ బెంగాల్లో టీఎంసీ పతనానికి నాంది అని అన్నారు. ఈసారి నందిగ్రామ్ ప్రజలు చరిత్రను పునరావృతం చేసి మమతా బెనర్జీని అధికారం నుంచి గద్దె దించుతారని ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- US-India-Russia: చమురు విషయంలో రష్యా హామీ.. అమెరికా ముందు భారత్ కీలక డిమాండ్..
- Monsoon Alert: భారతీయులకు శుభవార్త.. 5 రోజుల ముందే అండమాన్ను తాకనున్న తొలకరి జల్లు
- Uttar Pradesh: టీ-షర్ట్, ప్యాంట్ వేసుకోవడంపై గొడవ.. భార్యను చంపిన భర్త ఆత్మహత్య..
- Prateek Yadav: అల్లుడి చితికి నిప్పంటించిన మామ.. మాజీ సీఎం తమ్ముడి అంత్యక్రియలు పూర్తి
ఇది కూడా చదవండి: Trump: ఇరాన్తో ఒప్పందం చేసుకునే ప్రసక్తే లేదు.. 3 వారాల్లో కఠిన చర్యలుంటాయని వార్నింగ్
తాను బెంగాల్ రాష్ట్రమంతా పర్యటించానని, తాను వెళ్లిన ప్రతిచోటా ఒకే స్వరం విన్నానని పేర్కొన్నారు. మమతా బెనర్జీకి వీడ్కోలు పలకండి. ప్రభుత్వానికి వీడ్కోలు పలకండి. మమతా బెనర్జీకి గుడ్ బై చెప్పండి అనే ఒకే స్వరం మాత్రమే తనకు వినిపించిందని పేర్కొన్నారు. దోపిడీ, గూండాయిజంతో బెంగాల్ ప్రజలు పూర్తిగా విసిగిపోయారని ఆరోపించారు. తరచుగా జరుగుతున్న బాంబు పేలుళ్లు, నిరుద్యోగంతో యువత ఇబ్బందులు పడుతోందన్నారు. టీఎంసీ ప్రభుత్వం చొరబాటుదారులకు ఆశ్రయం కల్పిస్తోందని.. దీంతో రాష్ట్ర జనాభా స్వరూపాన్ని మారుస్తోందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగాన్ని నిర్మూలించి.. నూతన అభివృద్ధిని తీసుకువస్తామని..తద్వారా బెంగాల్ తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందగలదని అమిత్ షా యువతకు హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Trump: అమెరికా నాశనం కావాలని కోరుకున్న వారి అంతు చూశాం
తాజావార్తలు
-
Adani Group: అదానీ వేల కోట్ల సామ్రాజ్యంలోకి మరొక కంపెనీ.. ఇకపై జీవీకే ఎనర్జీ అదానీ సొంతం!
-
US-India-Russia: చమురు విషయంలో రష్యా హామీ.. అమెరికా ముందు భారత్ కీలక డిమాండ్..
-
Monsoon Alert: భారతీయులకు శుభవార్త.. 5 రోజుల ముందే అండమాన్ను తాకనున్న తొలకరి జల్లు
-
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’!
-
Akash Ambani: జియో సామ్రాజ్యానికి కొత్త బాస్.. అంబానీ వారసుడి చేతికి జియో ప్లాట్ఫామ్స్ పగ్గాలు!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?