Bus Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. గుద్దుకున్న లగ్జరీ బస్సులు.. ఆరుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
6 Dead After Two Luxury Travel Buses Collide In Maharashtra Buldhana: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం బుల్దానా జిల్లాలో NH6 రహదారిపై రెండు లగ్జరీ బస్సులు ఎదురెదురుగా గుద్దుకున్నాయి. అర్థరాత్రి 2:30 గంటల ప్రాంతంలో మల్కాపూర్ టౌన్లోని ఓ ఫ్లైఓవర్పై జరిగిన ఈ యాక్సిడెంట్లో 6 మంది స్పాట్లోనే చనిపోగా.. 25 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. గాయాలైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వారిలో నాలుగైది మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
Also Read
- JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
- CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
- Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
- CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
అమర్నాథ్ తీర్థయాత్రలో భాగంగా హింగోళి వెళ్తున్న బస్సు.. నాశిక్కి వెళ్తున్న బస్సుని ఢీకొనడంతో, ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు ఓ పోలీసు అధికారి వెల్లడించారు. నాశిక్కి వెళ్తున్న బస్సు ఒక ట్రక్కుని ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించింది. సరిగ్గా అదే సమయంలో హింగోళివైపు వెళ్తున్న బస్సు ఎదురుగా రావడంతో.. రెండూ గుద్దేసుకున్నాయి. రెండు బస్సులు వేగంగా వెళ్తుండటంతో.. డ్రైవర్లు అదుపు చేయలేకపోయారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందగానే.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా రహదారిపై భారీ ట్రాఫిక్ ఏర్పడటంతో.. రాకపోకలకు అంతరాయం కలిగింది.
Minor Girl Gangrape: మధ్యప్రదేశ్లో దారుణం.. ఆలయం సమీపంలో మైనర్పై గ్యాంగ్రేప్
ఈ నెల ప్రారంభంలోనూ.. మహారాష్ట్రలో ఓ బస్సు మంటల్లో దగ్ధమైన సంఘటన చోటు చేసుకుంది. సమృద్ధి మహామార్గ్ ఎక్స్ప్రెస్వే పై జరిగిన ఈ ఘటనలో.. మొత్తం 26 మంది చనిపోగా, పలువురు గాయపడ్డారు. ఈ బస్సు యవత్మాల్ నుంచి పూణె వెళ్తున్న సమయంలో, ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బుల్దానా జిల్లాలో శనివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు.. సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కలిసి ప్రమాద స్థలాన్ని సందర్శించారు.
తాజావార్తలు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
-
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
-
JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
-
Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?