Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News 25 Pc Of Startups In Us Silicon Valley Managed By People Of Indian Origin Says Sitharaman

Nirmala Sitharaman: సిలికాన్‌ వ్యాలీలో 25 శాతం స్టార్టప్‌లు భారతీయ సంతతికి చెందిన వారే నిర్వహిస్తున్నారు..

Published Date :September 11, 2022 , 4:27 pm
By Mahesh Jakki
Nirmala Sitharaman:  సిలికాన్‌ వ్యాలీలో 25 శాతం స్టార్టప్‌లు భారతీయ సంతతికి చెందిన వారే నిర్వహిస్తున్నారు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Nirmala Sitharaman: దేశాభివృద్ధి లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థల్లో విద్యాబోధన జరగాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. పరిశ్రమల‌కు ఏం అవ‌స‌ర‌మో భారతదేశం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. పరిశ్రమలోకి ప్రవేశించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న విద్యార్థులను విద్యా సంస్థలు ఉత్పత్తి చేయాల‌ని సూచించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్, కాంచీపురం (ఐఐఐటీడీఎం కాంచీపురం)లో శనివారం జరిగిన పదవ స్నాతకోత్సవంలో మొత్తం 380 మంది విద్యార్థులు పట్టభద్రులయ్యారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

భారతదేశ ఉన్నత విద్య ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లను తయారుచేయడంలో దోహదపడిందని.. సిలికాన్ వ్యాలీలోని మొత్తం స్టార్టప్‌లలో 25 శాతం భారత సంతతికి చెందిన వారే నిర్వహిస్తున్నారని నిర్మలా సీతారామన్ తెలిపారు. గ్లోబల్ యూనివర్శిటీలతో పోలిస్తే భారతదేశ ఉన్నత విద్య తక్కువ లేదా బలహీనమైనది కాదని అన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీలను నిర్వహించడంలో భారతీయ విశ్వవిద్యాలయాలలో చదివే వ్యక్తులు రెండో అతిపెద్ద పోటీదారులు అని ఆమె చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 58 అగ్రశ్రేణి కంపెనీ సీఈవోలు భారతీయ విద్యను అభ్యసించారని చెప్పుకొచ్చారు. భారత ప్రభుత్వం స్టార్టప్‌లను ప్రోత్సహిస్తూ విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా మార్చడానికి సహకరిస్తోందన్నారు.

Doctors Cheating: ఏం వైద్యులు రా.. బాబు..! గర్భాశయం తొలగిస్తామని కిడ్నీలే మాయం చేశారు..!

దేశంలో అత్యంత విలువైన అంకుర సంస్థల సంఖ్య శరవేగంగా పెరుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. దేశంలో 100కు పైగా యూనికార్న్‌ (100 కోట్ల డాలర్లు/రూ.8000 కోట్ల విలువైన) సంస్థలున్నాయని, వీటి మొత్తం విలువ 250 బిలియన్‌ డాలర్ల (రూ.20 లక్షల కోట్ల)కు పైగా ఉంటుందని చెప్పారు. గత కొన్నేళ్లలో ఇవి కేపిటల్‌ మార్కెట్ల నుంచి 63 బిలియన్‌ డాలర్లు సమీకరించాయని తెలిపారు. అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలోనూ సుమారు 25 శాతం అంకురాలను భారత సంతతి వ్యక్తులే నిర్వహిస్తున్నారని, ఇది మనకెంతో గర్వకారణమని తెలిపారు.

మన నినాదాలైన జై జవాన్‌, జై కిసాన్‌లకు జై విజ్ఞాన్‌, జై అనుసంధాన్‌ జతయ్యాయని తెలిపారు. ‘నినాదంలోని చివరి రెండు పదాల్లో మీరు పోషించే పాత్రకు గుర్తింపు లభిస్తుందని, అదే 2047 నాటికి అంటే దేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లకు అభివృద్ధి చెందిన దేశంగా, సాంకేతికతకు కేంద్రంగా భారత్‌ అవతరించేందుకు దోహదం చేస్తుంద’ని మంత్రి చెప్పారు.

భారతీయులు దాఖలు చేసిన మొత్తం పేటెంట్ల సంఖ్య 2021-22 నాటికి 66,400 కు పెరిగిందని, 2014-15 లో 42,000 తో పోలిస్తే ఇది పెరిగిందని ఆర్థిక మంత్రి చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ విద్యావిధానం ఉన్నత విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆమె అన్నారు. ఈ ఏడాది ఆమె ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో కూడా సైన్స్, గణితంలో 750 వర్చువల్ ల్యాబ్ లు, భారతదేశానికి స్వాతంత్రం 75 ఏళ్లు పూర్తవుతున్న సంద‌ర్భంగా సిమ్యులేటెడ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ కోసం 75 స్కిల్లింగ్ ఈ-ల్యాబ్ ల‌ను ప్రభుత్వం ప్రకటించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • education in country
  • iiitdm kancheepuram convocation
  • india
  • indians in silicon valley
  • industries in india

తాజావార్తలు

  • Janasena Formation Day: రేపే జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. గిరిజన పల్లెలో పవన్ కళ్యాణ్ వేడుకలు.. షెడ్యూల్ ఇదే!

  • Iran War: ఇరాన్ ‘‘లొంగిపోబోతోంది’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..

  • Nothing Phone: నథింగ్ నుంచి సెన్సేషనల్ ఫోన్లు.. మార్కెట్లోకి 4a సిరీస్ ఎంట్రీ – ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

  • China: ఇరాన్‌కు భారీ సాయం ప్రకటించిన చైనా..

  • Gas Effect: గ్యాస్ కొరత.. పెరిగిన హోటల్ ఫుడ్ ఐటమ్స్ ధరలు..

ట్రెండింగ్‌

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

  • Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!

  • Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions