Supreme Court: అర్చకులు కావడానికి అన్ని కులాల వారూ అర్హులే: సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: అర్చకులు కావడానికి అన్ని కులాల వారూ అర్హులేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే వారు ఆగమశాస్త్ర నియమాల ప్రకారం అర్హత పొందిన వారై ఉండాల్సి ఉంటుంది. కోయిల్ ఆగమ నిబంధనలకు అర్హులైన ఎవరైనా పూజారి కావచ్చని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. సేలం సుఖవనేశ్వర్ ఆలయంలో పూజారి నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ 2018లో ఆలయ పాలకమండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ అదే ఆలయంలో పనిచేస్తున్న సుబ్రమణ్య గురువు మద్రాసు హైకోర్టులో కేసు వేశారు. అందులో సుగణేశ్వరాలయం ఆగమానికి ఆధారమని, ఈ నోటీసులో పేర్కొన్న విశేషాలు ఆగమానికి ఆధారం కాదని పిటిషన్ లో పేర్కొన్నారు. దీన్ని విచారించిన జస్టిస్ ఆనంద్ వెంకటేశ్ ఆలయ ఆగమ నియమాలు, పూజా విధానాల్లో ఉత్తీర్ణత పొందిన వారెవరైనా అర్చకులు కావచ్చని తీర్పునిచ్చారు. ఈ తీర్పునే మద్రాసు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం సమర్ధించింది.
Read Also: CM KCR: నేడు కేసీఆర్ మెదక్ పర్యటన.. రూ.4016 పింఛన్ పంపిణీ చేయనున్న సీఎం
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
మద్రాస్ హైకోర్టు తీర్పుపై సుబ్రమణియ సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. ఈ కేసు న్యాయమూర్తులు ఎంఎం సుందరేశన్, బాల్కీవాలాలతో కూడిన ధర్మాసనం ముందు మంగళవారం విచారణకు వచ్చింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తులు ఆలయ ఆగమ నిబంధనలను ఆమోదించిన ఎవరైనా అర్చకులు కావచ్చని.. మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ధృవీకరించి, సుబ్రహ్మణ్య గురువు పిటిషన్ను కొట్టివేసింది. అన్ని కులాల వారూ అర్చకులు కావచ్చన్న మద్రాసు హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించడానికి నిరాకరించింది. ఆగమ నియమాల ప్రకారం ఉత్తీర్ణత సాధించి తగిన శిక్షణ, పూజ చేయడానికి అర్హత పొందిన వారెవరైనా అర్చకులు కావచ్చని తెలిపింది.
గతంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన స్టాలిన్.. హిందూ ధార్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు దేవాలయాల్లో దళితులతోపాటు అన్ని కులాలకు చెందిన 28 మందిని పూజారులుగా నియమించారు. దీనిపై దాఖలైన వ్యాజ్యంలో తీర్పునిచ్చిన మద్రాసు హైకోర్టు.. అర్చకుల నియామకానికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వం విధించిన నిబంధనలు వర్తిస్తాయని, ఆగమ నిబంధనల ప్రకారమే అర్చకులను నియమించాలని తీర్పునివ్వడం గమనార్హం. ఆగమ నియమాల ప్రకారం ఆలయాలు నిర్వహించబడతాయి.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!