Election Survey: గుజరాత్లో మళ్లీ వికసించేది కమలమే..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election Survey: ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో గుజరాత్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారం వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీ ఆమ్ఆద్మీ కూడా పోటీ చేస్తుండటంతో పోటీ రసవత్తరంగా మారింది. అయితే ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అన్న విషయంపై ఏబీపీ న్యూస్-సీ ఓటర్ సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. ఈ మేరకు గుజరాత్లో వరుసగా ఏడోసారి కమలం పార్టీనే విజయం సాధిస్తుందని సర్వే రిపోర్టుల్లో స్పష్టమైంది. అయితే గుజరాత్ ఎన్నికల్లో ఆప్ ప్రభావం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై పడుతుందని సర్వే అభిప్రాయపడింది. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తక్కువ ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని తెలిపింది.
Read Also:Narabali : దేశ రాజధానిలో ఘోరం.. ఆరేళ్ల చిన్నారి నరబలి
Also Read
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 46.8 శాతం, కాంగ్రెస్ పార్టీకి 32.3 శాతం, ఆప్కు 17.4 శాతం ఓట్లు వస్తాయని ఏబీపీ న్యూస్-సీ ఓటర్ సర్వే వెల్లడించింది. గత ఎన్నికల్లో బీజేపీ 99 స్థానాలను కైవసం చేసుకోగా వచ్చే ఎన్నికల్లో 135-143 స్థానాలు గెలుచుకుంటుందని సర్వే స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీకి 36 నుంచి 44 స్థానాలు వచ్చే అవకాశం ఉందని.. ఆప్కు రెండు స్థానాలు మాత్రమే వస్తాయని సర్వే తెలిపింది. ఇతరులు 0-3 సీట్లు పొందే అవకాశం ఉందని వివరించింది. అటు ప్రస్తుత సీఎం భూపేంద్ర పటేల్ మరోసారి అధికారంలోకి రావాలని ఎక్కువ మంది కోరుకుంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్లోనూ బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఒపీనియన్ పోల్ వెల్లడించింది. హిమాచల్ ప్రదేశ్లో మొత్తం 68 స్థానాలు ఉండగా బీజేపీకి 37 నుంచి 45 సీట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
-
Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
-
Kala Chana Pulao Recipe: 4 స్టెప్స్లో కాలా చనా పులావ్.. టేస్ట్తో పాటు ప్రోటీన్ డబుల్.!
-
CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!