Mumbai Boy: అయ్యో పాపం.. చిన్న పిల్లాడికి ఒకేసారి మూడు వ్యాధులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Boy: మహారాష్ట్రలో 14 ఏళ్ల బాలుడు అనారోగ్యంతో మృతి చెందాడు. అతడిని ఆగస్టు 1 నుంచే అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఇంటిలో వారి ఆర్థిక పరిస్థితి బాగాలేక ఆసుపత్రికి వెళ్లలేదు. దీంతో ఆగస్టు 14న అనారోగ్యం తీవ్రం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో హాస్పిటల్కు వెళ్లారు. ఆసుపత్రిలో బాలుడికి చికిత్స అందించిన వైద్యులు డెంగ్యూ, మలేరియాగా గుర్తించారు. దాంతోపాటు లెఫ్టోసి్పోసిస్ వ్యాధి కూడా సోకడం మూడు వ్యాధులు ఒకేసారి సోకడంతో బాలుడు మరణించాడు. బాలుడికి చికిత్స అందించిన సీనియర్ వైద్యుడు గిరీష్ రాజాధ్యక్ష మాట్లాడుతూ.. మూడు వ్యాధులు ఒకేసారి సోకడం చాలా అరుదుగా జరుగుతుందని చెప్పారు. ముంబై కుర్లాకు చెందిన 14 ఏళ్ల ఈ బాలుడు ఏకకాలంలో డెంగ్యూ, మలేరియా, లెప్టోస్పిరోసిస్తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ నెల ప్రారంభంలో తొలుత బాలుడికి జ్వరం వచ్చింది. అయినప్పటికీ తల్లిదండ్రులు వైద్యుడిని సంప్రదించలేదు. ఇంటికి దగ్గరలోని స్థానిక వైద్యుడినే వీరు ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆగస్ట్ 14న ప్రభుత్వ ఆధ్వర్యంలోని కస్తూర్బా ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో డెంగ్యూ, మలేరియా పాజిటివ్గా తేలింది. ఆశ్చర్యకరంగా అదనపు పరీక్షలో పిల్లాడికి లెప్టోస్పిరోసిస్ కూడా వున్నట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే బాలుడి పరిస్ధితి విషమించడంతో ముంబై సెంట్రల్లోని నాయర్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యల కారణంగా బాలుడిని వెంటిలేటర్పై వుంచారు. శ్వాసకోశ సమస్యలతో అతని క్రియాటినిన్ స్థాయిలు కూడా ఎక్కువగా వున్నాయని నివేదికలో వైద్యులు పేర్కొన్నారు.
Read Also: Vijay varma : ఆ అభిమాని అడిగిన ప్రశ్నకు మండిపడిన విజయ్ వర్మ..
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- Maharashtra: ఘోర విషాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి
- UP: భర్త కోసం టవరెక్కిన మహిళ.. గంట తర్వాత ఏం జరిగిందంటే..!
వ్యాప్తిచెందే లక్షణాలు, ఇన్ఫెక్షన్లు , మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్స్ను నియంత్రించడానికి వైద్యులు ప్రయత్నించినప్పటికీ బాలుడు ఆసుపత్రిలో చేరిన మూడు రోజుల్లోనే మరణించాడు. సీనియర్ వైద్యుడు గిరీష్ రాజాధ్యక్ష ప్రకారం.. మూడు వ్యాధులు ఒకేసారి సోకడం చాలా అరుదుగా జరుగుతుందన్నారు. ముందుగానే వైద్య సహాయం అందించి వుంటే బాలుడు ప్రాణాలతో వుండేవాడని వైద్యులు తెలిపారు. ముంబై పౌర సంఘం వర్షాకాల నివేదిక ప్రకారం.. ఆగస్టులో డెంగ్యూ, మలేరియా కేసులు గణనీయంగా పెరిగినట్టు తేలింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) ఆగస్టులో 959 మలేరియా కేసులు, 265 లెప్టోస్పిరోసిస్ కేసులు నమోదైనట్లుగా తేల్చింది. డాక్టర్ గిరీష్ రాజాధ్యక్ష మాట్లాడుతూ, అతని ర్యాగింగ్ లక్షణాలను మరియు బహుళ అవయవ వైఫల్యాన్ని నిర్వహించడానికి ప్రయత్నించడమే కాకుండా దువ్వెన చికిత్సను కూడా ప్రారంభించారని చెప్పారు. లెప్టోస్పిరోసిస్ అనేది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది డెంగ్యూ మరియు మలేరియా రెండూ దోమల కాటు ద్వారా సంక్రమించాయి. ప్రస్తుతం నగరంలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతంలో లెప్టోస్పిరోసిస్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంటుందని ఈ మూడు ఒకేసారి సోకడం అసాధ్యం కాదు కానీ.. ఇది చాలా అరుదైన సంఘటన అని డాక్టర్ రాజాధ్యక్ష అన్నారు. తన మొత్తం కెరీర్లో ఇటువంటి ఏకకాలిక ట్రిపుల్ ఇన్ఫెక్షన్ల యొక్క కేసులను కేవలం 2, 3 మాత్రమే చూశానని తెలిపారు. నగర వైద్యుల ప్రకారం లెప్టోస్పిరోసిస్ కేసులు ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయి, డెంగ్యూ మరియు మలేరియా పెరుగుతున్నాయి.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!