Abhishek Banerjee: లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగింది.. మళ్లీ ఎన్నికలు పెట్టాలన్న అభిషేక్ బెనర్జీ
- లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగింది
- మళ్లీ ఎన్నికలు పెట్టాలన్న అభిషేక్ బెనర్జీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల సంఘంపై విపక్ష పార్టీలు యుద్ధం సాగిస్తున్నాయి. ఇప్పటికే రాహుల్గాంధీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. గత లోక్సభ ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. తిరిగి లోక్సభ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Rajasthan: సుప్రీంకోర్టు బాటలోనే హైకోర్టు.. తక్షణమే వీధి కుక్కలు తొలగించాలని ఆదేశం
Also Read
- Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 21 మంది మృతి, పలువురికి గాయాలు.!
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- DK Shivakumar: నేడు సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.. దేవాలయాల్లో పూజలు, వీవీఐపీలకు ప్రత్యేక ఆహ్వానాలు!
- WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
బీహార్లో 65 లక్షలు ఓట్లు తొలగించారని.. ఇలాంటి పరిస్థితే పశ్చిమ బెంగాల్లో చేపడితే లక్ష మందితో ఈసీ ఆఫీస్ ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. తప్పులతో కూడిన ఓటర్ల జాబితాతో గత ఎన్ని్కల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్షాలు ఇలాగే ఎన్నికయ్యారని తెలిపారు. లోక్సభను రద్దు చేసి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. తృణమూల్తో పాటు ప్రతిపక్ష ఎంపీలందరూ అందుకు సిద్ధమేనని చెప్పారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో ఓటర్ జాబితాలు సరిగ్గానే ఉన్నాయని.. బెంగాల్, బిహార్లో మాత్రమే తప్పుగా ఉన్నాయని ఈసీ ఎలా చెబుతుందని ప్రశ్నించారు. బీహార్లో న్యాయబద్ధంగా ఎన్నికలు జరిగితే బీజేపీ ఓడిపోవడం ఖాయమని తెలిపారు.
ఇది కూడా చదవండి: Ayodhya: రామమందిరం చుట్టూ రక్షణ గోడ.. భారీగా బడ్జెట్ కేటాయింపు
మా ప్రాధాన్యత బెంగాల్ అని.. మాకు ఎవరు అండగా నిలిచినా.. మేము కూడా వారికి అండగా నిలుస్తామని ప్రకటించారు. అది ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చని చెప్పారు. మా లక్ష్యానికి మద్దతు ఇస్తే మాకు అభ్యంతరం లేదన్నారు. పార్టీలు మా కోసం రెండు అడుగులు వేస్తే.. మేము కూడా వారి కోసం అలాగే చేస్తామన్నారు. మాకు ఎటువంటి అహంకారం లేదని… మేము అధికార బీజేపీకి మాత్రమే వ్యతిరేకం అన్నారు. మొదటి నుంచి ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నామన్నారు.
తాజావార్తలు
-
Ntv Exclusive: ‘పెద్ది’తో రామ్ చరణ్ విశ్వరూపం.. కంటతడి పెట్టించేశాడట!
-
Stock Market Crash: కుప్పకూలిన షేర్ మార్కెట్.. సెన్సెక్స్ 1100 పాయింట్లు పతనం.. లక్షల కోట్లు గాల్లోనే!
-
LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ ఆఫర్.. ఈ తరహా మెసేజీలు వస్తున్నాయా? ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
-
Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
-
PEDDI Hikes : పెద్ది తెలంగాణ టికెట్ ధరల పెంపు.. జీవో వెనుక చక్రం తిప్పిన టాలీవుడ్ బడా నిర్మాత
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!