MP: చదువు విషయంలో స్నేహితురాళ్ల మధ్య మనస్పర్థలు.. చైల్డ్ఫ్రెండ్పై యాసిడ్తో దాడి
- మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో దారుణం
- స్నేహితురాళ్ల మధ్య మనస్పర్థలు
- చైల్డ్ఫ్రెండ్పై యాసిడ్తో దాడి, సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వారిద్దరూ చిన్ననాటి స్నేహితులు. అంతేకాకుండా సమీపంలోని ఇరుగుపొరుగు నివాసాలు. ఇక చదువులో ఒకరి కంటే మరొకరు ఎక్కువగా చదువుతున్నారు. అదే మరొకరికి పగ రగిలించింది. స్నేహితురాలిపై అసూయ పెంచుకుంది. ఏదొకటి చేయాలని కుట్ర పన్నింది. అంతే స్నేహం ముసుగులో బయటకు పిలిచి యాసిడ్ పోసింది. దీంతో ఒక్కసారిగా నొప్పితో విలవిలలాడిపోయింది. ప్రస్తుతం తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగింది.
ఇది కూాడా చదవండి: Air India Plane Crash: ఎయిర్ ఇండియా, బోయింగ్పై యూకే కుటుంబాల న్యాయ పోరాటం..!
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- Maharashtra: ఘోర విషాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి
- UP: భర్త కోసం టవరెక్కిన మహిళ.. గంట తర్వాత ఏం జరిగిందంటే..!
శ్రద్ధా దాస్, ఇషితా సాహు ఇద్దరూ బాల్య స్నేహితులు. ఇక శ్రద్ధా దాస్ బీబీఏ చదువుతోంది. ఇషితా సాహు చదువులో వెనకబడింది. అయితే నెల రోజుల నుంచి ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఇద్దరూ మాట్లాడుకోవడం మానేశారు. అయితే ఉన్నట్టుండి ఆదివారం రాత్రి ఇషితా సాహు.. శ్రద్ధా దాస్ ఇంటికి వచ్చింది. పరీక్షల కోసం శ్రద్ధా దాస్ చదువుకుంటోంది. బయటకు రావాలని అడిగితే ఎట్టకేలకు అంగీకరించింది. ఇద్దరూ ఇంటి బయట కొన్ని నిమిషాలు మాట్లాడుకున్నారు. ఇక చదువుకోవాలన్న ఉద్దేశంతో శ్రద్ధా ఇంట్లోకి వెళ్లబోతుండగా హఠాత్తుగా ఇషితా యాసిడ్ బాటిల్ తీసుకుని ముఖంపై పోసింది. ఒక్కసారిగా శ్రద్ధా శరీరమంతా కాలిపోయింది. బాధ తట్టుకోలేక విలవిలలాడిపోయింది. నొప్పి భరించలేక కేకలు వేసింది. వెంటనే స్థానికులు శ్రద్ధాను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతోంది. అయితే పరిస్థితి విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.
ఇది కూాడా చదవండి: Kavya Maran: అందుకే నాపై మీమ్స్.. అసలు విషయం చెప్పేసిన కావ్య మారన్!
సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. విద్య విషయంలో వెనుకబడి ఉండడంతోనే ఇషితా అసూయ పెంచుకుందని.. ఆ కారణంతోనే శ్రద్ధాపై యాసిడ్ దాడి చేసిందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. న్యూనతా భావంతోనే ఇషితా క్రూరంగా ప్రవర్తించినట్లు పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యురాలిగా భావించిన వ్యక్తే.. ఇలాంటి ద్రోహం చేయడంపై శ్రద్ధా తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. నిందితురాలు ఇషితా సాహును పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు. విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!