Adhir Ranjan Chowdhury: తృణమూల్ కన్నా బీజేపీకి ఓటేయడమే బెటర్.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adhir Ranjan Chowdhury: కాంగ్రెస్ నేత అధిర్ రంజర్ చౌదరి చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ముందు ఈ పార్టీని ఇరుకున పెట్టాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఈ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి ఓటేయడం కన్నా బీజేపీకి ఓటేయడం మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకుడు షెహజాద్ పూనావాలా అధిర్ మాట్లాడిన వీడియోను షేర్ చేశారు. టీఎంసీ వేసే ప్రతీ ఓటు హాని కలిగిస్తుందని కాంగ్రెస్ పార్టీకి తకూడా తెలుసని అన్నారు. అయితే అధిర్ రంజన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందిస్తూ.. తాను ఇంకా ఈ వీడియో చూడలేదని అన్నారు.
పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్, బర్హంపూర్ ఎంపీ అభ్యర్థిగా ఉన్న అధిర్ రంజన్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో దేశ భవిష్యత్తును నిర్ణయించే, లౌకిక శక్తులకు ఓటేయాలని ప్రజల్ని కోరారు. ‘‘కాంగ్రెస్, వామపక్షాలు గెలవడం అవసరం, అలా చేయకపోతే లౌకికవాదం ప్రమాదంలో పడుతుంది. టీఎంసీ ఓటేయడం కన్నా బీజేపీ ఓటేయడం మంచిది. బీజేపీకి, టీఎంసీలకు ఓటు వేయకండి’’ అని బెంగాలీ భాషలో అన్నారు.
Also Read
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
Read Also: Delhi School Bomb Threat: ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపు.. పాక్ ఐఎస్ఐ, ఐఎస్ఐఎస్తో లింక్..
అధీర్ రంజన్ వ్యాఖ్యపై కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ స్పందిస్తూ..‘‘ నేను ఆ వీడియోను చూడలేదు. అతను ఏ సందర్భంలో ఇలా చెప్పాడో తెలియదు. అయితే కాంగ్రెస్ పార్టీకి భారీ లక్ష్యం మాత్రమే ఉందని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. 2019లో కన్నా బీజేపీకి వచ్చే సీట్లు తగ్గించాలి’’ అని పిలుపునిచ్చారు. ఇండియా కూటమిలో వామపక్షాలు, కాంగ్రెస్ ఉన్నాయని, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇందులో భాగమే అని జైరాం రమేష్ చెప్పారు.
అయితే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-టీఎంసీల మధ్య సీట్ల ఒప్పందం కుదరలేదు. ఒక సందర్భంలో కాంగ్రెస్ గత ఎన్నికల కన్నా ఎక్కువ గెలుస్తుందా..? అనే ప్రశ్నను మమతా బెనర్జీ లేవనెత్తారు. అధీర్ బీజేపీకి బీ-టీమ్ అని ఆమె ఆరోపించారు. బెంగాల్లో బీజేపీకి కళ్లు చెవులుగా వ్యవహరించిన తర్వాత ఆయన ఇప్పుడు బీజేపీకి ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి ఓటేయమని బహిరంగంగా అడుతుగుతున్నారని టీఎంసీ ఆరోపించింది. బీజేపీకి బెంగాల్ విరోధి మాత్రమే ప్రచారం చేస్తారని ఆ పార్టీ మండిపడింది.
తాజావార్తలు
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
-
Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు ‘వారణాసి’ నుంచి క్రేజీ అప్డేట్!
-
Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!