Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
- బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
- భారత్-యూకే మధ్య కీలక ఒప్పందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Air Force QFIs to Train Royal Air Force Pilots in UK: భారత్-యూకే రక్షణ సహకారంలో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. భారత వైమానిక దళానికి (IAF) చెందిన ముగ్గురు Qualified Flying Instructors (QFIs) బ్రిటన్లోని వేల్స్లో ఉన్న Royal Air Force (RAF) Valleyలో విధుల్లో చేరారు. బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్కు చెందిన ఫాస్ట్-జెట్ పైలట్లకు విమాన శిక్షణ అందించేందుకు వీరు అక్కడికి వెళ్లారు. భారత వైమానిక దళానికి చెందిన శిక్షకులు బ్రిటన్లోని RAF శిక్షణ వ్యవస్థలో భాగమై బ్రిటిష్ పైలట్లకు శిక్షణ ఇవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో భారత్-యూకే ద్వైపాక్షిక రక్షణ సహకారంలో ఇది చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది.
తొలిసారిగా బ్రిటన్కు IAF QFIs
ఈ విషయాన్ని భారత వైమానిక దళ మీడియా కోఆర్డినేషన్ సెంటర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. భారత వాయుసేనకు చెందిన ముగ్గురు Qualified Flying Instructors RAF Valley, Walesలో చేరి Royal Air Force పైలట్లకు శిక్షణ అందించనున్నారని తెలిపింది. ఇది యూకేలో భారత QFIs తొలి నియామకంగా పేర్కొంది. రెండు దేశాల మధ్య వృత్తిపరమైన నైపుణ్యం, పరస్పర అనుసంధానం, శిక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే కీలక అడుగుగా భారత వైమానిక దళం అభివర్ణించింది.
Also Read
- BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
- BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
- Kiren Rijiju: "ఆ విషయంలో తగ్గేదేలే".. చైనాకు కిరణ్ రిజిజు స్ట్రాంగ్ వార్నింగ్!
- BRICS 2026: "ఒకరి విజయానికి మరొకరం సహకరిద్దాం".. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక సందేశం..
ఫాస్ట్-జెట్ పైలట్లకు శిక్షణ
RAF Valley బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్లో పైలట్ శిక్షణకు కీలక కేంద్రంగా ఉంది. ఇక్కడ భవిష్యత్ ఫాస్ట్-జెట్ పైలట్లకు అధునాతన విమాన శిక్షణ అందిస్తారు. భారత QFIs అక్కడి శిక్షణ వ్యవస్థలో భాగంగా పనిచేయడం వల్ల రెండు దేశాల వైమానిక దళాల మధ్య శిక్షణా అనుభవాలు, ఆపరేషనల్ విధానాలు, ప్రొఫెషనల్ నైపుణ్యాల పరస్పర మార్పిడికి అవకాశం ఏర్పడుతుంది.
భారత్-యూకే రక్షణ సంబంధాల్లో మరో ముందడుగు
ఇటీవలి కాలంలో భారత్, యూకే దేశాలు రక్షణ రంగంలో సహకారాన్ని మరింత విస్తరిస్తున్నాయి. సంయుక్త సైనిక విన్యాసాలు, శిక్షణ, సామర్థ్య నిర్మాణం వంటి అంశాల్లో రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత వైమానిక దళ శిక్షకులను యూకేలోని RAF శిక్షణ వ్యవస్థలోకి తీసుకోవడం రెండు దేశాల మధ్య పెరుగుతున్న రక్షణ సహకారానికి నిదర్శనంగా నిలుస్తోంది.
ఉన్నతస్థాయి చర్చల తర్వాత కీలక పరిణామం
ఈ పరిణామానికి ముందు భారత్, యూకే ఉన్నతాధికారుల మధ్య పలు రక్షణ, భద్రతా అంశాలపై చర్చలు జరిగాయి. రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్, యూకే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జోనాథన్ నికోలస్ పావెల్తో ప్రాంతీయ భద్రతా పరిణామాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇప్పటికే అమల్లో ఉన్న భారత్-యూకే రక్షణ సహకార వ్యవస్థల పురోగతిని కూడా సమీక్షించినట్లు సమాచారం.
