Mumbai Boy: అయ్యో పాపం.. చిన్న పిల్లాడికి ఒకేసారి మూడు వ్యాధులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Boy: మహారాష్ట్రలో 14 ఏళ్ల బాలుడు అనారోగ్యంతో మృతి చెందాడు. అతడిని ఆగస్టు 1 నుంచే అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఇంటిలో వారి ఆర్థిక పరిస్థితి బాగాలేక ఆసుపత్రికి వెళ్లలేదు. దీంతో ఆగస్టు 14న అనారోగ్యం తీవ్రం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో హాస్పిటల్కు వెళ్లారు. ఆసుపత్రిలో బాలుడికి చికిత్స అందించిన వైద్యులు డెంగ్యూ, మలేరియాగా గుర్తించారు. దాంతోపాటు లెఫ్టోసి్పోసిస్ వ్యాధి కూడా సోకడం మూడు వ్యాధులు ఒకేసారి సోకడంతో బాలుడు మరణించాడు. బాలుడికి చికిత్స అందించిన సీనియర్ వైద్యుడు గిరీష్ రాజాధ్యక్ష మాట్లాడుతూ.. మూడు వ్యాధులు ఒకేసారి సోకడం చాలా అరుదుగా జరుగుతుందని చెప్పారు. ముంబై కుర్లాకు చెందిన 14 ఏళ్ల ఈ బాలుడు ఏకకాలంలో డెంగ్యూ, మలేరియా, లెప్టోస్పిరోసిస్తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ నెల ప్రారంభంలో తొలుత బాలుడికి జ్వరం వచ్చింది. అయినప్పటికీ తల్లిదండ్రులు వైద్యుడిని సంప్రదించలేదు. ఇంటికి దగ్గరలోని స్థానిక వైద్యుడినే వీరు ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆగస్ట్ 14న ప్రభుత్వ ఆధ్వర్యంలోని కస్తూర్బా ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో డెంగ్యూ, మలేరియా పాజిటివ్గా తేలింది. ఆశ్చర్యకరంగా అదనపు పరీక్షలో పిల్లాడికి లెప్టోస్పిరోసిస్ కూడా వున్నట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే బాలుడి పరిస్ధితి విషమించడంతో ముంబై సెంట్రల్లోని నాయర్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యల కారణంగా బాలుడిని వెంటిలేటర్పై వుంచారు. శ్వాసకోశ సమస్యలతో అతని క్రియాటినిన్ స్థాయిలు కూడా ఎక్కువగా వున్నాయని నివేదికలో వైద్యులు పేర్కొన్నారు.
Read Also: Vijay varma : ఆ అభిమాని అడిగిన ప్రశ్నకు మండిపడిన విజయ్ వర్మ..
Also Read
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
- Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
- Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
వ్యాప్తిచెందే లక్షణాలు, ఇన్ఫెక్షన్లు , మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్స్ను నియంత్రించడానికి వైద్యులు ప్రయత్నించినప్పటికీ బాలుడు ఆసుపత్రిలో చేరిన మూడు రోజుల్లోనే మరణించాడు. సీనియర్ వైద్యుడు గిరీష్ రాజాధ్యక్ష ప్రకారం.. మూడు వ్యాధులు ఒకేసారి సోకడం చాలా అరుదుగా జరుగుతుందన్నారు. ముందుగానే వైద్య సహాయం అందించి వుంటే బాలుడు ప్రాణాలతో వుండేవాడని వైద్యులు తెలిపారు. ముంబై పౌర సంఘం వర్షాకాల నివేదిక ప్రకారం.. ఆగస్టులో డెంగ్యూ, మలేరియా కేసులు గణనీయంగా పెరిగినట్టు తేలింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) ఆగస్టులో 959 మలేరియా కేసులు, 265 లెప్టోస్పిరోసిస్ కేసులు నమోదైనట్లుగా తేల్చింది. డాక్టర్ గిరీష్ రాజాధ్యక్ష మాట్లాడుతూ, అతని ర్యాగింగ్ లక్షణాలను మరియు బహుళ అవయవ వైఫల్యాన్ని నిర్వహించడానికి ప్రయత్నించడమే కాకుండా దువ్వెన చికిత్సను కూడా ప్రారంభించారని చెప్పారు. లెప్టోస్పిరోసిస్ అనేది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది డెంగ్యూ మరియు మలేరియా రెండూ దోమల కాటు ద్వారా సంక్రమించాయి. ప్రస్తుతం నగరంలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతంలో లెప్టోస్పిరోసిస్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంటుందని ఈ మూడు ఒకేసారి సోకడం అసాధ్యం కాదు కానీ.. ఇది చాలా అరుదైన సంఘటన అని డాక్టర్ రాజాధ్యక్ష అన్నారు. తన మొత్తం కెరీర్లో ఇటువంటి ఏకకాలిక ట్రిపుల్ ఇన్ఫెక్షన్ల యొక్క కేసులను కేవలం 2, 3 మాత్రమే చూశానని తెలిపారు. నగర వైద్యుల ప్రకారం లెప్టోస్పిరోసిస్ కేసులు ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయి, డెంగ్యూ మరియు మలేరియా పెరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
-
Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!