Supreme Court: అర్చకులు కావడానికి అన్ని కులాల వారూ అర్హులే: సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: అర్చకులు కావడానికి అన్ని కులాల వారూ అర్హులేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే వారు ఆగమశాస్త్ర నియమాల ప్రకారం అర్హత పొందిన వారై ఉండాల్సి ఉంటుంది. కోయిల్ ఆగమ నిబంధనలకు అర్హులైన ఎవరైనా పూజారి కావచ్చని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. సేలం సుఖవనేశ్వర్ ఆలయంలో పూజారి నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ 2018లో ఆలయ పాలకమండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ అదే ఆలయంలో పనిచేస్తున్న సుబ్రమణ్య గురువు మద్రాసు హైకోర్టులో కేసు వేశారు. అందులో సుగణేశ్వరాలయం ఆగమానికి ఆధారమని, ఈ నోటీసులో పేర్కొన్న విశేషాలు ఆగమానికి ఆధారం కాదని పిటిషన్ లో పేర్కొన్నారు. దీన్ని విచారించిన జస్టిస్ ఆనంద్ వెంకటేశ్ ఆలయ ఆగమ నియమాలు, పూజా విధానాల్లో ఉత్తీర్ణత పొందిన వారెవరైనా అర్చకులు కావచ్చని తీర్పునిచ్చారు. ఈ తీర్పునే మద్రాసు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం సమర్ధించింది.
Read Also: CM KCR: నేడు కేసీఆర్ మెదక్ పర్యటన.. రూ.4016 పింఛన్ పంపిణీ చేయనున్న సీఎం
Also Read
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- LPG Demand Drop: అమాంతం పడిపోయిన LPG వినియోగం.. పెట్రోల్, డీజిల్ రివర్స్.. !
- DK.Shivakumar: ముఖ్యమంత్రిగా యువతపై డీకే.శివకుమార్ వరాల జల్లు.. విద్యార్థులందరికీ ఫ్రీ బస్ పాస్లు
- Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
మద్రాస్ హైకోర్టు తీర్పుపై సుబ్రమణియ సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. ఈ కేసు న్యాయమూర్తులు ఎంఎం సుందరేశన్, బాల్కీవాలాలతో కూడిన ధర్మాసనం ముందు మంగళవారం విచారణకు వచ్చింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తులు ఆలయ ఆగమ నిబంధనలను ఆమోదించిన ఎవరైనా అర్చకులు కావచ్చని.. మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ధృవీకరించి, సుబ్రహ్మణ్య గురువు పిటిషన్ను కొట్టివేసింది. అన్ని కులాల వారూ అర్చకులు కావచ్చన్న మద్రాసు హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించడానికి నిరాకరించింది. ఆగమ నియమాల ప్రకారం ఉత్తీర్ణత సాధించి తగిన శిక్షణ, పూజ చేయడానికి అర్హత పొందిన వారెవరైనా అర్చకులు కావచ్చని తెలిపింది.
గతంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన స్టాలిన్.. హిందూ ధార్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు దేవాలయాల్లో దళితులతోపాటు అన్ని కులాలకు చెందిన 28 మందిని పూజారులుగా నియమించారు. దీనిపై దాఖలైన వ్యాజ్యంలో తీర్పునిచ్చిన మద్రాసు హైకోర్టు.. అర్చకుల నియామకానికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వం విధించిన నిబంధనలు వర్తిస్తాయని, ఆగమ నిబంధనల ప్రకారమే అర్చకులను నియమించాలని తీర్పునివ్వడం గమనార్హం. ఆగమ నియమాల ప్రకారం ఆలయాలు నిర్వహించబడతాయి.
తాజావార్తలు
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
-
Betting: కోట్లు కురిపించే ‘క్రికెట్ బెట్టింగ్’ డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
-
Pregnancy Care : లక్షణాలు లేకున్నా ప్రమాదమే.. గర్భధారణలో ఈ టెస్ట్ తప్పనిసరి!
-
Nandu World: వాళ్లిద్దరూ యూట్యూబ్లో ఫేమస్.. చేసేది మాత్రం..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!