Mumbai train blast case: “ముంబై రైలు పేలుళ్ల కేసు”.. ఉరితీయొద్దన్న నిందితుడు.. తీర్పు రిజర్వ్ ..
- 2006 ముంబై రైలు బ్లాస్ట్ కేసులో తీర్పు రిజర్వ్..
- నిందితుల మరణశిక్ష పిటిషన్లను విచారిస్తున్న బాంబే హైకోర్టు..
- తనను ఉరితీయొద్దన్న నిందితుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai train blast case: 2006, జూలై 11న ముంబై సబర్బన్ రైళ్లలో 11 నిమిషాల్లో ఆర్డీఎక్స్ పేలుళ్లు సంభవించాయి. ఈ ఉగ్రదాడిలో 189 మంది మరణించగా, 827 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఆరున్నర నెలల పాటు జరిగిన విచారణలో నిందితులకు ట్రయల్ కోర్ట్ మరణశిక్షతో పాటు యావజ్జీవ శిక్షలు విధించబడ్డాయి. ఈ కేసులో నిందితులు దాఖలు చేసిన మరణ నిర్ధారణ పిటిషన్లు, అప్పీళ్లపై బాంబే హైకోర్టు శుక్రవారం తన తీర్పుని రిజర్వ్ చేసింది. జూలై 2024 నుంచి ఈ కేసును ముగించడానికి డివిజన్ బెంజ్ విచారణ జరుపుతోంది.
విచారణ చివరి రోజున నిందితులు తమ వాదనల్ని చెప్పుకోవడానికి జస్టిస్ అనిల్ కిలోర్, శ్యాం చందక్లతో కూడిన ధర్మాసనం 2 నిమిషాలు అనుమతించింది. నిందితులు పూణేలోని ఎరవాడ జైలు, అమరావతి, నాసిక్, నాగ్పూర్ సెంట్రల్ జైళ్ల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ వాదనల్ని వినిపించారు. 12 నిందితుడిగా నాగ్పూర్ సెంట్రల్ జైలులో ఉన్న నవేద్ హుస్సేన్ మాట్లాడాడు. ‘‘తనపై ఉన్న కేసు తప్పుడు కేసు. నేను నిర్దోషిని. నేను ఎవరి కోసం మాట్లాడటం లేదు, నా కోసం మాత్రమే మాట్లాడుతున్నాను. ఈ కేసుతో నాకు సంబంధం లేదు. అరెస్టుకు ముందు నిందితుల్లో ఒకరితో తప్పా తనకు ఎవరితో సంబంధం లేదు. 19 ఏళ్లుగా బాధపడుతున్నాను. రైలు పేలుడులో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కానీ ప్రతీకారం అంటే అమాయకులను ఉరితీయకూడదు’’ అని చెప్పాడు.
Also Read
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
- Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
Read Also: Economic Survey: 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్.. ఈ కలను ట్రంప్ ఛిన్నాభిన్నం చేస్తాడా?
నవాద్ హుస్సేన్ రైళ్లలో బాంబులు పెట్టిన వ్యక్తుల్లో ఒకడిగా ఆరోపించబడ్డాడు. ట్రయర్ కోర్టు ఇతడికి మరణశిక్ష విధించింది. హుస్సేన్ విచారణ సమయంలో నేరాన్ని ఒప్పుకున్నాడు. శుక్రవారం విచారణలో హుస్సేన్ తప్ప ఇంకెవరు నిందితులు మాట్లాడలేదు. జూలై 11, 2006న ముంబై సబర్బన్ రైళ్లలో ఏడు ప్రదేశాల్లో 11 నిమిషాల్లో బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ కేసులో 13 మందిని అరెస్ట్ చేయగా, 15 మందిని వాంటెడ్గా ప్రకటించారు. కొందరు ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేశారు. నిందితులపై MCOCA , UAPA కేసులు పెట్టి, నవంబర్ 2006 లో చార్జిషీట్ దాఖలు చేసింది.
9 ఏళ్ల తర్వాత మరణశిక్షను ఎదుర్కొంటున్న దోషుల్లో ఒకరైన ఎతేషామ్ సిద్ధిఖీ హైకోర్టులో మరణశిక్షపై అప్పీల్ చేశాడు. దీనిని విచారించడానికి గతేడాది ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేశారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజా థాకరే ఈ కేసుని ‘అత్యంత అరుదైన కేసుల్లో ఒకటి’’ అని వాదిస్తూ మరణశిక్షల్ని నిర్ధారించాలని కోర్టుని కోరారు. ఈ కేసులో ట్రయల్ కోర్టు 13 మందిలో ఐదుగురికి మరణశిక్ష, ఏడుగురికి మావజ్జీవ శిక్ష విధించింది. రైలు పేలుళ్లకు ‘‘ఇండియన్ ముజాహిదీన్’’ ఉగ్రసంస్థ పాల్పడినట్లు విచారణలో తేలింది.
తాజావార్తలు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
-
Cheesy Chicken Sandwich Recipe: నోరూరించే చీజీ ‘చికెన్ శాండ్విచ్’.. బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ కోసం ఐదు నిమిషాల్లో ఇలా చేసుకోండి!
-
Bank Licence Cancelled: ఆ బ్యాంక్కు బిగ్ షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. లైసెన్స్ రద్దు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?
-
PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
-
RR vs LSG: ప్లేఆఫ్ స్థానం కోసం రాజస్థాన్.. పరువు కోసం లఖ్నవూ సూపర్ జెయింట్స్.. గెలిచేదెవరో.?
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!