జైశంకర్, అజిత్ డోవల్ చర్చలు
విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా యూకే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జోనాథన్ పావెల్తో ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతా అంశాలపై చర్చలు జరిపారు. అదే సమయంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్, పావెల్తో వార్షిక భారత్-యూకే స్ట్రాటజిక్ డైలాగ్కు సంబంధించిన అంశాలపై చర్చించారు.
మోదీ-స్టార్మర్ సమావేశంలో కీలక నిర్ణయాలు
యూకే మాజీ ప్రధాని కీర్ స్టార్మర్ గత ఏడాది అక్టోబర్లో ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు భారత్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు భారత్-యూకే సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో రెండు దేశాల సాయుధ దళాల మధ్య సంయుక్త విన్యాసాలు, శిక్షణ, సామర్థ్య నిర్మాణం ద్వారా పరస్పర సహకారాన్ని విస్తరించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
నౌకాదళ సహకారానికి కూడా ప్రాధాన్యత
భారత్-యూకే మధ్య సముద్ర భద్రతా సహకారాన్ని కూడా మరింత బలోపేతం చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. యూకే క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ భారత్లోని పోర్ట్ను సందర్శించడం, భారత నౌకాదళంతో రాయల్ నేవీ నిర్వహించిన KONKAN వ్యాయామం వంటి కార్యక్రమాలను ప్రధాని మోడీ స్వాగతించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర భద్రతను బలోపేతం చేయడంలో రెండు దేశాలు కలిసి పనిచేయాలని అంగీకరించాయి.
శిక్షణ, విద్యా రంగంలో మరింత సహకారం
భారత వైమానిక దళ Qualified Flying Instructorsను యూకే రాయల్ ఎయిర్ ఫోర్స్ శిక్షణలో భాగస్వామ్యం చేసే ఏర్పాటుపై పురోగతిని కూడా ఇరు దేశాలు స్వాగతించాయి. ఈ సహకారం ద్వారా కేవలం పైలట్ శిక్షణ మాత్రమే కాకుండా విద్య, శిక్షణ, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో భారత్-యూకే రక్షణ సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది.
భారత్కు ఎందుకు కీలకం?
బ్రిటన్ వంటి ప్రముఖ రక్షణ భాగస్వామి దేశంలోని అధునాతన పైలట్ శిక్షణ వ్యవస్థలో భారత QFIs పనిచేయడం భారత వైమానిక దళ నైపుణ్యానికి అంతర్జాతీయ గుర్తింపుగా భావించవచ్చు. అదే సమయంలో రెండు దేశాల వైమానిక దళాల మధ్య పరస్పర అవగాహన, ఇంటర్ఆపరబిలిటీ, శిక్షణ ప్రమాణాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. మొత్తంగా, RAF Valleyలో ముగ్గురు భారత QFIs చేరడం భారత్-యూకే రక్షణ భాగస్వామ్యంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. భవిష్యత్తులో సంయుక్త శిక్షణ, సైనిక విన్యాసాలు, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలు మరింత విస్తరించే అవకాశం కనిపిస్తోంది.
🇮🇳🤝🇬🇧 A historic first in India–UK defence cooperation.
Three Indian Air Force Qualified Flying Instructors (QFIs) have joined RAF Valley, Wales, to instruct Royal Air Force pilots — marking the first deployment of Indian QFIs to the UK.
A landmark step in strengthening our… pic.twitter.com/9v9jdUXoB3
— Indian Air Force (@IAF_MCC) September 11, 2026
తాజావార్తలు
-
Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
-
DC Success Gift : అందరికి ఇచ్చి ‘వామికాగబ్బీ’కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
-
BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
-
iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
-
Chandan Anand: ‘హనుమాన్ అంశ్’ తర్వాత మారిన చందన్ ఆనంద్ అదృష్టం.. సల్మాన్, షారుఖ్ సినిమాల్లో ఛాన్స్
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?