Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News 7 11 Mumbai Train Blast Case People Died But Innocents Should Not Hang Accused Tells Court

Mumbai train blast case: “ముంబై రైలు పేలుళ్ల కేసు”.. ఉరితీయొద్దన్న నిందితుడు.. తీర్పు రిజర్వ్ ..

Published Date :January 31, 2025 , 5:24 pm
By BV Reddy
  • 2006 ముంబై రైలు బ్లాస్ట్ కేసులో తీర్పు రిజర్వ్..
  • నిందితుల మరణశిక్ష పిటిషన్లను విచారిస్తున్న బాంబే హైకోర్టు..
  • తనను ఉరితీయొద్దన్న నిందితుడు..
Mumbai train blast case: “ముంబై రైలు పేలుళ్ల కేసు”.. ఉరితీయొద్దన్న నిందితుడు.. తీర్పు రిజర్వ్ ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Mumbai train blast case: 2006, జూలై 11న ముంబై సబర్బన్ రైళ్లలో 11 నిమిషాల్లో ఆర్డీఎక్స్ పేలుళ్లు సంభవించాయి. ఈ ఉగ్రదాడిలో 189 మంది మరణించగా, 827 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఆరున్నర నెలల పాటు జరిగిన విచారణలో నిందితులకు ట్రయల్ కోర్ట్ మరణశిక్షతో పాటు యావజ్జీవ శిక్షలు విధించబడ్డాయి. ఈ కేసులో నిందితులు దాఖలు చేసిన మరణ నిర్ధారణ పిటిషన్లు, అప్పీళ్లపై బాంబే హైకోర్టు శుక్రవారం తన తీర్పుని రిజర్వ్ చేసింది. జూలై 2024 నుంచి ఈ కేసును ముగించడానికి డివిజన్ బెంజ్ విచారణ జరుపుతోంది.

విచారణ చివరి రోజున నిందితులు తమ వాదనల్ని చెప్పుకోవడానికి జస్టిస్ అనిల్ కిలోర్, శ్యాం చందక్‌లతో కూడిన ధర్మాసనం 2 నిమిషాలు అనుమతించింది. నిందితులు పూణేలోని ఎరవాడ జైలు, అమరావతి, నాసిక్, నాగ్‌పూర్ సెంట్రల్ జైళ్ల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ వాదనల్ని వినిపించారు. 12 నిందితుడిగా నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్న నవేద్ హుస్సేన్ మాట్లాడాడు. ‘‘తనపై ఉన్న కేసు తప్పుడు కేసు. నేను నిర్దోషిని. నేను ఎవరి కోసం మాట్లాడటం లేదు, నా కోసం మాత్రమే మాట్లాడుతున్నాను. ఈ కేసుతో నాకు సంబంధం లేదు. అరెస్టుకు ముందు నిందితుల్లో ఒకరితో తప్పా తనకు ఎవరితో సంబంధం లేదు. 19 ఏళ్లుగా బాధపడుతున్నాను. రైలు పేలుడులో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కానీ ప్రతీకారం అంటే అమాయకులను ఉరితీయకూడదు’’ అని చెప్పాడు.

Read Also: Economic Survey: 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్.. ఈ కలను ట్రంప్ ఛిన్నాభిన్నం చేస్తాడా?

నవాద్ హుస్సేన్ రైళ్లలో బాంబులు పెట్టిన వ్యక్తుల్లో ఒకడిగా ఆరోపించబడ్డాడు. ట్రయర్ కోర్టు ఇతడికి మరణశిక్ష విధించింది. హుస్సేన్ విచారణ సమయంలో నేరాన్ని ఒప్పుకున్నాడు. శుక్రవారం విచారణలో హుస్సేన్ తప్ప ఇంకెవరు నిందితులు మాట్లాడలేదు. జూలై 11, 2006న ముంబై సబర్బన్ రైళ్లలో ఏడు ప్రదేశాల్లో 11 నిమిషాల్లో బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ కేసులో 13 మందిని అరెస్ట్ చేయగా, 15 మందిని వాంటెడ్‌గా ప్రకటించారు. కొందరు ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేశారు. నిందితులపై MCOCA , UAPA కేసులు పెట్టి, నవంబర్ 2006 లో చార్జిషీట్ దాఖలు చేసింది.

9 ఏళ్ల తర్వాత మరణశిక్షను ఎదుర్కొంటున్న దోషుల్లో ఒకరైన ఎతేషామ్ సిద్ధిఖీ హైకోర్టులో మరణశిక్షపై అప్పీల్ చేశాడు. దీనిని విచారించడానికి గతేడాది ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేశారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజా థాకరే ఈ కేసుని ‘అత్యంత అరుదైన కేసుల్లో ఒకటి’’ అని వాదిస్తూ మరణశిక్షల్ని నిర్ధారించాలని కోర్టుని కోరారు. ఈ కేసులో ట్రయల్ కోర్టు 13 మందిలో ఐదుగురికి మరణశిక్ష, ఏడుగురికి మావజ్జీవ శిక్ష విధించింది. రైలు పేలుళ్లకు ‘‘ఇండియన్ ముజాహిదీన్’’ ఉగ్రసంస్థ పాల్పడినట్లు విచారణలో తేలింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 7/11 Mumbai train blasts
  • Bombay High Court
  • death confirmation petitions
  • death penalty
  • Indian Mujahideen

తాజావార్తలు

  • Prem Rakshith: ప్రేమ్ రక్షిత్’పై మైఖేల్ జాక్సన్ కొరియోగ్రాఫర్ ప్రశంసలు

  • Iran War: ‘‘హార్ముజ్‌ను మూసే ఉంచాలి’’.. కొత్త సుప్రీం లీడర్ ఆదేశాలు..

  • Srisailam: ఉగాది మహోత్సవాలకు ముస్తాబైతున్న శ్రీశైల మల్లన స్వామి.. 16 నుంచి ఐదు రోజుల పాటు ఘనంగా వేడుకలు.!

  • LPG Cylinder Delivery: రాష్ట్రంలో LPG సరఫరా నియంత్రణలోనే ఉంది.. ప్రభుత్వం కీలక ప్రకటన.!

  • Sugar Control : ఇలా వేయించిన శనగపప్పు తినడం వల్ల కొలెస్ట్రాల్, షుగర్ కు చెక్

ట్రెండింగ్‌

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • 120Hz LCD డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో iQOO Z11x 5G లాంచ్.. ధర ఎంతంటే?

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions