2011 Phool Mohammad case: పూల్ మహ్మద్ హత్య కేసులో మాజీ డీఎస్పీతో సహా 30 మందికి యావజ్జీవం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
30 Jailed For Life In 2011 Rajasthan Murder Case: 2011లో రాజస్థాన్ ను కుదిపేసిన పూల్ మహ్మద్ హత్య కేసులో సవాయ్ మాధోపూర్ జిల్లాలోని ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించింది. శుక్రవారం 30 మందిని దోషులుగా ప్రకటిస్తూ వారందరికి జీవిత ఖైదు శిక్ష విధించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారించిన ఈ కేసులో 30 మందిని దోషులుగా ప్రకటించగా.. 49 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసును బుధవారం విచారించిన స్పెషల్ కోర్టు శుక్రవారం శిక్షలు ఖరారు చేసింది. శిక్ష పడినవారిలో మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహేంద్ర సింగ్ కూడా ఉన్నారు. సీబీఐ న్యాయవాది శ్రీదాస్ సింగ్ మాట్లాడుతూ.. ఈ కేసులో డీఎస్పీ మహేంద్ర సింగ్ తో పాటు 30 మందిని దోషులుగా నిర్థారించి జీవిత ఖైదు విధించడంతో పాటు జరిమానా విధించినట్లు వెల్లడించారు.
కేసు వివరాలు:
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
మార్చి 17,2011న సుర్వాన్ గ్రామంలో ఓ వ్యక్తి హత్య కేసులో పోలీసులు సరిగ్గా వ్యవహరించడం లేదని ఆరోపిస్తూ వాటర్ ట్యాక్ ఎక్కాడు. ఈ సమయంలో పరిస్థితిని చక్కదిద్దడానికి పోలీస్ ఇన్స్పెక్టర్ ఫూల్ మహ్మద్ ఆ గ్రామానికి వెళ్లాడు. వాటర్ ట్యాంక్ పై నుంచి వ్యక్తి దూకేయడంతో గ్రామస్థులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ఆ ప్రాంతంలో మరపరమైన అల్లర్లు జరిగాయి. అక్కడికి వచ్చిన పోలీస్ ఇన్స్పెక్టర్ ఫూల్ మహ్మద్ పై రాళ్లతో దాడి చేశారు. జీపులో తప్పించుకునేందుకు ప్రయత్నించిన ప్రజలు రాళ్లదాడి చేస్తూనే ఉన్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన పూల్ మహ్మద్ అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. ఈ క్రమంలో గుంపు పోలీస్ వాహనానికి నిప్పు పెట్టి, పూల్ మహ్మద్ ను సజీవ దహనం చేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అయింది. మరణించిన తర్వాత రాజస్థాన్ రాష్ట్రప్రభుత్వం పూల్ మహ్మద్ కు అమరవీరుడి హోదా కల్పించడంతో పాటు ఈ ఘటనపై సీబీఐ ఎంక్వైరీ అప్పగించింది.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!