Telangana CM: డ్రగ్స్ నిర్మూలన కోసం ఎవరు కాంప్రమైజ్ కావొద్దు.. రాష్ట్రంలో ఆ మాట వినపడొద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డ్రగ్స్ నియంత్రణపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఎక్సైజ్, నార్కోటిక్ డ్రగ్స్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నార్కోటిక్ అధికారులతో సీఎం రివ్యూ నిర్వహించారు. ఈ మీటింగ్ లో డ్రగ్స్ నియంత్రణపై రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డ్రగ్స్ సరఫరా వాడకంపై గతంలో పలువురు సినిమా ప్రముఖులకు నోటీసులు ఇచ్చారు.. డ్రగ్స్ వ్యవహారంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు అదే డ్రగ్స్ కేసుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూ చేయడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Read Also: YSRCP: గెలుపే లక్ష్యం.. సిట్టింగ్లను మారుస్తూ సీఎం జగన్ సంచలన నిర్ణయం
Also Read
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..
- Naturally Lizard Removal Tips: వేసవిలో ఇంట్లో బల్లుల బెడద ఎక్కువైందా..? ఈ సింపుల్ స్ప్రే చాలు.. వెంటనే పారిపోతాయి..!
- Sorakaya Uttappam Recipe: సొరకాయతో సూపర్ టేస్ట్.. మెత్తటి ‘సొరకాయ ఉత్తప్పం’ రెసిపీ..
కాగా, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో డ్రగ్స్ మాట వినపడొద్దు అని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనకు ఏది కావాలంటే అది చేస్తాం.. నార్కోటిక్ బ్యూరోపై పోలీసు అధికారులతో సమీక్షలో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆక్టోపస్ గ్రేహౌండ్స్ లాగా నార్కోటిక్ టీమ్ ని బలోపేతం చేస్తాం.. డ్రగ్స్ నిర్మూలించి దేశానికి తెలంగాణ పోలీస్ రోల్ మోడల్ గా నిలవాలి అని ఆయన చెప్పారు. సేవ్ సొసైటీ.. సేవ్ జనరేషన్.. సేవ్ కిడ్స్ నినాదంతో ముందుకు వెళ్లాలి.. డ్రగ్స్ నిర్మూలన కోసం ఎవరు కాంప్రమైజ్ కావొద్దు.. డ్రగ్స్ తీసుకోవాలంటే భయపడే విధంగా ఉండాలి.. డ్రగ్స్ రవాణాను పూర్తి స్థాయిలో కట్టడి చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను గుర్తించండి అని ఆయన పేర్కొన్నారు. శాఖా పరమైన బలోపేతం కోసం ఏది కావాలంటే అది చేస్తాం.. డ్రగ్స్ నిర్మూలన రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి.. ప్రతి నెల నార్కోటిక్ బ్యూరో పైన తప్పకుండా రివ్యూ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Delhi: చేయని నేరానికి యువకుడికి జైలు శిక్ష.. తన కేసు తానే వాదించుకుని నిర్దోషిగా బయటకు..
ఇప్పటి నుంచి రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాలని అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణా రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరోకు పూర్తిస్థాయి డైరెక్టర్ ను నియమించడంతో పాటు ఆ విభాగం బలోపేతం చేయాలన్నారు. ఈ విభాగానికి కావాల్సిన నిధులు, వనరులు ఇతర సౌకర్యాలను సమకూర్చాలని ఆదేశాలు జారీ చేశారు. మాదక ద్రవ్యాలను విక్రయించే, చెలామణి నిరోధానికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలన్నారు. రాష్ట్రంలో ఉన్న గ్రే హాండ్స్, ఆక్టోపస్ మాదిరిగా టీ.ఎస్.నాబ్ ను తీర్చిదిద్దాలని ఆయన తెలిపారు. తెలంగాణా రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా రూపొందించాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ, ఔషధ నియంత్రణా మండలి, పోలీస్ శాఖకు చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
తాజావార్తలు
-
Silver Price Hike: ఇక సామాన్యుడికి వెండి కూడా అందదా? ఆ ఒక్క నిర్ణయంతో ఇక సిల్వర్ ధరలు కొండెక్కి కూర్చోవాల్సిందేనా!
-
Nothing Phone 3: పిచ్చెక్కించే డీల్ బ్రో.. సగం ధరకే నథింగ్ ఫోన్ 3.. ఏకంగా రూ. 40,000 తగ్గింపు, 5,500mAh బ్యాటరీ
-
Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
-
Preity Zinta-Shreyas Iyer: ఇది ఆటేనా అసలు.. శ్రేయస్ అయ్యర్పై ప్రీతి జింటా ఫైర్!
-
Stock Market Crash: స్టాక్ మార్కెట్ కొంప ముంచిన ట్రంప్ ప్రకటన.. ప్రారంభంలోనే సెన్సెక్స్ 800, నిఫ్టీ 250 పాయింట్లు డౌన్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..