Aaditya Thackeray: మహారాష్ట్రను 5 భాగాలుగా విడగొట్టాలని అనుకుంటున్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aditya Thackeray’s key comments on Maharashtra politics: మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారుతున్నాయి. శివసేన కీలక నేత ఎంపీ సంజయ్ రౌత్ ను ఈడీ అరెస్ట్ చేయడంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గం మండిపడుతోంది. పత్రాచల్ భూముల వ్యవహారంలో మస్కామ్ జరిగిందని ఆరోపిస్తూ ఈడీ సంజయ్ రౌత్ ను అరెస్ట్ చేసింది. మరోవైపు కోర్టు అనుమతితో సంజయ్ రౌత్ ను అదుపులోకి తీసుకోనుంది ఈడీ.
ఇదిలా ఉంటే ఆదిత్య ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. సింధుదుర్గ్ లో ఓ సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ మహారాష్ట్రను 5 భాగాలుగా విభజించాలని చూస్తున్నట్లు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బీజేపీ, సీఎం ఏక్ నాథ్ షిండే ఉద్దేశపూర్వకంగా ప్రాంతీయతత్వాన్ని తీసుకువచ్చి.. ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని భావిస్తున్నారని ఆరోపించారు. ఉద్ధవ్ ఠాక్రే ఎప్పుడు కూడా తమపై వివక్ష చూపలేదని అన్నారు. ద్రవ్యోల్భనం, నిరుద్యోగం సమస్యలు ఉన్నా.. వారు మాత్రం రాజకీయాలు, ఇతర పార్టీలు, ఇతర ఎమ్మెల్యేలను విచ్ఛిన్నం చేసే పనిలో ఉన్నారని విమర్శించారు. ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పేవారిని అణచివేస్తున్నారని.. వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు.
Also Read
Read Also: UPI Transactions: యూపీఐ లావాదేవీల్లో కొత్త చరిత్ర

ఇటీవల గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యల గురించి కూడా ఆదిత్య ఠాక్రే ప్రస్తావించారు. గుజరాతీలు, రాజస్థానీలు లేకపోతే ముంబై ఆర్థిక రాజధానిగా ఉండదనే వ్యాఖ్యలను ఖండించారు. ఇదిలా ఉంటే మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎంపీ సంజయ్ రౌత్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎంపీ సంజయ్ రౌత్ ను ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఆయన వర్గం నేతలు సంజయ్ రౌత్ ఇంటికి వెళ్లారు.
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!