Delhi Liquor Case: ఎన్నికల వేళ లిక్కర్పై కాకరేపుతున్న కాగ్ రిపోర్ట్! బీజేపీ-ఆప్ మధ్య డైలాగ్ వార్
- ఎన్నికల వేళ లిక్కర్పై కాకరేపుతున్న కాగ్ రిపోర్ట్!
- బీజేపీ-ఆప్ మధ్య డైలాగ్ వార్
- కాగ్ రిపోర్ట్ ఎక్కడా? అంటూ నిలదీసిన ఆప్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు లిక్కర్ పాలసీ వ్యవహారం తాజాగా మరోసారి కాక రేపుతోంది. మద్యం పాలసీ కారణంగా ప్రభుత్వానికి రూ.2,026 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా కాగ్ పేర్కొన్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కాగ్ రిపోర్టు లీకైనట్లుగా పేర్కొన్నాయి. దీన్ని భేష్ చేసుకుని బీజేపీ.. ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ఆప్ ప్రభుత్వం కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ.2,026 కోట్లు నష్టం వాటిల్లినట్లుగా బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శలు గుప్పించారు.
ఇది కూడా చదవండి: Indian 3 : “ఇండియన్ 3″ శంకర్ కు ‘‘గేమ్ ఛేంజర్’’ అయ్యేనా ?
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
మద్యం పాలసీతో అనుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో ఆప్ సర్కార్ విఫలమైందని.. ఆప్ నేతలంతా కిక్బ్యాక్ల ద్వారా లబ్ధి పొందినట్లుగా నివేదికలో పేర్కొన్నట్లు కథనాలు పేర్కొన్నాయి. నిపుణుల బృందం ఇచ్చిన సిఫార్సులను అప్పటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియా నేతృత్వంలోని మంత్రుల బృందం పూర్తిగా విస్మరించినట్లుగా తెలిపింది. అంతేకాకుండా పాలసీపై కీలక నిర్ణయాలు తీసుకునే క్రమంలో మంత్రిమండలి, లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం కూడా తీసుకోలేదని వెల్లడించింది. లైసెన్సుల జారీ, నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు పేర్కొంది. మొత్తానికి మద్యం పాలసీని సరిగా అమలు చేయకపోవడం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.2,.026 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. ఈ వ్యవహారంలో పలు ఫిర్యాదులు ఉన్నప్పటికీ అన్ని సంస్థలను వేలం వేసేందుకు అనుమతించినట్లు తెలిపింది. వేలం వేసిన సంస్థల ఆర్థికస్థితిగతులపై ఎలాంటి పరిశీలనలు జరపలేదని.. నష్టాల్లో ఉన్న కంపెనీలకు అవకాశం కల్పించినట్లు వెల్లడించింది. వారికి లైసెన్సులను కూడా పునరుద్ధరించినట్లు నివేదిక పేర్కొంది.
ఇది కూడా చదవండి: LIC Scheme: స్కీమ్ అంటే ఇది కదా.. సింగిల్ ఇన్వెస్ట్మెంట్తో ప్రతి నెల రూ. 12 వేలు పొందండి
ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం 2021 నవంబర్ 17న మద్యం పాలసీని తీసుకొచ్చింది. 2022 సెప్టెంబర్లో దీన్ని వెనక్కి తీసుకుంది. లిక్కర్ పాలసీలో పలు అవకతవకలు జరిగాయని.. ఆప్ నేతలు మనీలాండరింగ్కు పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. ఎక్సైజ్ పాలసీని సవరించేటప్పుడు సిసోడియా అక్రమాలకు పాల్పడ్డారనేది సీబీఐ, ఈడీ ఆరోపించాయి. లైసెన్స్దారులకు అవసరమైన సాయం చేసి, ప్రతిఫలంగా కొంత మొత్తాన్ని పొందినట్లు దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఈ కేసులో సిసోడియా, కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టై జైలుకు వెళ్లారు. కొన్ని నెలలు తీహార్ జైల్లో ఉన్నారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
అయితే బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ చేసిన ఆరోపణలను ఆప్ నేత సంజయ్ సింగ్ తప్పుపట్టారు. ఏ ప్రామాణికంతో ఆప్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని నిలదీశారు. కాగ్ రిపోర్ట్ ఎక్కడ బయటపెట్టిందో చూపించాలని డిమాండ్ చేశారు. ‘‘కాగ్ నివేదిక ఎక్కడ ఉంది?, ఈ ఆరోపణలు ఎక్కడ నుంచి వస్తున్నాయి. బీజేపీ కార్యాలయంలో నివేదికను కాగ్ దాఖలు చేసిందా?, బీజేపీ నేతలు మానసిక స్పృహ కోల్పోయారు. కాగ్ నివేదిక సమర్పించకుండానే తప్పుడు వాదనలు చేస్తున్నారు.’’ అంటూ సంజయ్ సింగ్ ధ్వజమెత్తారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఈసారి ఆప్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఈ పార్టీల మధ్య తీవ్ర పోరు నడుస్తోంది. మరోసారి అధికారం కోసం ఆప్ ప్రయత్నం చేస్తుండగా.. అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. హస్తిన వాసులు ఈసారి ఏ పార్టీకి అధికారం కట్టబెడతారో చూడాలి.
ఇది కూడా చదవండి: NTR : స్కాట్లాండ్లో సామాన్యుడిగా వీధుల్లో తిరుగుతున్న ఎన్టీఆర్.. వీడియో వైరల్
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!