Kejriwal: కేజ్రీవాల్ హెల్త్పై ఆప్ రిపోర్టు విడుదల.. ఆందోళనలో శ్రేణులు!
- కేజ్రీవాల్ హెల్త్పై ఆప్ రిపోర్టు విడుదల
- ఆందోళనలో ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు
- కేంద్రం కుట్ర చేస్తుందన్న ఆప్ నేత సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. కేజ్రీవాల్ దాదాపు 8.5 కిలోల బరువు తగ్గారని.. అలాగే బ్లడ్ షుగర్ కూడా 50 ఎంజీ/డీఎల్ కంటే తక్కువగా పడిపోయిందని ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్ ఆరోపించారు. దీంతో ఆప్ నేతలు ఆందోళన చెందుతున్నారు.
ఇది కూడా చదవండి: Kuppam: మారనున్న కుప్పం రూపురేఖలు.. సీఎం ఆదేశాలతో అభివృద్ధి వైపు వేగంగా అడుగులు..!
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న అరెస్టై తీహార్ జైల్లో ఉన్నారు. పలుమార్లు బెయిల్ పిటిషన్లు వేసినా తిరస్కరణకు గురయ్యాయి. ఆ మధ్యలో ట్రయల్ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. కానీ సీబీఐ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టుకు వెళ్లి అడ్డుకోవడంతో ఆగిపోయింది. ఇటీవల ఈడీ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ మరో సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో ఇంకా జైల్లోనే కేజ్రీవాల్ మగ్గుతున్నారు. ఇక లోక్సభ ఎన్నికల కోసం మాత్రం 21 రోజులు సర్వోన్నత న్యాయస్థానం తాత్కాలిక బెయిల్ మంజూరు చేయడంతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం జూన్ 2న తిరిగి తీహార్ జైల్లో లొంగిపోయారు.
ఇది కూడా చదవండి: MAA Action: నటీనటుల అసభ్యకర వీడియోలు.. ఐదు యూట్యూబ్ ఛానల్స్ లేపేసిన ‘మా’
శనివారం సంజయ్సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. తీహార్ జైల్లో కేజ్రీవాల్ను తీవ్రమైన వ్యాధితో బాధపెట్టడానికి కుట్ర పన్నుతోందని.. ఇది అత్యంత ఆందోళనకరమైన విషయమని పేర్కొన్నారు. మార్చి 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసినప్పుడు కేజ్రీవాల్ బరువు 70 కిలోలు అని, ప్రస్తుతం బరువు 61.5 కిలోలకు తగ్గిందని సంజయ్సింగ్ చెప్పారు. ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించకపోవడం వల్లే కేజ్రీవాల్ బరువు తగ్గడానికి కారణమని పేర్కొన్నారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులో సుప్రీంకోర్టు కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేస్తున్న అవినీతి కేసులో అరెస్టు అయినందున కేజ్రీవాల్ ఇప్పటికీ జైలులోనే ఉన్నారని వెల్లడించారు. సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించవచ్చన్న దురుద్దేశంతోనే సీబీఐ కేజ్రీవాల్పై కల్పిత కేసు పెట్టిందని.. ఇదంతా ఆయన జీవితంతో ఆడుకోవడం కోసమేనని సంజయ్ సింగ్ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Wife Pours Boiling Oil: నిద్రిస్తున్న భర్తపై మరుగుతున్న నూనె పోసిన భార్య.. కారణం ఏంటంటే..
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?