Bus Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. గుద్దుకున్న లగ్జరీ బస్సులు.. ఆరుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
6 Dead After Two Luxury Travel Buses Collide In Maharashtra Buldhana: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం బుల్దానా జిల్లాలో NH6 రహదారిపై రెండు లగ్జరీ బస్సులు ఎదురెదురుగా గుద్దుకున్నాయి. అర్థరాత్రి 2:30 గంటల ప్రాంతంలో మల్కాపూర్ టౌన్లోని ఓ ఫ్లైఓవర్పై జరిగిన ఈ యాక్సిడెంట్లో 6 మంది స్పాట్లోనే చనిపోగా.. 25 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. గాయాలైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వారిలో నాలుగైది మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
అమర్నాథ్ తీర్థయాత్రలో భాగంగా హింగోళి వెళ్తున్న బస్సు.. నాశిక్కి వెళ్తున్న బస్సుని ఢీకొనడంతో, ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు ఓ పోలీసు అధికారి వెల్లడించారు. నాశిక్కి వెళ్తున్న బస్సు ఒక ట్రక్కుని ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించింది. సరిగ్గా అదే సమయంలో హింగోళివైపు వెళ్తున్న బస్సు ఎదురుగా రావడంతో.. రెండూ గుద్దేసుకున్నాయి. రెండు బస్సులు వేగంగా వెళ్తుండటంతో.. డ్రైవర్లు అదుపు చేయలేకపోయారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందగానే.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా రహదారిపై భారీ ట్రాఫిక్ ఏర్పడటంతో.. రాకపోకలకు అంతరాయం కలిగింది.
Minor Girl Gangrape: మధ్యప్రదేశ్లో దారుణం.. ఆలయం సమీపంలో మైనర్పై గ్యాంగ్రేప్
ఈ నెల ప్రారంభంలోనూ.. మహారాష్ట్రలో ఓ బస్సు మంటల్లో దగ్ధమైన సంఘటన చోటు చేసుకుంది. సమృద్ధి మహామార్గ్ ఎక్స్ప్రెస్వే పై జరిగిన ఈ ఘటనలో.. మొత్తం 26 మంది చనిపోగా, పలువురు గాయపడ్డారు. ఈ బస్సు యవత్మాల్ నుంచి పూణె వెళ్తున్న సమయంలో, ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బుల్దానా జిల్లాలో శనివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు.. సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కలిసి ప్రమాద స్థలాన్ని సందర్శించారు.
తాజావార్తలు
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!