Newsclick Case: న్యూస్క్లిక్పై చర్యలు తీసుకోవాలి.. రాష్ర్టపతి, సీజేఐలకు ప్రముఖుల లేఖలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Newsclick Case: కొన్ని మీడియా సంస్థలు భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని.. అటువంటి సంస్థలపై చర్యలు తీసుకోవాలని ప్రముఖులు డిమాండ్ చేశారు. అటువంటి వాటిలో న్యూస్ క్లిక్ కూడా ఉందని.. ఆ మీడియాసంస్థపై చర్యలు తీసుకోవాలని 255 మంది ప్రముఖులు డిమాండ్ చేశారు. సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు భారత రాష్ర్టపతి, భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)లకు లేఖలు రాశారు. చైనాతో సంబంధం ఉన్న సంస్థల నుంచి నిధులు అందుకుంటున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యూస్క్లిక్ మీడియా సంస్థ పై చర్యలు తీసుకోవాలని255 మంది ప్రముఖులు రాష్ట్రపతి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని లేఖలో కోరారు. చైనాతో సంబంధం ఉన్న సంస్థల నుంచి న్యూస్క్లిక్ మీడియా సంస్థకు నిధులు అందుతున్నాయని ఆరోపణలు ఉన్నాయని వారు లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో న్యూస్క్లిక్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ 255 మంది ప్రముఖులు రాష్ట్రపతి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన బహిరంగ లేఖలో కోరారు. . దేశ వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Read also: Milk Price Hike: మండుతున్న నిత్యావసరాల ధరలు.. ఏడాదిలో 10శాతం పెరిగిన పాలు
Also Read
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్పింగ్.. బ్రిక్స్పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
తాము భారత వ్యతిరేకుల వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన భారతీయులుగా ఈ లేఖ రాస్తున్నట్టు పేర్కొన్నారు. నకిలీ వార్తలు, తమ స్వార్థం కోసం న్యూస్క్లిక్ (న్యూస్ పోర్టల్) దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతుందని, ఈ విషయం న్యూ యార్క్ టైమ్స్ పరిశోధనలో బహిర్గతమైందని వారు లేఖలో వెల్లడించారు. నెవిల్లే రాయ్ సింఘం ద్వారా నిధులు అందుకుంటున్న సంస్థగా న్యూయార్క్ టైమ్స్ దర్యాప్తులో తేలిందని.. న్యూస్క్లిక్పై చర్య తీసుకోవాలని తాము కోరుతున్నట్టు లేఖలో పేర్కొన్నారు. దేశంలో ఉంటూ దేశానికి వ్యతిరేకంగా.. ప్రజాస్వామ్య వ్యతిరేక ఎజెండాతో పనిచేసే వారిని దేశం నుంచి బహిష్కరించాలని.. ఇటువంటి విషయాలను బహిర్గతం చేసేలా వస్తున్న కథనాలను నిరోధించాలని వారు లేఖలో కోరారు.
తాజావార్తలు
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
-
Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!