Akhilesh Yadav: ప్రభుత్వంతో డీల్..? కాంగ్రెస్ తీరుపై అఖిలేష్ అనుమానాలు..
- నీట్ చర్చలో మాట్లాడే అవకాశం రాక అఖిలేష్ అసంతృప్తి.
- కాంగ్రెస్, ప్రభుత్వానికి మాట్లాడే అవకాశం ఇవ్వడంపై ప్రశ్నలు.
- "ప్రభుత్వం-కాంగ్రెస్ మధ్య ఒప్పందం జరిగిందా?" అంటూ వ్యాఖ్య.
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhilesh Yadav: నీట్ ఉద్యమం విషయంలో ప్రతిపక్షాలైన కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)ల మధ్య విభేదాలు తలెత్తాయి. లోక్సభ బయట ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఒప్పందం కుదిరిందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. లోక్సభలో స్పీకర్ కేసీ వేణుగోపాల్, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజులకు మాట్లాడే అవకాశం ఇవ్వడంతో, ‘‘ప్రభుత్వం-కాంగ్రెస్ మధ్య ఒప్పందం జరిగిందా.?’’అని స్పీకర్ను ప్రశ్నించారు.
బుధవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇవ్వాలని, నీట్ పేపర్ లీక్పై చర్చ కోరుతూ ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ గందరగోళం మధ్య స్పీకర్ ఓం బిర్లా ఇద్దరు నేతలకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. దీనిపై అఖిలేష్ మాట్లాడుతూ.. ‘‘ఇది కాంగ్రెస్, ఎస్పీ లేదా బీజేపీకి సంబంధించిన అంశం కాదని, దేశ విద్యార్థులకు సంబంధించిన సమస్య అని, వారికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. మాకు ఎందుకు ఇవ్వలేదు? మీ ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిందా?’’ అని ప్రశ్నించారు.
Also Read
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన అఖిలేష్, విద్యార్థుల సమస్యలు పట్టించుకోకపోతే మరోసారి రోడ్డెక్కుతామని హెచ్చరించారు. పార్లమెంట్లో మాకు మాట్లాడే అవకాశం ఇచ్చి ఉంటే ప్రధాని ఇంటి ముందు నిరసనకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదని అన్నారు. విద్యార్థులపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారని, వారి ఎముకలు విరిగాయని, విద్యార్థినుల దుస్తులు చిరిగిపోయాయని, దేశ యువతకు కేంద్రం ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
-
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్కప్ బెర్త్ కోసం పాకులాట!
-
RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!