Cloudbursts: హిమాలయాల్లో క్లౌడ్ బరస్ట్.. కేదార్నాథ్లో చిక్కుకున్న 1600 మంది..
- హిమాలయాల్లో క్లౌడ్ బరస్ట్..
- ఉత్తరాఖండ్.. హిమాచల్ రాష్ట్రాల్లో మెరుపు వరదలు..
- 24 మంది మృతి.. గల్లంతైన వారి కోసం గాలింపు..
- రంగంలోకి దిగిన ఆర్మీ.. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cloudbursts: ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ‘‘క్లౌడ్ బరస్ట్’’తో మెరుపు వరదలు సంభవించాయి. కొన్ని ప్రాంతాల్లో ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల్లో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఉత్తరాఖండ్లోనే 15 మంది మరణించారు. ప్రాణాలతో బయటపడిన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేశారు. చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో కీలక రహదారుల్ని క్లోజ్ చేశారు. రానున్న రోజుల్లో రెండు రాష్ట్రాల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Read Also: Taj Mahal: షాజహాన్, ముంతాజ్ సమాధులపై గంగాజలాన్ని చల్లిన యువకులు..వీడియో వైరల్
Also Read
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
కేదార్నాథ్లో 1600 మంది చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. గౌరీకుండ్-హరిద్వార్ మార్గంలో యాత్రికులు చిక్కుకుపోయారు. యాత్ర ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో 18 మంది గల్లంతయ్యారు. వీరి కోసం రెస్క్యూ సిబ్బంది వెతుకుతోంది. యాత్రికులను తరలించడానికి ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్లను ఉపయోగిస్తోంది. మరోవైపు తప్పిపోయిన వారి కోసం హెలికాప్టర్లు, డ్రోన్లు ఆ ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. ఇప్పటి వరకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 3000 మందిని రక్షించారు. కేదార్నాథ్ యాత్రని తాత్కాలికంగా మూసేశారు.
హిమాచల్ ప్రదేశ్ మండి-పండోహ్ మధ్య మూడు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో చండీగఢ్-మనాలి జాతీయ రహదారిని గత రాత్రి నుంచి మూసేశారు. బాధితుల కోసం హిమాచల్ సీఎం సుఖ్విందర్ సుఖు తక్షణ సాయం కింద రూ.50,000 ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ఆగస్టు 6 వరకు ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల్ని జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్లోని రాంపూర్ సమేజ్ గ్రామంలో ఎనిమిది మంది పాఠశాల విద్యార్థులు తప్పిపోయినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ అరవింద్ తెలిపారు. గల్లంతైన ఎనిమిది మందిలో ఏడుగురు బాలికలు కాగా, ఒక బాలుడు ఉన్నారు.
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!