Mumbai train blast case: “ముంబై రైలు పేలుళ్ల కేసు”.. ఉరితీయొద్దన్న నిందితుడు.. తీర్పు రిజర్వ్ ..
- 2006 ముంబై రైలు బ్లాస్ట్ కేసులో తీర్పు రిజర్వ్..
- నిందితుల మరణశిక్ష పిటిషన్లను విచారిస్తున్న బాంబే హైకోర్టు..
- తనను ఉరితీయొద్దన్న నిందితుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai train blast case: 2006, జూలై 11న ముంబై సబర్బన్ రైళ్లలో 11 నిమిషాల్లో ఆర్డీఎక్స్ పేలుళ్లు సంభవించాయి. ఈ ఉగ్రదాడిలో 189 మంది మరణించగా, 827 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఆరున్నర నెలల పాటు జరిగిన విచారణలో నిందితులకు ట్రయల్ కోర్ట్ మరణశిక్షతో పాటు యావజ్జీవ శిక్షలు విధించబడ్డాయి. ఈ కేసులో నిందితులు దాఖలు చేసిన మరణ నిర్ధారణ పిటిషన్లు, అప్పీళ్లపై బాంబే హైకోర్టు శుక్రవారం తన తీర్పుని రిజర్వ్ చేసింది. జూలై 2024 నుంచి ఈ కేసును ముగించడానికి డివిజన్ బెంజ్ విచారణ జరుపుతోంది.
విచారణ చివరి రోజున నిందితులు తమ వాదనల్ని చెప్పుకోవడానికి జస్టిస్ అనిల్ కిలోర్, శ్యాం చందక్లతో కూడిన ధర్మాసనం 2 నిమిషాలు అనుమతించింది. నిందితులు పూణేలోని ఎరవాడ జైలు, అమరావతి, నాసిక్, నాగ్పూర్ సెంట్రల్ జైళ్ల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ వాదనల్ని వినిపించారు. 12 నిందితుడిగా నాగ్పూర్ సెంట్రల్ జైలులో ఉన్న నవేద్ హుస్సేన్ మాట్లాడాడు. ‘‘తనపై ఉన్న కేసు తప్పుడు కేసు. నేను నిర్దోషిని. నేను ఎవరి కోసం మాట్లాడటం లేదు, నా కోసం మాత్రమే మాట్లాడుతున్నాను. ఈ కేసుతో నాకు సంబంధం లేదు. అరెస్టుకు ముందు నిందితుల్లో ఒకరితో తప్పా తనకు ఎవరితో సంబంధం లేదు. 19 ఏళ్లుగా బాధపడుతున్నాను. రైలు పేలుడులో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కానీ ప్రతీకారం అంటే అమాయకులను ఉరితీయకూడదు’’ అని చెప్పాడు.
Also Read
Read Also: Economic Survey: 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్.. ఈ కలను ట్రంప్ ఛిన్నాభిన్నం చేస్తాడా?
నవాద్ హుస్సేన్ రైళ్లలో బాంబులు పెట్టిన వ్యక్తుల్లో ఒకడిగా ఆరోపించబడ్డాడు. ట్రయర్ కోర్టు ఇతడికి మరణశిక్ష విధించింది. హుస్సేన్ విచారణ సమయంలో నేరాన్ని ఒప్పుకున్నాడు. శుక్రవారం విచారణలో హుస్సేన్ తప్ప ఇంకెవరు నిందితులు మాట్లాడలేదు. జూలై 11, 2006న ముంబై సబర్బన్ రైళ్లలో ఏడు ప్రదేశాల్లో 11 నిమిషాల్లో బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ కేసులో 13 మందిని అరెస్ట్ చేయగా, 15 మందిని వాంటెడ్గా ప్రకటించారు. కొందరు ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేశారు. నిందితులపై MCOCA , UAPA కేసులు పెట్టి, నవంబర్ 2006 లో చార్జిషీట్ దాఖలు చేసింది.
9 ఏళ్ల తర్వాత మరణశిక్షను ఎదుర్కొంటున్న దోషుల్లో ఒకరైన ఎతేషామ్ సిద్ధిఖీ హైకోర్టులో మరణశిక్షపై అప్పీల్ చేశాడు. దీనిని విచారించడానికి గతేడాది ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేశారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజా థాకరే ఈ కేసుని ‘అత్యంత అరుదైన కేసుల్లో ఒకటి’’ అని వాదిస్తూ మరణశిక్షల్ని నిర్ధారించాలని కోర్టుని కోరారు. ఈ కేసులో ట్రయల్ కోర్టు 13 మందిలో ఐదుగురికి మరణశిక్ష, ఏడుగురికి మావజ్జీవ శిక్ష విధించింది. రైలు పేలుళ్లకు ‘‘ఇండియన్ ముజాహిదీన్’’ ఉగ్రసంస్థ పాల్పడినట్లు విచారణలో తేలింది.
తాజావార్తలు
-
CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
-
YS Jagan: నీటి విడుదలపై పొలిటికల్ వార్.. క్రెడిట్ కోసం చంద్రబాబు ఆరాటం.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : రాహుల్నే ప్రధాని చేయాలి.. వైఎస్సార్కు అదే నివాళి
-
Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
-
Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!