Mumbai train blast case: “ముంబై రైలు పేలుళ్ల కేసు”.. ఉరితీయొద్దన్న నిందితుడు.. తీర్పు రిజర్వ్ ..
- 2006 ముంబై రైలు బ్లాస్ట్ కేసులో తీర్పు రిజర్వ్..
- నిందితుల మరణశిక్ష పిటిషన్లను విచారిస్తున్న బాంబే హైకోర్టు..
- తనను ఉరితీయొద్దన్న నిందితుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai train blast case: 2006, జూలై 11న ముంబై సబర్బన్ రైళ్లలో 11 నిమిషాల్లో ఆర్డీఎక్స్ పేలుళ్లు సంభవించాయి. ఈ ఉగ్రదాడిలో 189 మంది మరణించగా, 827 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఆరున్నర నెలల పాటు జరిగిన విచారణలో నిందితులకు ట్రయల్ కోర్ట్ మరణశిక్షతో పాటు యావజ్జీవ శిక్షలు విధించబడ్డాయి. ఈ కేసులో నిందితులు దాఖలు చేసిన మరణ నిర్ధారణ పిటిషన్లు, అప్పీళ్లపై బాంబే హైకోర్టు శుక్రవారం తన తీర్పుని రిజర్వ్ చేసింది. జూలై 2024 నుంచి ఈ కేసును ముగించడానికి డివిజన్ బెంజ్ విచారణ జరుపుతోంది.
విచారణ చివరి రోజున నిందితులు తమ వాదనల్ని చెప్పుకోవడానికి జస్టిస్ అనిల్ కిలోర్, శ్యాం చందక్లతో కూడిన ధర్మాసనం 2 నిమిషాలు అనుమతించింది. నిందితులు పూణేలోని ఎరవాడ జైలు, అమరావతి, నాసిక్, నాగ్పూర్ సెంట్రల్ జైళ్ల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ వాదనల్ని వినిపించారు. 12 నిందితుడిగా నాగ్పూర్ సెంట్రల్ జైలులో ఉన్న నవేద్ హుస్సేన్ మాట్లాడాడు. ‘‘తనపై ఉన్న కేసు తప్పుడు కేసు. నేను నిర్దోషిని. నేను ఎవరి కోసం మాట్లాడటం లేదు, నా కోసం మాత్రమే మాట్లాడుతున్నాను. ఈ కేసుతో నాకు సంబంధం లేదు. అరెస్టుకు ముందు నిందితుల్లో ఒకరితో తప్పా తనకు ఎవరితో సంబంధం లేదు. 19 ఏళ్లుగా బాధపడుతున్నాను. రైలు పేలుడులో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కానీ ప్రతీకారం అంటే అమాయకులను ఉరితీయకూడదు’’ అని చెప్పాడు.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
Read Also: Economic Survey: 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్.. ఈ కలను ట్రంప్ ఛిన్నాభిన్నం చేస్తాడా?
నవాద్ హుస్సేన్ రైళ్లలో బాంబులు పెట్టిన వ్యక్తుల్లో ఒకడిగా ఆరోపించబడ్డాడు. ట్రయర్ కోర్టు ఇతడికి మరణశిక్ష విధించింది. హుస్సేన్ విచారణ సమయంలో నేరాన్ని ఒప్పుకున్నాడు. శుక్రవారం విచారణలో హుస్సేన్ తప్ప ఇంకెవరు నిందితులు మాట్లాడలేదు. జూలై 11, 2006న ముంబై సబర్బన్ రైళ్లలో ఏడు ప్రదేశాల్లో 11 నిమిషాల్లో బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ కేసులో 13 మందిని అరెస్ట్ చేయగా, 15 మందిని వాంటెడ్గా ప్రకటించారు. కొందరు ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేశారు. నిందితులపై MCOCA , UAPA కేసులు పెట్టి, నవంబర్ 2006 లో చార్జిషీట్ దాఖలు చేసింది.
9 ఏళ్ల తర్వాత మరణశిక్షను ఎదుర్కొంటున్న దోషుల్లో ఒకరైన ఎతేషామ్ సిద్ధిఖీ హైకోర్టులో మరణశిక్షపై అప్పీల్ చేశాడు. దీనిని విచారించడానికి గతేడాది ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేశారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజా థాకరే ఈ కేసుని ‘అత్యంత అరుదైన కేసుల్లో ఒకటి’’ అని వాదిస్తూ మరణశిక్షల్ని నిర్ధారించాలని కోర్టుని కోరారు. ఈ కేసులో ట్రయల్ కోర్టు 13 మందిలో ఐదుగురికి మరణశిక్ష, ఏడుగురికి మావజ్జీవ శిక్ష విధించింది. రైలు పేలుళ్లకు ‘‘ఇండియన్ ముజాహిదీన్’’ ఉగ్రసంస్థ పాల్పడినట్లు విచారణలో తేలింది.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!