Nitin Gadkari: వీఐపీల సైరన్లో కొత్త శబ్ధం.. భారతీయ సంగీతం ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitin Gadkari: వీఐపీల సైరన్లకు కేంద్రం స్వస్థి పలకాలని భావిస్తోంది. ప్రస్తుతం కొనసాగిస్తున్న వీఐపీల సైరన్ మూలంగా శబ్ధ కాలుష్యం ఎక్కువగా అవుతోందని.. అందుకే వాటి స్థానంలో కొత్త సౌండ్స్ ను ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. అటువంటి విధానాన్ని రూపొందిస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న వీఐపీ సంస్కృతిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కొత్త ప్రణాళిక గురించి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. శబ్ధ కాలుష్యాన్ని తగ్గించే వీఐపీ వాహనాలపై పెద్ద శబ్దంతో కూడిన సైరన్ల స్థానంలో ఓదార్పు సౌండ్లను అమర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. సైరన్ శబ్దాల స్థానంలో వేణువు, తబలా మరియు శంఖ్ వంటి భారతీయ సంగీత వాయిద్యాల ధ్వనితో కొత్త విధానాన్ని రూపొందిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. మంత్రులు, వీఐపీల వాహనాలకు ప్రోటోకాల్లో భాగంగా సైరన్ ఉంటుంది. రోడ్లపై సైరన్ మోతతో వాహనాలు వెళుతుంటే.. అందులో ఎవరో వీఐపీ వెళుతున్నారని, పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తారు. కానీ, ఈ సైరన్ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. మరికొందరు అనుమతి లేకుండా తమ వాహనాలకు సైరన్లు ఏర్పాటు చేస్తున్నారు.
Read also: Strange Customs: వింత ఆచారం..! నాలుకతో నైవేద్యం సేకరిస్తే అలా జరుగుతుందా?
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
పూనేలోని చాందినీ చౌక్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘శబ్ద కాలుష్యాన్ని అదుపులో ఉంచడం ఎంతో ముఖ్యం. వీఐపీ వాహనాలపై ఉండే ఎర్ర బుగ్గ సంస్కృతికి ముగింపు పలికే అవకాశం నాకు లభించింది. ఇప్పడు వీఐపీ వాహనాల్లో సైరన్ను కూడా తొలగించాలనుకుంటున్నాం. సైరన్కు బదులుగా భారతీయ సంగీత వాయిద్యాలైన పిల్లనగ్రోవి, తబలా, వయోలిన్, శంఖం వంటి వాటి ద్వారా రూపొందించిన శబ్దం వినపడేలా మార్పులు చేసేందుకు నిబంధనలు సిద్ధం చేస్తున్నాం. శబ్ద కాలుష్యం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడమే దీని ముఖ్య ఉద్దేశం’’ అని నితిన్ గడ్కరీ తెలిపారు. మహారాష్ట్రలోని పూనేలో శనివారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, “ధ్వని కాలుష్యాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. VIP వాహనంపై రెడ్ లైట్ (బీకాన్)ను ముగించే అవకాశం నాకు లభించడం నా అదృష్టం. ఇప్పుడు, నేను VIP వాహనాలపై సైరన్లకు ముగింపు పలకాలని ప్లాన్ చేస్తున్నాను. ప్రజలు శబ్ద కాలుష్యం నుండి ఉపశమనం పొందాలని నేను కోరుకుంటున్నానని అన్నారు. చాందినీ చౌక్లో నిర్మించిన మల్టీ లెవల్ ఫ్లైఓవర్ను మంత్రి శనివారం ప్రారంభించారు. గడ్కరీ ప్రకారం, ఈ మొత్తం ప్రాజెక్ట్లో మొత్తం 4 ఫ్లైఓవర్లు, 1 అండర్పాస్ వెడల్పు మరియు 2 కొత్త అండర్పాస్లు నిర్మించబడ్డాయి. చాందినీ చౌక్ ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ పూణే నగరంలో ట్రాఫిక్ను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు గడ్కరీ తెలిపారు. రూ.865 కోట్ల అంచనా వ్యయంతో 16.98 కి.మీ పొడవున్న ఈ వంతెన వల్ల పుణె నగరం, జిల్లాలో ప్రధాన ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుందని మంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!