Sambhaji Maharaj: శంభాజీ మహరాజ్కి అబూ అబ్మీ నివాళి.. ఔరంగజేబును పొగిడిన కొన్ని రోజులకే..
- ఔరంగజేబుని ప్రశంసించిన కొన్ని రోజులకే..
- శంభాజీ మహారాజ్కి అబూ అజ్మీ నివాళి..
- ఇటీవల మొఘల్ పాలకుడిని పొగుడుతూ అబూ కామెంట్స్..
- శాసన సభ సమావేశాల నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sambhaji Maharaj: ఇటీవల మహారాష్ట్ర సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) ఎమ్మెల్యే అబూ అజ్మీ మొఘల్ పాలకుడు ఔరంగజేబుని ప్రశంసించడం వివాదంగా మారింది. శివసేన, బీజేపీ అతడిపై విరుచుకుపడ్డాయి. మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయబడ్డాడు. ఇదిలా ఉంటే, మరాఠా పాలకుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ వర్ధంతి సందర్భంగా మంగళవారం అబూ అజ్మీ నివాళులు అర్పించారు. ఆయన పరాక్రమ యోధుడని ప్రశంసించారు.
Read Also: Governor Jishnu Dev: ఆదివాసీ పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడటం ఆనందదాయకం..
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ మొఘలులకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారు. చివరకు మొఘలుల కుట్రకు శంభాజీ సంగమేశ్వర్లో పట్టుబడ్డాడు. అత్యంత క్రూరంగా శంభాజీని ఔరంగజేబు హత్య చేశాడు. ఇటీవల వచ్చిన బాలీవుడ్ మూవీ ‘‘ఛావా’’ శంభాజీ చరిత్ర ఆధారంగా రూపొందించబడింది. “స్వరాజ్య రెండవ ఛత్రపతి, పరాక్రమ యోధుడు, ధర్మవీర్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ బలిదానం చేసిన రోజున, నేను నా వినయపూర్వకమైన నివాళి అర్పిస్తున్నాను” అని ఎక్స్లో అబూ అజ్మీ ట్వీట్ చేశారు.
ఇటీవల అబూ అజ్మీ మాట్లాడుతూ.. ఔరంగజేబు మంచి పాలకుడని, ఆయన పాలనలో భారత్ సరిహద్దు ఆఫ్ఘనిస్తాన్, బర్మా వరకు ఉండేదిన అన్నారు. మన జీడీపీ ప్రపంచ జీడీపీలో 24 శాతం ఉందని, భారత దేశాన్ని అతడి పాలనలో ‘‘బంగారు పిచ్చుక’’గా పిలిచే వారని అన్నారు. ఔరంగజేబు, ఛత్రపతి శంభాజీ మహారాజ్ మధ్య జరిగిన పోరాటాన్ని రాజకీయ పోరాటంగా అభివర్ణించారు. అయితే, ఆయన వ్యాఖ్యలపై బీజేపీ, శివసేన పార్టీలు తీవ్రంగా స్పందించాయి. యావత్ మహారాష్ట్రలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయనను మహారాష్ట్ర శాసన సభ సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు. అతడిపై రాజద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!