JP Nadda: అవినీతిలో ఆప్ అన్ని రికార్డ్లు దాటేసింది
- అవినీతిలో ఆప్ అన్ని రికార్డ్లు దాటేసింది
- ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో జేపీ నడ్డా వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. అధికార-ప్రతిపక్ష నేతల విమర్శలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇక సమయం తక్కువగా ఉండడంతో అగ్ర నేతలంతా ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికారమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆప్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.
ఇది కూడా చదవండి: Maharashtra: ఒకే వేదికపై అజిత్ పవార్-శరద్ పవార్.. ఆసక్తి రేపిన సంఘటన
Also Read
- Bhojshala Case: "భోజ్శాల ఆలయం కాదు".. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
- Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
- VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. ఛీప్ గెస్ట్లు వీరే!
- Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
పదేళ్ల ఢిల్లీ పాలనలో ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిలో అన్ని రికార్డ్లు సృష్టించిందని నడ్డా ధ్వజమెత్తారు. ఢిల్లీలోని ఉత్తమ్నగర్లో ఓ బహిరంగ సభలో నడ్డా మాట్లాడారు. కేజ్రీవాల్ ఎంతో అమాయకంగా నటిస్తూ అబద్ధాలు చెబుతారని విమర్శించారు. ఈ విషయంలో పోటీ పెడితే ఆయన్ని ఎవరూ అధిగమించలేరని ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో ఢిల్లీలో అభివృద్ధి ఏమైనా జరిగిందంటే.. అది మోడీ వల్లేనన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు ఆప్కి తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. నూతన మద్యం విధానం పేరుతో ఆప్ ప్రభుత్వం ఢిల్లీ ప్రజల జేబులకు కన్నం పెట్టిందని విమర్శించారు. ఈ ఎన్నికలు ఢిల్లీ భవిష్యత్ను నిర్ణయిస్తాయని, దీనిని దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని ప్రజలకు సూచించారు.
ఇది కూడా చదవండి: ED: ఈడీ కీలక చర్యలు.. రూ.1.26 కోట్ల విలువైన మంత్రి ఆస్తులు జప్తు..
దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ పోలింగ్ జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఆప్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. మరోసారి అధికారం కోసం ఆమ్ ఆద్మీ ప్రయత్నిస్తుండగా.. అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ట్రై చేస్తోంది. ఇలా రెండు పార్టీల మధ్య నువ్వానేనా? అన్నట్టుగా ఫైట్ సాగుతోంది. ఇప్పటికే రెండు పార్టీలు పోటాపోటీగా మేనిఫెస్టోలు ప్రకటించాయి.
ఇది కూడా చదవండి: Maharashtra: బడ్జెట్ సమావేశాలకు ముందు ఉద్ధవ్ థాక్రేకు భారీ షాక్..! మహాయుతిలోకి పలువురు ఎంపీలు!
తాజావార్తలు
-
Bhojshala Case: “భోజ్శాల ఆలయం కాదు”.. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
-
Full Body Checkup : 30 ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు మిస్ అయితే రిస్క్.!
-
Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
-
VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. ఛీప్ గెస్ట్లు వీరే!
-
IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..