Adhir Ranjan Chowdhury: తృణమూల్ కన్నా బీజేపీకి ఓటేయడమే బెటర్.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు..
Adhir Ranjan Chowdhury: కాంగ్రెస్ నేత అధిర్ రంజర్ చౌదరి చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ముందు ఈ పార్టీని ఇరుకున పెట్టాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఈ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి ఓటేయడం కన్నా బీజేపీకి ఓటేయడం మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకుడు షెహజాద్ పూనావాలా అధిర్ మాట్లాడిన వీడియోను షేర్ చేశారు. టీఎంసీ వేసే ప్రతీ ఓటు హాని కలిగిస్తుందని కాంగ్రెస్ పార్టీకి తకూడా తెలుసని అన్నారు. అయితే అధిర్ రంజన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందిస్తూ.. తాను ఇంకా ఈ వీడియో చూడలేదని అన్నారు.
పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్, బర్హంపూర్ ఎంపీ అభ్యర్థిగా ఉన్న అధిర్ రంజన్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో దేశ భవిష్యత్తును నిర్ణయించే, లౌకిక శక్తులకు ఓటేయాలని ప్రజల్ని కోరారు. ‘‘కాంగ్రెస్, వామపక్షాలు గెలవడం అవసరం, అలా చేయకపోతే లౌకికవాదం ప్రమాదంలో పడుతుంది. టీఎంసీ ఓటేయడం కన్నా బీజేపీ ఓటేయడం మంచిది. బీజేపీకి, టీఎంసీలకు ఓటు వేయకండి’’ అని బెంగాలీ భాషలో అన్నారు.
Also Read
- Designer Pen Smuggling: ఒక్కో పెన్ను రూ.50 వేలు.. కస్టమ్స్ సైతం నివ్వెరపోయే స్మగ్లింగ్!
- Toes Writing: నిరాశకు లొంగని ధైర్యం.. చేతులు లేకపోయినా సాటిలేని ప్రతిభ.. కాళ్లతో రాసి ఫస్ట్ డివిజన్ సాధించిన శివాని
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Bengal Elections: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి చివరి విడత పోలింగ్
Read Also: Delhi School Bomb Threat: ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపు.. పాక్ ఐఎస్ఐ, ఐఎస్ఐఎస్తో లింక్..
అధీర్ రంజన్ వ్యాఖ్యపై కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ స్పందిస్తూ..‘‘ నేను ఆ వీడియోను చూడలేదు. అతను ఏ సందర్భంలో ఇలా చెప్పాడో తెలియదు. అయితే కాంగ్రెస్ పార్టీకి భారీ లక్ష్యం మాత్రమే ఉందని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. 2019లో కన్నా బీజేపీకి వచ్చే సీట్లు తగ్గించాలి’’ అని పిలుపునిచ్చారు. ఇండియా కూటమిలో వామపక్షాలు, కాంగ్రెస్ ఉన్నాయని, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇందులో భాగమే అని జైరాం రమేష్ చెప్పారు.
అయితే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-టీఎంసీల మధ్య సీట్ల ఒప్పందం కుదరలేదు. ఒక సందర్భంలో కాంగ్రెస్ గత ఎన్నికల కన్నా ఎక్కువ గెలుస్తుందా..? అనే ప్రశ్నను మమతా బెనర్జీ లేవనెత్తారు. అధీర్ బీజేపీకి బీ-టీమ్ అని ఆమె ఆరోపించారు. బెంగాల్లో బీజేపీకి కళ్లు చెవులుగా వ్యవహరించిన తర్వాత ఆయన ఇప్పుడు బీజేపీకి ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి ఓటేయమని బహిరంగంగా అడుతుగుతున్నారని టీఎంసీ ఆరోపించింది. బీజేపీకి బెంగాల్ విరోధి మాత్రమే ప్రచారం చేస్తారని ఆ పార్టీ మండిపడింది.
తాజావార్తలు
-
EkDin : కొడుకు పర్ఫెమెన్స్ చూసి కంటతడి పెట్టుకున్న స్టార్ హీరో
-
WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్ నుంచి అతనొక్కడే మినహాయింపు.. కారణమేంటో..! సర్వత్రా చర్చ
-
Snake Hiding Places: మీ ఇంట్లోకి పాము వచ్చిందా..? వాటికి ఇష్టమైన.. అవి దాక్కునే ప్రదేశాలు ఇవే..!
-
Designer Pen Smuggling: ఒక్కో పెన్ను రూ.50 వేలు.. కస్టమ్స్ సైతం నివ్వెరపోయే స్మగ్లింగ్!
-
Ruturaj Gaikwad: ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చిన గైక్వాడ్.. హాఫ్ సెంచరీ చేసినా అవమానకరమైన రికార్డు..!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!