Rahul Gandhi: గౌతమ్ అదానీని వెంటనే అరెస్ట్ చేయండి..
- అదానీని వెంటనే అరెస్ట్ చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్..
- గౌతమ్ అదానీ అరెస్ట్ కాకుండా కేంద్రంలోని పెద్దలు కాపాడుతున్నారు..
- అదానీ విషయంలో కేంద్ర సర్కార్ వైఖరి ఏమిటో చెప్పాలి: రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: సౌర విద్యుత్తు కాంట్రాక్టుల కోసం భారత్లోని వివిధ రాష్ట్రాల రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లకు అదానీ గ్రూప్ 2,200 కోట్ల రూపాయల లంచం ఇచ్చారనే అభియోగాలు దేశంలో సంచలనం రేపుతున్నాయి. ఇక, గౌతమ్ అదానీ, సాగర్ అదానీలకు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ ఛేంజ్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. తాజాగా, ఈ వ్యవహారంపై లోక్సభ విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Also: Parliament Winter Session: లోక్సభలో గందరగోళం.. సభ రేపటికి వాయిదా
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
గౌతమ్ అదానీని తక్షణమే అరెస్ట్ చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఆయనను కాపాడుతున్నారని ఆరోపించారు. చిన్న చిన్న ఆరోపణలపై వందల మందిని అరెస్ట్ చేస్తున్నారు.. కానీ, ఈ విషయంలో కేంద్ర సర్కార్ వైఖరి ఏమిటో చెప్పాలన్నారు. ఈ అభియోగాలను అదానీ అంగీకరిస్తారని ప్రభుత్వం అనుకుంటుందా అని ఆయన ప్రశ్నించారు. లంచాల ఆరోపణలను గౌతమ్ అదానీ ముమ్మాటికీ ఒప్పుకోరని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Supreme Court: ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అగౌరవపరిచేలా మాట్లాడటం తప్పే..
అయితే, మరోవైపు రాజకీయ లబ్ది కోసమే అదానీ వ్యవహారాన్ని కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోందని భారతీయ జనతా పార్టీ ఎంపీ మహేష్ జెఠ్మలానీ మండిపడ్డారు. అమెరికా న్యాయస్థానంలో వచ్చిన ఆరోపణలను గుడ్డిగా అనుసరించడం పద్దతి కాదన్నారు. భారత గ్రోత్ స్టోరీని అడ్డుకునే కుట్రతోనే యూఎస్ ఈ ఆరోపణలు చేస్తోందని పేర్కొన్నారు. భారత శత్రు దేశాలతో కూడా పోటీ పడి అదానీ గ్రూపు ఈ కాంట్రాక్టులు పొందిందని మహేష్ జెఠ్మలానీ అన్నారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!