Supreme Court: అర్చకులు కావడానికి అన్ని కులాల వారూ అర్హులే: సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: అర్చకులు కావడానికి అన్ని కులాల వారూ అర్హులేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే వారు ఆగమశాస్త్ర నియమాల ప్రకారం అర్హత పొందిన వారై ఉండాల్సి ఉంటుంది. కోయిల్ ఆగమ నిబంధనలకు అర్హులైన ఎవరైనా పూజారి కావచ్చని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. సేలం సుఖవనేశ్వర్ ఆలయంలో పూజారి నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ 2018లో ఆలయ పాలకమండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ అదే ఆలయంలో పనిచేస్తున్న సుబ్రమణ్య గురువు మద్రాసు హైకోర్టులో కేసు వేశారు. అందులో సుగణేశ్వరాలయం ఆగమానికి ఆధారమని, ఈ నోటీసులో పేర్కొన్న విశేషాలు ఆగమానికి ఆధారం కాదని పిటిషన్ లో పేర్కొన్నారు. దీన్ని విచారించిన జస్టిస్ ఆనంద్ వెంకటేశ్ ఆలయ ఆగమ నియమాలు, పూజా విధానాల్లో ఉత్తీర్ణత పొందిన వారెవరైనా అర్చకులు కావచ్చని తీర్పునిచ్చారు. ఈ తీర్పునే మద్రాసు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం సమర్ధించింది.
Read Also: CM KCR: నేడు కేసీఆర్ మెదక్ పర్యటన.. రూ.4016 పింఛన్ పంపిణీ చేయనున్న సీఎం
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
మద్రాస్ హైకోర్టు తీర్పుపై సుబ్రమణియ సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. ఈ కేసు న్యాయమూర్తులు ఎంఎం సుందరేశన్, బాల్కీవాలాలతో కూడిన ధర్మాసనం ముందు మంగళవారం విచారణకు వచ్చింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తులు ఆలయ ఆగమ నిబంధనలను ఆమోదించిన ఎవరైనా అర్చకులు కావచ్చని.. మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ధృవీకరించి, సుబ్రహ్మణ్య గురువు పిటిషన్ను కొట్టివేసింది. అన్ని కులాల వారూ అర్చకులు కావచ్చన్న మద్రాసు హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించడానికి నిరాకరించింది. ఆగమ నియమాల ప్రకారం ఉత్తీర్ణత సాధించి తగిన శిక్షణ, పూజ చేయడానికి అర్హత పొందిన వారెవరైనా అర్చకులు కావచ్చని తెలిపింది.
గతంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన స్టాలిన్.. హిందూ ధార్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు దేవాలయాల్లో దళితులతోపాటు అన్ని కులాలకు చెందిన 28 మందిని పూజారులుగా నియమించారు. దీనిపై దాఖలైన వ్యాజ్యంలో తీర్పునిచ్చిన మద్రాసు హైకోర్టు.. అర్చకుల నియామకానికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వం విధించిన నిబంధనలు వర్తిస్తాయని, ఆగమ నిబంధనల ప్రకారమే అర్చకులను నియమించాలని తీర్పునివ్వడం గమనార్హం. ఆగమ నియమాల ప్రకారం ఆలయాలు నిర్వహించబడతాయి.
తాజావార్తలు
-
Rohit Sharma Retirement Rumours: లార్డ్స్ వన్డే చివరి మ్యాచ్?.. రోహిత్ శర్మ రిటైర్మెంట్పై బీసీసీఐ క్లారిటీ..!
-
Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’కి ఏ సర్టిఫికేట్.. విడుదలకు ముందే పెరిగిన హైప్
-
Astrology: జూలై 18 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?