Shraddha Walkar Case: శ్రద్ధా హత్య కేసులో కీలకంగా మారిన “వాటర్ బిల్”..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aaftab Poonawala’s water bill shows how he kept the murder hidden: ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యంత క్రూరంగా తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధా వాకర్ అనే 27 ఏళ్ల యువతిని అఫ్తాబ్ పూనావాలా చంపేశాడు. శరీరాన్ని 35 ముక్కలుగా చేసి ఓ ఫ్రిజ్ లో దాచి పెట్టాడు. 18 రోజుల పాటు రాత్రి 2 గంటల ప్రాంతంలో ఢిల్లీ చుట్టుపక్కట ప్రాంతాల్లో పారేశాడు. ఈ కేసు దేశంలో సంచలనంగా మారింది. హత్య జరిగిన ఆరు నెలల తర్వాత శ్రద్ధా తండ్రి కేసు పెట్టడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందిన వీరు ఢిల్లీలోని మెహ్రౌలి ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్ అద్దెకు సహజీవనం చేస్తున్నారు. ఆ అపార్ట్మెంట్ లోకి మారిన మూడు రోజుల్లోనే మే 18న శ్రద్ధా వాకర్ని హత్య చేశాడు.
ఇదిలా ఉంటే ఈ కేసులో సాక్ష్యాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. ఇప్పటికే నిందితుడు అఫ్తాబ్ ఇచ్చిన సమాచారం మేరకు ఛత్తార్ పూర్ అటవీ ప్రాంతంలో శ్రద్ధావిగా చెప్పబడుతున్న 10 బస్తాల ఎముకలను సేకరించారు. దీంతో పాటు అఫ్తాబ్ ప్లాట్ లోని ఫ్రిజ్ తో పాటు కిచెన్ లో దొరికిన రక్తపు నమూనాలను సేకరించారు. వీటిని ఫోరెన్సిక్ ల్యాబుకు పంపి.. శ్రద్ధా తండ్రి డీఏఎన్ఏతో పోల్చనున్నారు.
Also Read
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
Read Also: Dog Saved Owner’s Life: యజమాని కోసం ప్రాణాలు అర్పించిన కుక్క
ఇదిలా ఉంటే ప్రస్తుతం మరో కీలక ఆధారం పోలీసుల ముందుకు వచ్చింది. అదేంటంటే..అఫ్తాబ్ అపార్మ్టెంట్ వాటర్ బిల్. శ్రద్ధా హత్య తరువాత అఫ్తాబ్ ప్లాట్ లో ఒంటరిగా ఉంటున్నాడు. అయితే ఒంటరిగా ఉన్నప్పటికీ రూ. 300 వాటర్ బిల్లు వచ్చింది. అయితే రూ.300 చిన్న విషయమే అయినప్పటీకీ ఇదే ఇప్పుడు కీలకంగా మారనుంది. ఢిల్లీ ప్రభుత్వం ప్రతీ ఇంటికి నెలకు 20,000 లీటర్ల నీటిని ఉచితంగా అందిస్తుంది. దీనికి మించి నీటిని వాడితే బిల్లును విధిస్తుంది. అయితే ఒక్కడే ఉంటున్న అపార్ట్మెంట్ కు రూ.300 వాటర్ బిల్లు ఎందుకు వచ్చిందనే దానిపై పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు.
అయితే హత్య జరిగిన తర్వాత రక్తపు మరకలు, ఆధారాలు చెరిపేయడానికి అఫ్తాబ్ ఎక్కువగా నీటిని వాడినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ముక్కలు నరికే క్రమంలో శబ్ధం రాకుండా కుళాయిలను తిప్పి ఉంచేవాడని తెలుస్తోంది. రక్తాన్ని వేడినీటితో కడగడానికి ఎక్కువగా వాటర్ వాడినట్లు తెలుస్తోంది. ప్రతీ ఇంటికి 20,000 లీటర్లు అంటే రోజుకు 35 బకెట్లు అంటే ఒక సగటు కుటుంబానికి సరిపోతుంది. అయితే పోలీసులు ఈ వాటర్ బిల్లు సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నారు.
హత్య జరిగిన మే 18 నుంచి ప్లాట్ లో అప్తాబ్ ఒక్కడే ఉంటున్నాడు. హత్య జరిగిన తర్వాతి రోజు అంటే మే 19న కొత్త ఫ్రిజ్ కొనుగోలు చేశాడు. శ్రద్ధా అకౌంట్ నుంచి రూ. 54,000 డ్రా చేసినట్లు వివరాలను సేకరించారు పోలీసులు. ప్రస్తుతం హత్యకు ఉపయోగించిన ఆయుధం, శ్రద్ధా మొబైల్ ఫోన్ కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు.
తాజావార్తలు
-
INDW vs AUSW: గ్రూప్-ఏలో ఉత్కంఠభరిత పోటీ.. భారత్ సెమీస్ చేరాలంటే అద్భుతమే జరగాలి!
-
Hanuman: హనుమంతుడిని కూడా నిలువరించిన ముగ్గురు యోధులు వీరేనా? ఈ కథల వెనుక ఉన్న విశేషాలేంటి?
-
DUBAI: గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ సర్వనాశనం.. దుబాయ్ను నిండా ముంచేసిన ఇరాన్!
-
Karnataka: “నిన్ను చంపి నేను చస్తా”.. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!