UP: యూపీలో ఘోరం.. గోడను ఢీకొట్టిన కారు.. వరుడు సహా 8 మంది మృతి
- ఉత్తరప్రదేశ్లో ఘోరం
- గోడను ఢీకొట్టిన కారు
- వరుడు సహా 8 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్తున్న ఎస్యూవీ కారు అత్యంత వేగంగా దూసుకెళ్తూ.. నియంత్రణ కోల్పోయి ఓ కాలేజీ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరుడు సహా 8 మంది ఒకే కుటుంబ సభ్యులు చనిపోగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇది కూడా చదవండి: Iswarya Menon : కొబ్బరి బోండంతో వలపువల విసురుతున్న ఐశ్వర్య మీనన్
Also Read
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లాలో శుక్రవారం వివాహ బృందంతో వెళ్తున్న బొలెరో ఎస్యూవీ కారు జెవానై గ్రామంలో కళాశాల గోడను ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 24 ఏళ్ల వరుడు సహా ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అధిక వేగంతో వెళ్తుండడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి.. గోడను ఢీకొట్టి బోల్తా పడింది. సంఘటనాస్థలిలోనే వరుడు ప్రాణాలు వదిలాడు. కొన్ని గంటల్లో పెళ్లి కావాల్సిన సమయంలో వరుడు చనిపోవడంతో తీవ్ర విషాదఛాయలు అలుమకున్నాయి.
ఇది కూడా చదవండి: IND W vs ENG W 3rd T20I: 25 బంతుల్లో 9 వికెట్లు పడగొట్టారు.. అయినా ఓడిపోయారు
సంభాల్లోని హర్ గోవింద్పూర్ గ్రామం నుంచి పొరుగున ఉన్న బుడాన్ జిల్లాలోని సిర్టౌల్లోని వధువు గ్రామానికి వరుడు సూరజ్, కుటుంట సభ్యులు కారులో వెళ్తున్నారు. దాదాపు 10 మంది కుటుంబ సభ్యులు కారులో కూర్చున్నారు. ఉదయం పూట రోడ్లు ఖాళీగా ఉండడంతో కారును డ్రైవర్ అత్యంత వేగంగా పోనిచ్చాడు. హఠాత్తుగా నియంత్రణ కోల్పోవడంతో జనతా ఇంటర్ కాలేజీ గోడను ఢీకొట్టాడు. కారు బోల్తా పడడంతో వరుడు సూరజ్(24) అక్కడికక్కడే మరణించాడు. మృతుల్లో వరుడి వదిన ఆశా (26), ఆశా కుమార్తె ఐశ్వర్య (2), మనోజ్ కుమారుడు విష్ణు (6), వరుడి అత్త, గుర్తు తెలియని ఇద్దరు మైనర్లు సహా మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ప్రాణాలతో బయటపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అలీఘర్లోని ఉన్నత వైద్య కేంద్రానికి తరలించారు. సంఘటనా స్థలాన్ని అదనపు పోలీసు సూపరింటెండెంట్ (సౌత్) అనుకృతి శర్మ సందర్శించారు.
తాజావార్తలు
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
-
Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన ‘హిందూ గ్రోత్ రేట్’ అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!