Odisha: కాలేజీ హాస్టల్లో “గొడ్డు మాంసం”తో వంట.. ఏడుగురు విద్యార్థుల బహిష్కరణ..
- కాలేజీ హాస్టల్లో "గొడ్డు మాంసం"తో వంట..
- ఏడుగురు విద్యార్థుల బహిష్కరణ..
- ఒడిశా బెర్హంపూర్లో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha: ఒడిశాలోని బెర్హంపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని పరాలా మహారాజా ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఏడుగురు విద్యార్థులు కాలేజీ హాస్టల్లో ‘గొడ్డు మాంసం’’ వండారనే ఆరోపణలతో వారిని బహిష్కరించారు. ఈ ఘటనపై ఉద్రిక్తతలు పెరగడంతో అధికారులు కాలేజీ సమీపంలో భద్రతా సిబ్బందిని మోహరించారు. ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బహిష్కరణలతో పాటు ఒక్కొక్కరికి రూ. 2000 జరిమానా విధించారు.
Read Also: Trump Assassination Attempt: రెండోసారి ట్రంప్పై అటాక్.. హత్యకు యత్నించిన ర్యాన్ రౌత్ ఎవరు..?
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది. దీనిపై పలువురు విద్యార్థులు డీన్కి ఫిర్యాదు చేశారు. ‘‘ విద్యార్థులందరి విలువలు మరియు విశ్వాసాలను గౌరవించడం యొక్క ప్రాముఖ్యతను మేము అర్థం చేసుకున్నాము. ఈ సంఘటన (గొడ్డు మాంసం వండటం) అశాంతి మరియు అసౌకర్యానికి కారణమైంది, ఇది ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను దయతో అభ్యర్థిస్తున్నాము’’ అని విద్యార్థులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
హాల్స్ ఆఫ్ రెసిడెన్స్ (HoR) నియమాలు, సంస్థ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కారణంగా బహిష్కరించినట్లు సెప్టెంబరు 12 న స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ కార్యాలయం నుండి అధికారిక నోటిఫికేషన్ వెలువడింది. సెప్టెంబర్ 11 రాత్రి ఫల్గుణి హెచ్ఓఆర్ రూమ్ నెంబర్ బీ-23లోని విద్యార్థులు నిషేధించబడిన కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నట్లు నోటీసులు పేర్కొన్నాయి. ఈ సంఘటనపై బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. విద్యార్థులు బీఫ్ తినడంతో పాటు మరికొందరు విద్యార్థులకు కూడా వడ్డించారని వీహెచ్పీ ఆరోపించింది.
- Tags
- Beef issue
- Berhampur
- Odisha
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!