Religious Conversion: ‘‘ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి’’.. TCS తర్వాత విప్రోపై ఆరోపణలు..
- ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి చేశారు..
- విప్రో మాజీ ఉద్యోగి సంచలన ఆరోపణలు..
- టీసీఎస్ నాసిక్ ఉదంతం తర్వాత మరో ఐటీ దిగ్గజంపై ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Religious Conversion: నాసిక్ టీఎసీఎస్ క్యాంపస్ మతమార్పిడి వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కిందిస్థాయి ఉద్యోగులు, మహిళలపై ఉన్నతాధికారుల వేధింపులు, బలవంతంగా మతమార్పిడి, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తేలింది. ఈ ఘటన మరవక ముందే ఇప్పుడు మరో సాఫ్ట్వేర్ దిగ్గజం విప్రోపై కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. విప్రో పూణే క్యాంపస్లో పనిచేసిన ఓ మాజీ మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేసింది. తన ఉన్నతాధికారి మత విశ్వాసాల కారణంగా వేధింపులకు గురిచేసినట్లు, ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి తెచ్చినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పుణేలోని హింజేవాడి విప్రో క్యాంపస్లో పనిచేస్తున్న సమయంలో కొందరు సీనియర్ మేనేజర్లు, టీమ్ లీడర్లు తన మత విశ్వాసాలను లక్ష్యంగా చేసుకుని వేధించారని ఆమె ఆరోపించింది.ఇస్లాం మతంలోకి మారాలి, మతానికి సంబంధించిన ఆచారాలు పాటించాలని మానసికంగా వేధించినట్లు చెప్పింది. ఇందుకు నిరాకరించినందుకు తనకు వేధింపులు పెరిగాయని, పర్ఫామెన్స్ రివ్యూల్లో చెడుగా రేటింగ్ ఇస్తామని, ఉద్యోగం నుంచి తీసేస్తామని బెదిరించినట్లు ఆరోపించింది. ఈ మానసిక వేధింపుల కారణంగా ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పింది. సంస్థ అంతర్గత ఫిర్యాదు వ్యవస్థ నుంచి కూడా తనకు సరైన మద్దతు రాలేదని పోలీసులతో పాటు మానవహక్కుల సంస్థలో ఫిర్యాదుచేసింది.
Also Read
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
- Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
- Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
ఈ వ్యవహారంపై పూణ పోలీస్ అధికారి బాలాజీ పంధారే మాట్లాడుతూ.. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ ప్రారంభించినట్లు చెప్పారు. ఈ వ్యవహారంపై విప్రో స్పందించింది. ఉద్యోగుల సంక్షేమం, గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పింది. వివక్ష, వేధింపులు, మానవ హక్కుల ఉల్లంఘన పట్ల ‘‘జీరో టాలరెన్స్’’ విధానాన్ని పాటిస్తున్నామని చెప్పింది. ప్రస్తుతం కేసు విచారణలో ఉన్నందువల్ల వివరాలు వెల్లడించలేదని, పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నట్లు చెప్పింది.
తాజావార్తలు
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
-
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్స్టాప్ షూటింగ్
-
Trump-Netanyahu: ట్రంప్నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
-
Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!