Live in Relationships: సహజీవనం తప్పేమీకాదు.. జంటలకు రక్షణ కల్పించాలన్న హైకోర్టు
- లివింగ్ రిలేషన్ షిప్ తప్పేమీ కాదు
- మహిళలను ప్రశాంతంగా జీవించనివ్వండి
- జంటలకు రక్షణ కల్పించాల్సిందేనన్న హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాహ బంధానికి భారతదేశంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. దేశంలో సంస్కృతి, సాంప్రదాయాలు ఉన్నాయి. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే సమాజం అంగీకరించదు. ఈ మధ్య వివాహేతర సంబంధాలు కారణంగా ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో తెలిసిందే. పడక సుఖం కోసం కట్టుకున్నవాళ్లనే కడతేరుస్తున్న రోజులవి. ఇలాంటి తరుణంలో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ‘‘లివింగ్ రిలేషన్ షిప్’’ ఏ మాత్రం తప్పు కాదని.. మహిళల ప్రశాంత జీవనానికి భంగం కలిగించొద్దని సూచించింది. జంటలకు రక్షణ కల్పించాల్సిందేనని పోలీసులకు ఆదేశిస్తూ న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్కు గుడ్న్యూస్.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
సహజీవనం చేస్తున్న 12 జంటలు తమకు రక్షణ కల్పించాలంటూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. లివింగ్ రిలేషన్ షిప్ సంబంధాలను చట్టవిరుద్ధం అని చెప్పలేమని పేర్కొంది. మ్యారేజ్ సర్టిఫికెట్ లేనంతమాత్రాన కలిసి జీవించడం ఏ మాత్రం నేరం కాదని జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ సింగిల్ బెంచ్ అభిప్రాయపడింది. లివిన్ రిలేషన్షిప్లో ఉన్న 12 మంది మహిళలకు రక్షణ కల్పించాలని జిల్లాల పోలీసు ఉన్నతాధికారులను కోర్టు ఆదేశించింది. మహిళల ప్రశాంత జీవనానికి ఎవరైనా భంగం కలిగిస్తే వారిపై చర్యలు తీసుకోవాల్సిందని సూచించింది. ఈ తీర్పు అందరికీ ఆమోదయోగ్యం కాకపోవచ్చని అభిప్రాయపడింది.
ఇది కూడా చదవండి: Obama: ఈ ఏడాది ఒబామాను మెప్పించిన సినిమాలు ఇవే!
‘‘మైనర్ లేదా మేజర్. వివాహిత లేదా అవివాహిత అనే తేడా లేకుండా జీవించే హక్కు ఉందని.. దీన్ని చాలా ఉన్నత స్థాయిలో పరిగణించాలి. పిటిషనర్లు వివాహం చేసుకోలేదనే విషయం వాస్తవం. భారత రాజ్యాంగంలో భారత పౌరులుగా జీవించే ప్రాథమిక హక్కు వారికి ఉంది.’’ అని జస్టిస్ సింగ్ పేర్కొన్నారు. విద్యావంతులైన మహిళలు సొంత ఇష్ట ప్రకారం జీవించాలని అనుకున్నవాళ్లకు పోలీసులు రక్షణ కల్పించాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
-
H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
-
Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!