Delhi liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అభిషేక్ రావు కస్టడీ పొడగింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Rao’s custody extended in Delhi liquor scam: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్(సీబీఐ), ఈడీలు విచారణ కొనసాగిస్తున్నాయి. ఈ లిక్కర్ స్కామ్ లో హైదరాబాద్ కు చెందిన పలువురు ఉన్నట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఇప్పటికే అభిషేక్ రావును లిక్కర్ స్కామ్ లో సీబీఐ ఈ నెల 9న అరెస్ట్ చేసింది. మరుసటి రోజునే కోర్టు ముందు హాజరుపరిచారు. నేటితో అభిషేక్ రావు కస్టడీ ముగిసింది. అయితే మరికొంత సమయం కావాలని కోర్టును కోరింది సీబీఐ. దీంతో కోర్టు మరో రెండు రోజుల పాటు కస్టడీని పొడగించింది.
Read Also: Tammineni Veerabhadram: బీజేపీని ఆర్ఎస్ఎస్ నడిపిస్తోంది.. అదో ప్రమాదకరమైన సంస్థ
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
ఇప్పటికే ఈ కేసులో పలువురిని విచారించింది సీబీఐ, ఈడీ. అభిషేక్ రావును మూడు రోజుల పాటు ఈడీ విచారించింది. ఈ స్కామ్ లో రామచంద్ర అరుణ్ పిళ్లైని విచారించిన అవసరం ఉందని సీబీఐ తెలిపింది. అరుణ్ పిళ్లైతో అభిషేక్ రావుకు ఆర్థిక సంబంధాలు ఉన్నాయని సీబీఐ తెలిపింది. అరుణ్ పిళ్లైకి ఇప్పటికే నోటీసులు ఇచ్చామని.. అయితే ఇంట్లో ఏదో కార్యక్రమం ఉండటంతో, అతని కూతురు అనారోగ్యం కారణంగా పిళ్లై హాజరుకాలేదని సీబీఐ, కోర్టుకు తెలిపింది. మరికొన్ని ఆధారాలు పరిశీలించాల్సిన అవసరం ఉందని సీబీఐ తెలిపింది. కస్టడీ అవసరం లేదని.. ఈ కేసులో కస్టడీ లేకుండా విచారించవచ్చని అభిషేక్ తరుపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. విచారణకు అన్ని విధాల సహకరిస్తున్నామని అభిషేక్ తరుపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.
ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ ఎక్సైజ్ పాలసీ ఈ లిక్కర్ స్కామ్ కు కారణం అయింది. ఈ కేసులో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఉన్నట్లు సీబీఐ పేర్కొంది. పలుమార్లు సిసోడియాకు సంబంధించిన కార్యాలయాలు, ఇళ్లు, బ్యాంకు లాకర్లను తనిఖీ చేసింది సీబీఐ. ఈ కేసులో తెలంగాణలోని కొంతమంది పారశ్రామికవేత్తల ప్రమేయం ఉందని.. హైదరాబాద్ కేంద్రంగానే ఈ స్కామ్ జరిగిందని సీబీఐ ఆరోపిస్తోంది.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!