Nitin Gadkari: వీఐపీల సైరన్లో కొత్త శబ్ధం.. భారతీయ సంగీతం ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitin Gadkari: వీఐపీల సైరన్లకు కేంద్రం స్వస్థి పలకాలని భావిస్తోంది. ప్రస్తుతం కొనసాగిస్తున్న వీఐపీల సైరన్ మూలంగా శబ్ధ కాలుష్యం ఎక్కువగా అవుతోందని.. అందుకే వాటి స్థానంలో కొత్త సౌండ్స్ ను ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. అటువంటి విధానాన్ని రూపొందిస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న వీఐపీ సంస్కృతిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కొత్త ప్రణాళిక గురించి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. శబ్ధ కాలుష్యాన్ని తగ్గించే వీఐపీ వాహనాలపై పెద్ద శబ్దంతో కూడిన సైరన్ల స్థానంలో ఓదార్పు సౌండ్లను అమర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. సైరన్ శబ్దాల స్థానంలో వేణువు, తబలా మరియు శంఖ్ వంటి భారతీయ సంగీత వాయిద్యాల ధ్వనితో కొత్త విధానాన్ని రూపొందిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. మంత్రులు, వీఐపీల వాహనాలకు ప్రోటోకాల్లో భాగంగా సైరన్ ఉంటుంది. రోడ్లపై సైరన్ మోతతో వాహనాలు వెళుతుంటే.. అందులో ఎవరో వీఐపీ వెళుతున్నారని, పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తారు. కానీ, ఈ సైరన్ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. మరికొందరు అనుమతి లేకుండా తమ వాహనాలకు సైరన్లు ఏర్పాటు చేస్తున్నారు.
Read also: Strange Customs: వింత ఆచారం..! నాలుకతో నైవేద్యం సేకరిస్తే అలా జరుగుతుందా?
Also Read
పూనేలోని చాందినీ చౌక్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘శబ్ద కాలుష్యాన్ని అదుపులో ఉంచడం ఎంతో ముఖ్యం. వీఐపీ వాహనాలపై ఉండే ఎర్ర బుగ్గ సంస్కృతికి ముగింపు పలికే అవకాశం నాకు లభించింది. ఇప్పడు వీఐపీ వాహనాల్లో సైరన్ను కూడా తొలగించాలనుకుంటున్నాం. సైరన్కు బదులుగా భారతీయ సంగీత వాయిద్యాలైన పిల్లనగ్రోవి, తబలా, వయోలిన్, శంఖం వంటి వాటి ద్వారా రూపొందించిన శబ్దం వినపడేలా మార్పులు చేసేందుకు నిబంధనలు సిద్ధం చేస్తున్నాం. శబ్ద కాలుష్యం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడమే దీని ముఖ్య ఉద్దేశం’’ అని నితిన్ గడ్కరీ తెలిపారు. మహారాష్ట్రలోని పూనేలో శనివారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, “ధ్వని కాలుష్యాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. VIP వాహనంపై రెడ్ లైట్ (బీకాన్)ను ముగించే అవకాశం నాకు లభించడం నా అదృష్టం. ఇప్పుడు, నేను VIP వాహనాలపై సైరన్లకు ముగింపు పలకాలని ప్లాన్ చేస్తున్నాను. ప్రజలు శబ్ద కాలుష్యం నుండి ఉపశమనం పొందాలని నేను కోరుకుంటున్నానని అన్నారు. చాందినీ చౌక్లో నిర్మించిన మల్టీ లెవల్ ఫ్లైఓవర్ను మంత్రి శనివారం ప్రారంభించారు. గడ్కరీ ప్రకారం, ఈ మొత్తం ప్రాజెక్ట్లో మొత్తం 4 ఫ్లైఓవర్లు, 1 అండర్పాస్ వెడల్పు మరియు 2 కొత్త అండర్పాస్లు నిర్మించబడ్డాయి. చాందినీ చౌక్ ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ పూణే నగరంలో ట్రాఫిక్ను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు గడ్కరీ తెలిపారు. రూ.865 కోట్ల అంచనా వ్యయంతో 16.98 కి.మీ పొడవున్న ఈ వంతెన వల్ల పుణె నగరం, జిల్లాలో ప్రధాన ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుందని మంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!