Rahul Gandhi: గౌతమ్ అదానీని వెంటనే అరెస్ట్ చేయండి..
- అదానీని వెంటనే అరెస్ట్ చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్..
- గౌతమ్ అదానీ అరెస్ట్ కాకుండా కేంద్రంలోని పెద్దలు కాపాడుతున్నారు..
- అదానీ విషయంలో కేంద్ర సర్కార్ వైఖరి ఏమిటో చెప్పాలి: రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: సౌర విద్యుత్తు కాంట్రాక్టుల కోసం భారత్లోని వివిధ రాష్ట్రాల రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లకు అదానీ గ్రూప్ 2,200 కోట్ల రూపాయల లంచం ఇచ్చారనే అభియోగాలు దేశంలో సంచలనం రేపుతున్నాయి. ఇక, గౌతమ్ అదానీ, సాగర్ అదానీలకు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ ఛేంజ్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. తాజాగా, ఈ వ్యవహారంపై లోక్సభ విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Also: Parliament Winter Session: లోక్సభలో గందరగోళం.. సభ రేపటికి వాయిదా
Also Read
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
గౌతమ్ అదానీని తక్షణమే అరెస్ట్ చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఆయనను కాపాడుతున్నారని ఆరోపించారు. చిన్న చిన్న ఆరోపణలపై వందల మందిని అరెస్ట్ చేస్తున్నారు.. కానీ, ఈ విషయంలో కేంద్ర సర్కార్ వైఖరి ఏమిటో చెప్పాలన్నారు. ఈ అభియోగాలను అదానీ అంగీకరిస్తారని ప్రభుత్వం అనుకుంటుందా అని ఆయన ప్రశ్నించారు. లంచాల ఆరోపణలను గౌతమ్ అదానీ ముమ్మాటికీ ఒప్పుకోరని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Supreme Court: ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అగౌరవపరిచేలా మాట్లాడటం తప్పే..
అయితే, మరోవైపు రాజకీయ లబ్ది కోసమే అదానీ వ్యవహారాన్ని కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోందని భారతీయ జనతా పార్టీ ఎంపీ మహేష్ జెఠ్మలానీ మండిపడ్డారు. అమెరికా న్యాయస్థానంలో వచ్చిన ఆరోపణలను గుడ్డిగా అనుసరించడం పద్దతి కాదన్నారు. భారత గ్రోత్ స్టోరీని అడ్డుకునే కుట్రతోనే యూఎస్ ఈ ఆరోపణలు చేస్తోందని పేర్కొన్నారు. భారత శత్రు దేశాలతో కూడా పోటీ పడి అదానీ గ్రూపు ఈ కాంట్రాక్టులు పొందిందని మహేష్ జెఠ్మలానీ అన్నారు.
తాజావార్తలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
-
Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!