Wolf Attacks: నరమాంసానికి మరిగిన తోడేళ్లు.. 24 గంటల్లో ఇద్దరు పిల్లలపై దాడి..
- ఉత్తర ప్రదేశ్ని కలవరపెడుతున్న తోడేళ్ల దాడులు..
- నరమాంసానికి అలవాటు పడిన తోడేళ్లు..
- పిల్లలే టార్గెట్గా దాడులు.. ఇప్పటి వరకు 8 మంది మృతి..
- 24 గంటల్లో ఇద్దరు పిల్లలపై దాడి..
- ఆరు తోడేళ్లలో నాలుగింటిని బంధించిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wolf Attacks: ఉత్తర ప్రదేశ్ని నరమాంస భక్షక తోడేళ్లు భయపెడుతున్నాయి. ముఖ్యంగా బహ్రైచ్ జిల్లాలో వరసగా దాడులకు పాల్పడుతున్నాయి. మానవ మాంసానికి మరిగిని తోడేళ్లు చిన్న పిల్లలే టార్గెట్గా రాత్రి సమయాల్లో ఊళ్లపై పడుతున్నాయి. బహ్రైచ్ జిల్లాలోని 35 గ్రామాల్లో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. జూలై 17 నుంచి ఈ తోడేళ్ల దాడుల్లో 8 మంది మరణించారు. మరణించిన వారిలో ఏడుగురు పిల్లలే ఉన్నారు. మరో 30 మమంది వరకు గాయపడ్డారు.
Read Also: PM Modi: బ్రూనై, సింగపూర్ పర్యటనకు ప్రధాని మోడీ..
Also Read
- El Nino Alert: ఐఎండీ అలర్ట్.. ఆగస్టులో తక్కువ వర్షాలుంటాయని హెచ్చరిక
- Delhi: ఐబీ ఉద్యోగి అంకిత్ శర్మ హత్య కేసులో సంచలన తీర్పు.. మాజీ ఆప్ నేత తాహిర్ హుస్సేన్కు జీవిత ఖైదు
- PM-KISAN Scheme: రైతులకు కేంద్రం గుడ్న్యూస్.. మరో ఐదేళ్లు పీఎం-కిసాన్
- Central Cabinet Decision: సముద్ర మంథన్ ప్రాజెక్ట్ ఆమోదం.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
ఈ తోడేళ్లను పట్టుకునేందుకు వందలాది మంది అటవీ శాఖ అధికారులు, పోలీసులు శ్రమిస్తున్నారు. ఆరు తోడేళ్లు కలిగిన గుంపులో ఇప్పటి వరకు అధికారులు నాలుగింటిని బంధించారు. మరో రెండు మాత్రం యథావిధిగా వేటాడుతున్నాయి. తాజాగా సెప్టెంబర్ 2-3 తేదీల మద్య మరోసారి దాడి జరిగింది. జిల్లాలోని గిర్ధార్పూర్ ప్రాంతంలో 5 ఏళ్ల బాలికపై దాడి జరిగింది. ఆమె తల, మెడపై గాయాలయ్యాయి. దాడి తర్వాత బాలికనున ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు చెప్పారు.
జిల్లా కలెక్టర్ రాణి, ఎస్పీ బృందా శుక్లా బాలిక పరిస్థితిపై ఆరా తీశారు. గత 24 గంటల్లో ఇది రెండో దాడి కావడం గమనార్హం. ఈ తోడేళ్ల దాడులపై యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ మరిన్ని బలగాలను మోహరించాలని ఆదేశించారు. ‘‘ఆపరేషన్ భేదియా’’ కింద నాలుగు తోడేళ్లను పట్టుకున్నారు. రాత్రివేళల్లో అధికారులు గస్తీ పెంచారు. తోడేళ్లను పట్టుకునేందుకు ఏనుగుల పేడ, మూత్రంతో గ్రామాల నుంచి దూరంగా పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. పిల్లలే లక్ష్యం కావడంతో అటవీ అధికారులు పిల్లల సైజులో ఉండే బొమ్మలకు తీసుకువచ్చి, వాటికి పిల్లల మూత్రంలో తడిపి తోడేళ్లను తప్పుదారి పట్టించి, బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజావార్తలు
-
Sardar 2: కార్తి డ్యూయల్ రోల్ అరాచకం .. ఎస్.జె. సూర్య స్టైలిష్ విలనిజం..టీజర్ తో షేక్!
-
The Paradise Teaser: ఆగస్టు 6న ‘ది ప్యారడైజ్’ టీజర్.. నాని మ్యాడ్నెస్కు రెడీ అవ్వండి!
-
Single-Teacher Schools: సింగిల్ టీచర్ పాఠశాలలపై హైకోర్టులో పిల్.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
-
CM Revanth Reddy : పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు TOMCOMదే బాధ్యత
-
Cockroach Party: మరో దేశానికి పొంచి ఉన్న ‘కాక్రోచ్’ ముప్పు.. అవినీతిపై ఢిల్లీ తరహాలో కసరత్తు
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!