Chhattisgarh: మోడీ టూర్కు ముందు కీలక పరిణామం.. 50 మంది మావోలు లొంగుబాటు
- ఛత్తీస్గఢ్లో మోడీ టూర్కు ముందు కీలక పరిణామం
- 50 మంది మావోలు లొంగుబాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ ఆదివారం ఛత్తీస్గఢ్ పర్యటనకు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. 50 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. శనివారం సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దాదాపు 18 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇలా మూడు నెలల కాలంలో మొత్తం 100 మందికిపైగా మావోయిస్టులు చనిపోయారు.
అయితే ఆదివారం ప్రధాని మోడీ ఛత్తీస్గఢ్లో పర్యటించనున్నారు. ఈ మధ్య మావోయిస్టులకు వరుస దెబ్బలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో అనూహ్యంగా 50 మంది మావోయిస్టులు లొంగిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే ఇందులో 14 మంది మావోయిస్టులపై రూ.68 లక్షల రివార్డ్స్ ఉన్నాయి. ఒక్కొక్కరిపై దాదాపుగా రూ.5లక్షల వరకు రివార్డ్ ఉంది.
Also Read
ఇది కూడా చదవండి: Puri Jagannadh : అఫీషియల్.. విజయ్ సేతుపతితో కొత్త సినిమా ప్రకటించిన పూరీ జగన్నాథ్
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఆదివారం 50 మంది నక్సలైట్లు లొంగిపోయారని, వారిలో 14 మందిపై మొత్తం రూ.68 లక్షల రివార్డ్స్ ఉందని ఒక పోలీసు అధికారి తెలిపారు. ఉద్యమంలో ఏర్పడిన విభేదాలలు కారణంగా లొంగిపోయినట్లు బీజాపూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జితేంద్ర కుమార్ యాదవ్ వెల్లడించారు. మావోలు సీఆర్పీఎఫ్ అధికారుల ముందు లొంగిపోయారని ఆయన తెలిపారు. ఆయుధాలు అప్పగించినట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఉద్యమం విడిచిపెట్టి ప్రజా స్రవంతిలోకి వచ్చే మావోలకు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని ఎస్పీ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: SRH Ugadi Wishes: తెలుగు వారికి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎస్ఆర్హెచ్ టీం.. వీడియో వైరల్
#WATCH | Bijapur, Chhattisgarh | In a big success against naxalism, 50 naxals, with a bounty of about 68 lakhs, surrendered in front of Bijapur police.
Our efforts against naxalism in naxal areas will continue. Its consequence is either surrender, arrest or neutralization:… pic.twitter.com/98I55q108V
— ANI (@ANI) March 30, 2025
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!