Nitin Gadkari: వీఐపీల సైరన్లో కొత్త శబ్ధం.. భారతీయ సంగీతం ఏర్పాటు
Nitin Gadkari: వీఐపీల సైరన్లకు కేంద్రం స్వస్థి పలకాలని భావిస్తోంది. ప్రస్తుతం కొనసాగిస్తున్న వీఐపీల సైరన్ మూలంగా శబ్ధ కాలుష్యం ఎక్కువగా అవుతోందని.. అందుకే వాటి స్థానంలో కొత్త సౌండ్స్ ను ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. అటువంటి విధానాన్ని రూపొందిస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న వీఐపీ సంస్కృతిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కొత్త ప్రణాళిక గురించి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. శబ్ధ కాలుష్యాన్ని తగ్గించే వీఐపీ వాహనాలపై పెద్ద శబ్దంతో కూడిన సైరన్ల స్థానంలో ఓదార్పు సౌండ్లను అమర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. సైరన్ శబ్దాల స్థానంలో వేణువు, తబలా మరియు శంఖ్ వంటి భారతీయ సంగీత వాయిద్యాల ధ్వనితో కొత్త విధానాన్ని రూపొందిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. మంత్రులు, వీఐపీల వాహనాలకు ప్రోటోకాల్లో భాగంగా సైరన్ ఉంటుంది. రోడ్లపై సైరన్ మోతతో వాహనాలు వెళుతుంటే.. అందులో ఎవరో వీఐపీ వెళుతున్నారని, పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తారు. కానీ, ఈ సైరన్ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. మరికొందరు అనుమతి లేకుండా తమ వాహనాలకు సైరన్లు ఏర్పాటు చేస్తున్నారు.
Read also: Strange Customs: వింత ఆచారం..! నాలుకతో నైవేద్యం సేకరిస్తే అలా జరుగుతుందా?
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
పూనేలోని చాందినీ చౌక్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘శబ్ద కాలుష్యాన్ని అదుపులో ఉంచడం ఎంతో ముఖ్యం. వీఐపీ వాహనాలపై ఉండే ఎర్ర బుగ్గ సంస్కృతికి ముగింపు పలికే అవకాశం నాకు లభించింది. ఇప్పడు వీఐపీ వాహనాల్లో సైరన్ను కూడా తొలగించాలనుకుంటున్నాం. సైరన్కు బదులుగా భారతీయ సంగీత వాయిద్యాలైన పిల్లనగ్రోవి, తబలా, వయోలిన్, శంఖం వంటి వాటి ద్వారా రూపొందించిన శబ్దం వినపడేలా మార్పులు చేసేందుకు నిబంధనలు సిద్ధం చేస్తున్నాం. శబ్ద కాలుష్యం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడమే దీని ముఖ్య ఉద్దేశం’’ అని నితిన్ గడ్కరీ తెలిపారు. మహారాష్ట్రలోని పూనేలో శనివారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, “ధ్వని కాలుష్యాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. VIP వాహనంపై రెడ్ లైట్ (బీకాన్)ను ముగించే అవకాశం నాకు లభించడం నా అదృష్టం. ఇప్పుడు, నేను VIP వాహనాలపై సైరన్లకు ముగింపు పలకాలని ప్లాన్ చేస్తున్నాను. ప్రజలు శబ్ద కాలుష్యం నుండి ఉపశమనం పొందాలని నేను కోరుకుంటున్నానని అన్నారు. చాందినీ చౌక్లో నిర్మించిన మల్టీ లెవల్ ఫ్లైఓవర్ను మంత్రి శనివారం ప్రారంభించారు. గడ్కరీ ప్రకారం, ఈ మొత్తం ప్రాజెక్ట్లో మొత్తం 4 ఫ్లైఓవర్లు, 1 అండర్పాస్ వెడల్పు మరియు 2 కొత్త అండర్పాస్లు నిర్మించబడ్డాయి. చాందినీ చౌక్ ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ పూణే నగరంలో ట్రాఫిక్ను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు గడ్కరీ తెలిపారు. రూ.865 కోట్ల అంచనా వ్యయంతో 16.98 కి.మీ పొడవున్న ఈ వంతెన వల్ల పుణె నగరం, జిల్లాలో ప్రధాన ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుందని మంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!