Bus Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. గుద్దుకున్న లగ్జరీ బస్సులు.. ఆరుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
6 Dead After Two Luxury Travel Buses Collide In Maharashtra Buldhana: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం బుల్దానా జిల్లాలో NH6 రహదారిపై రెండు లగ్జరీ బస్సులు ఎదురెదురుగా గుద్దుకున్నాయి. అర్థరాత్రి 2:30 గంటల ప్రాంతంలో మల్కాపూర్ టౌన్లోని ఓ ఫ్లైఓవర్పై జరిగిన ఈ యాక్సిడెంట్లో 6 మంది స్పాట్లోనే చనిపోగా.. 25 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. గాయాలైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వారిలో నాలుగైది మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
Also Read
- Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
- Ujjain: 170 ఏళ్ల హనుమంతుడి విగ్రహం.. రెండు రోజులు ప్రయత్నించినా అంగుళం కూడా కదల్లేదు!
- Assam Murder Case: ఫ్రిజ్లో తల, వేళ్లు నరికిన భర్త.. పెంపుడు కుక్కకు మృతదేహాన్ని తినిపించే ప్లాన్?
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
అమర్నాథ్ తీర్థయాత్రలో భాగంగా హింగోళి వెళ్తున్న బస్సు.. నాశిక్కి వెళ్తున్న బస్సుని ఢీకొనడంతో, ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు ఓ పోలీసు అధికారి వెల్లడించారు. నాశిక్కి వెళ్తున్న బస్సు ఒక ట్రక్కుని ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించింది. సరిగ్గా అదే సమయంలో హింగోళివైపు వెళ్తున్న బస్సు ఎదురుగా రావడంతో.. రెండూ గుద్దేసుకున్నాయి. రెండు బస్సులు వేగంగా వెళ్తుండటంతో.. డ్రైవర్లు అదుపు చేయలేకపోయారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందగానే.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా రహదారిపై భారీ ట్రాఫిక్ ఏర్పడటంతో.. రాకపోకలకు అంతరాయం కలిగింది.
Minor Girl Gangrape: మధ్యప్రదేశ్లో దారుణం.. ఆలయం సమీపంలో మైనర్పై గ్యాంగ్రేప్
ఈ నెల ప్రారంభంలోనూ.. మహారాష్ట్రలో ఓ బస్సు మంటల్లో దగ్ధమైన సంఘటన చోటు చేసుకుంది. సమృద్ధి మహామార్గ్ ఎక్స్ప్రెస్వే పై జరిగిన ఈ ఘటనలో.. మొత్తం 26 మంది చనిపోగా, పలువురు గాయపడ్డారు. ఈ బస్సు యవత్మాల్ నుంచి పూణె వెళ్తున్న సమయంలో, ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బుల్దానా జిల్లాలో శనివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు.. సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కలిసి ప్రమాద స్థలాన్ని సందర్శించారు.
తాజావార్తలు
-
Anand Deverakonda: వైష్ణవి చైతన్యతో రిలేషన్.. అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ!
-
Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
-
Varanasi Movie: ‘వారణాసి’ అంతకుమించి.. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు!
-
WhatsApp: బిగ్ షాక్ ఇచ్చిన వాట్సాప్.. ఇక ఆ ఫోన్లలో యాప్ పని చేయదు..
-
Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
ట్రెండింగ్
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!