Wolf Attacks: నరమాంసానికి మరిగిన తోడేళ్లు.. 24 గంటల్లో ఇద్దరు పిల్లలపై దాడి..
- ఉత్తర ప్రదేశ్ని కలవరపెడుతున్న తోడేళ్ల దాడులు..
- నరమాంసానికి అలవాటు పడిన తోడేళ్లు..
- పిల్లలే టార్గెట్గా దాడులు.. ఇప్పటి వరకు 8 మంది మృతి..
- 24 గంటల్లో ఇద్దరు పిల్లలపై దాడి..
- ఆరు తోడేళ్లలో నాలుగింటిని బంధించిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wolf Attacks: ఉత్తర ప్రదేశ్ని నరమాంస భక్షక తోడేళ్లు భయపెడుతున్నాయి. ముఖ్యంగా బహ్రైచ్ జిల్లాలో వరసగా దాడులకు పాల్పడుతున్నాయి. మానవ మాంసానికి మరిగిని తోడేళ్లు చిన్న పిల్లలే టార్గెట్గా రాత్రి సమయాల్లో ఊళ్లపై పడుతున్నాయి. బహ్రైచ్ జిల్లాలోని 35 గ్రామాల్లో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. జూలై 17 నుంచి ఈ తోడేళ్ల దాడుల్లో 8 మంది మరణించారు. మరణించిన వారిలో ఏడుగురు పిల్లలే ఉన్నారు. మరో 30 మమంది వరకు గాయపడ్డారు.
Read Also: PM Modi: బ్రూనై, సింగపూర్ పర్యటనకు ప్రధాని మోడీ..
Also Read
- Nitesh Rane: అమీర్ ఖాన్ మూడో పెళ్లిపై బీజేపీ మంత్రి నితేష్ రాణే విమర్శలు.. 'లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్' అంటూ ఫైర్!
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
ఈ తోడేళ్లను పట్టుకునేందుకు వందలాది మంది అటవీ శాఖ అధికారులు, పోలీసులు శ్రమిస్తున్నారు. ఆరు తోడేళ్లు కలిగిన గుంపులో ఇప్పటి వరకు అధికారులు నాలుగింటిని బంధించారు. మరో రెండు మాత్రం యథావిధిగా వేటాడుతున్నాయి. తాజాగా సెప్టెంబర్ 2-3 తేదీల మద్య మరోసారి దాడి జరిగింది. జిల్లాలోని గిర్ధార్పూర్ ప్రాంతంలో 5 ఏళ్ల బాలికపై దాడి జరిగింది. ఆమె తల, మెడపై గాయాలయ్యాయి. దాడి తర్వాత బాలికనున ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు చెప్పారు.
జిల్లా కలెక్టర్ రాణి, ఎస్పీ బృందా శుక్లా బాలిక పరిస్థితిపై ఆరా తీశారు. గత 24 గంటల్లో ఇది రెండో దాడి కావడం గమనార్హం. ఈ తోడేళ్ల దాడులపై యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ మరిన్ని బలగాలను మోహరించాలని ఆదేశించారు. ‘‘ఆపరేషన్ భేదియా’’ కింద నాలుగు తోడేళ్లను పట్టుకున్నారు. రాత్రివేళల్లో అధికారులు గస్తీ పెంచారు. తోడేళ్లను పట్టుకునేందుకు ఏనుగుల పేడ, మూత్రంతో గ్రామాల నుంచి దూరంగా పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. పిల్లలే లక్ష్యం కావడంతో అటవీ అధికారులు పిల్లల సైజులో ఉండే బొమ్మలకు తీసుకువచ్చి, వాటికి పిల్లల మూత్రంలో తడిపి తోడేళ్లను తప్పుదారి పట్టించి, బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజావార్తలు
-
Trikala : ఏకంగా మూడు OTTలలో త్రికాల స్ట్రీమింగ్
-
Viral Wedding: 17 ఏళ్ల ఇన్ఫ్లుయెన్సర్ కు పెళ్లి.. భర్తతో రొమాంటిక్గా పోజులిస్తున్న మైనర్ వధువు.. షాక్లో అభిమానులు
-
Team India: ఓవైపు భారీ ఓటములు.. మరోవైపు అత్యంత చెత్త రికార్డులు.. ఈ టీమిండియాకు ఏమైంది!
-
Harry Brook: అన్నంత పనిచేశాడు.. పక్కాగా స్కెచ్ వేసి టీమిండియాను మట్టికరిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్!
-
Lenin Box Office Collections: బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘లెనిన్’.. రెండు రోజుల్లోనే 37 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..