Odisha: కాలేజీ హాస్టల్లో “గొడ్డు మాంసం”తో వంట.. ఏడుగురు విద్యార్థుల బహిష్కరణ..
- కాలేజీ హాస్టల్లో "గొడ్డు మాంసం"తో వంట..
- ఏడుగురు విద్యార్థుల బహిష్కరణ..
- ఒడిశా బెర్హంపూర్లో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha: ఒడిశాలోని బెర్హంపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని పరాలా మహారాజా ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఏడుగురు విద్యార్థులు కాలేజీ హాస్టల్లో ‘గొడ్డు మాంసం’’ వండారనే ఆరోపణలతో వారిని బహిష్కరించారు. ఈ ఘటనపై ఉద్రిక్తతలు పెరగడంతో అధికారులు కాలేజీ సమీపంలో భద్రతా సిబ్బందిని మోహరించారు. ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బహిష్కరణలతో పాటు ఒక్కొక్కరికి రూ. 2000 జరిమానా విధించారు.
Read Also: Trump Assassination Attempt: రెండోసారి ట్రంప్పై అటాక్.. హత్యకు యత్నించిన ర్యాన్ రౌత్ ఎవరు..?
Also Read
- Bhojshala Case: "భోజ్శాల హిందువులదే".. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
- Monsoon 2026: గుడ్న్యూస్.. కేరళలోకి ఆరు రోజులు ముందుగానే మాన్సూన్ ఎంట్రీ! ఖరారు చేసిన ఐఎండీ..
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
- Bhojshala case: "భోజ్శాల ఒక దేవాలయం".. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది. దీనిపై పలువురు విద్యార్థులు డీన్కి ఫిర్యాదు చేశారు. ‘‘ విద్యార్థులందరి విలువలు మరియు విశ్వాసాలను గౌరవించడం యొక్క ప్రాముఖ్యతను మేము అర్థం చేసుకున్నాము. ఈ సంఘటన (గొడ్డు మాంసం వండటం) అశాంతి మరియు అసౌకర్యానికి కారణమైంది, ఇది ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను దయతో అభ్యర్థిస్తున్నాము’’ అని విద్యార్థులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
హాల్స్ ఆఫ్ రెసిడెన్స్ (HoR) నియమాలు, సంస్థ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కారణంగా బహిష్కరించినట్లు సెప్టెంబరు 12 న స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ కార్యాలయం నుండి అధికారిక నోటిఫికేషన్ వెలువడింది. సెప్టెంబర్ 11 రాత్రి ఫల్గుణి హెచ్ఓఆర్ రూమ్ నెంబర్ బీ-23లోని విద్యార్థులు నిషేధించబడిన కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నట్లు నోటీసులు పేర్కొన్నాయి. ఈ సంఘటనపై బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. విద్యార్థులు బీఫ్ తినడంతో పాటు మరికొందరు విద్యార్థులకు కూడా వడ్డించారని వీహెచ్పీ ఆరోపించింది.
- Tags
- Beef issue
- Berhampur
- Odisha
తాజావార్తలు
-
Bhojshala Case: “భోజ్శాల హిందువులదే”.. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
-
Monsoon 2026: గుడ్న్యూస్.. కేరళలోకి ఆరు రోజులు ముందుగానే మాన్సూన్ ఎంట్రీ! ఖరారు చేసిన ఐఎండీ..
-
PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
-
Bhojshala case: “భోజ్శాల ఒక దేవాలయం”.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
-
Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!