Rs. 20 Bribe Case: రూ.20 లంచం.. 30 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం.. నిర్దోషిగా విడుదలైన తర్వాతే రోజే కానిస్టేబుల్ మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rs. 20 Bribe Case: రూ.20 లంచం ఆరోపణలతో 30 ఏళ్ల పాటు న్యాయ పోరాటం ఎదుర్కొన్న గుజరాత్కు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్, నిర్దోషిగా విడుదలైన మరుసటి రోజే అకస్మాత్తుగా మరణించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్లోని అహ్మదాబాద్ వేజల్పూర్ ప్రాంతంలో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసిన బాబూభాయ్ ప్రజాపతి 1996లో రూ.20 లంచం తీసుకున్నారనే ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. ఈ కేసులో 1997లో చార్జిషీట్ దాఖలవగా, 2002లో అధికారికంగా అభియోగాలు మోపారు.
Read Also: Pakistan Suicide Bomb Attack: పాకిస్థాన్లో మజీద్ను మేమే పేల్చేశాం.. ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన..
Also Read
- Liquor Prices: మద్యం బాటిళ్లపై అదనపు వసూళ్లు.. సీఎం సీరియస్.. 3 రోజుల్లో 240 మందిపై వేటు..
- Explainer: ఆ నగరాలు మునిగిపోతున్నాయి..! UN నివేదికలో షాకింగ్ నిజాలు!
- Teachers Day 2026: ఉపాధ్యాయులతో ప్రధాని మోడీ సంభాషణ.. టీచర్స్ డే సందర్భంగా కీలక సందేశం
- Chirag Paswan: జంతర్ మంతర్ దాడి కేసులో ట్విస్ట్.. భరద్వాజ్పై FIRకు చిరాగ్ పాశ్వాన్ డిమాండ్
ఇక, సాక్షుల వాంగ్మూలాల నమోదు 2003లో ప్రారంభమై, 2004లో అహ్మదాబాద్ సెషన్స్ కోర్టు బాబూభాయ్ ప్రజాపతిని దోషిగా నిర్ధారించింది. అవినీతి నేరానికి నాలుగేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.3,000 జరిమానా విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అదే ఏడాది ఆయన గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి దాదాపు రెండు దశాబ్దాల పాటు ఈ కేసు హైకోర్టులో కొనసాగింది. చివరికి 2026 ఫిబ్రవరి 4న గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సాక్షుల వాంగ్మూలాల్లో పొంతన లేకపోవడం.. ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలు సమర్పించడంలో విఫలమైందని పేర్కొంటూ బాబూభాయ్ ప్రజాపతిని నిర్దోషిగా విడుదల చేసింది.
అయితే, కానిస్టేబుల్ తరపున వాదించిన న్యాయవాది నితిన్ గాంధీ, ఆరోపణలను నిరూపించేందుకు బలమైన ఆధారాలు లేవని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలను అంగీకరించిన హైకోర్టు, 30 ఏళ్ల నాటి కళంకాన్ని తొలగిస్తూ విముక్తి కల్పించింది. తీర్పు వెలువడిన అనంతరం బాబూభాయ్ ప్రజాపతి తన న్యాయవాది కార్యాలయానికి వెళ్లారు. నిర్దోషిగా విడుదలైన తర్వాత నిలిపివేయబడిన ప్రభుత్వ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని న్యాయవాది సూచించారు. ఈ సందర్భంగా బాబూభాయ్ భావోద్వేగానికి గురయ్యారు. నా జీవితంపై ఉన్న మచ్చ తొలగిపోయింది. ఇప్పుడు దేవుడు నన్ను తన దగ్గరకు పిలవాలి అని ఆయన అన్న మాటలు కార్యాలయంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డయ్యాయి. అనంతరం ఆయన ఇంటికి వెళ్లారు. అయితే న్యాయం దక్కిన ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. మరుసటి రోజే బాబూభాయ్ ప్రజాపతి అకస్మాత్తుగా మరణించారు.
తాజావార్తలు
-
Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
-
Operation Ganga: మోహన్లాల్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. భారీ తారాగణంతో రాబోతున్న ‘ఆపరేషన్ గంగా’
-
Explained: డేటా సునామీ.. దేశంలో జియో ప్రకంపనలకు పదేళ్లు.. ఈ దశాబ్దంలో ఏం మారింది?
-
CM Chandrababu: ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. ప్రొటెక్షన్ సెల్, విజిలెన్స్ కమిటీలు.. సీఎం కీలక సమీక్ష
-
CM Revanth Reddy: “రెండేళ్లు సమయం ఇవ్వండి.. మీ సమస్యలు పరిష్కరిస్తా”.. ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!