Lok Sabha Elections 2024: లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం 3.40 లక్షల మంది కేంద్ర బలగాల మోహరింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Elections 2024: లోక్సభ ఎన్నికలు ముంచుకోస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా అంతా సిద్ధమవుతోంది. లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఈ ఎన్నికలన్నింటికి కలిపి 3.40 లక్షల మంది సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్(సీఎపీఎఫ్) బలగాలను మోహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి 3400 కంపెనీలు(3.40 లక్షల సిబ్బంది) పారామిలిటరీ విభాగాలను మోహరించాలని కోరుతూ ఎన్నికల సంఘం పంపిన ప్రతిపాదనను పరిగణలోకి తీసుకున్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీఏపీఎఫ్ని మోహరించాలని నిర్ణయించుకుంది. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా జరిగేలా చూసేందుకు కసరత్తు జరుగుతోంది.
Also Read
- Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
- Petrol Diesel Price Hike: పెట్రోల్-డీజిల్ ధరలపై భారీ హెచ్చరికలు.. మరోసారి పెరుగుతాయా?
- West Bengal repolling: బెంగాల్లో మళ్లీ ఎన్నికల వేడి.. ఫల్తాలో రీ-పోలింగ్ షురూ! అసలు ట్విస్ట్ ఇదే..
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Read Also: Gyanvapi Case: జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో హిందువుల పూజలపై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు..
ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ కోసం గరిష్టంగా 920 CAPF కంపెనీలను కోరింది, జమ్మూ మరియు కాశ్మీర్లో 635 కంపెనీలు కావాలని ఈసీ కోరింది. ఛత్తీస్గఢ్ లో 360, బీహార్కి 295, యూపీకి 252 కంపెనీల బలగాలను కోరగా.. ఏపీ, పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాలకు ఒక్కొక్కటికి 250 కంపెనీలు, గుజరాత్, మణిపూర్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కొక్కటికి 200 కంపెనీలు, ఒడిశాకు 175, అస్సాం, తెలంగానలకు 160 కంపెనీల చొప్పున, మహారాష్ట్రలో 150; మధ్యప్రదేశ్లో 113; త్రిపురలో 100; హర్యానాలో 95; అరుణాచల్ ప్రదేశ్లో 75; కర్ణాటక, ఉత్తరాఖండ్ మరియు ఢిల్లీలో ఒక్కొక్కరు 70; కేరళలో 66; లద్దాఖ్లో 57; హిమాచల్ ప్రదేశ్లో 55; నాగాలాండ్లో 48; మేఘాలయలో 45; సిక్కింలో 17; మిజోరంలో 15; దాద్రా మరియు నగర్ హవేలీలో 14; గోవాలో 12; చండీగఢ్లో 11; పుదుచ్చేరిలో 10; అండమాన్ మరియు నికోబార్లో ఐదు, లక్షద్వీప్కి మూడు కంపెనీలు కావాలని ఎన్నికల సంఘం కోరింది. లోక్సభలోని 543 స్థానాలకు ఏప్రిల్-మేలో ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Mega 158: ‘మెగా’ డాటర్ ఫిక్స్.. సినిమాకే హైలైట్ అవ్వనుందా!
-
Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరలు మళ్లీ పైపైకి.. ఈరోజు తులం ఎంతంటే?
-
Summer Foods for Kids: డీహైడ్రేషన్కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
-
Dragon Glimpse Records: ‘డ్రాగన్’ గ్లింప్స్తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. 24 గంటల్లో భారతీయ సినీ హిస్టరీలోనే ఆల్టైమ్ రికార్డ్!
-
IPL 2026 Playoffs Race: ముంబైపై కేకేఆర్ విజయం.. సీఎస్కే ప్లేఆఫ్స్ ఛాన్సెస్ గల్లంతే, దేవుడు దిగొస్తే తప్ప!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!