Pakistan Suicide Bomb Attack: పాకిస్థాన్లో మజీద్ను మేమే పేల్చేశాం.. ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Suicide Bomb Attack: పాకిస్థాన్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. బాంబుల మోతతో దద్దరిల్లిపోయింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ను భయంతో కుదిపేసిన ఘోర ఘటన ఇది. శుక్రవారం నమాజ్ సమయంలో షియా మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 169 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనకు కారణమైన ఉగ్రవాద సంస్థ ఓ సంచలన ప్రకటన విడుదల చేసింది. ఈ దాడికి తామే కారణమని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఇస్లామాబాద్ శివారులోని తర్లాయి ప్రాంతంలో ఉన్న ఇమామ్ బర్గాహ్ ఖస్ర్-ఎ-ఖదీజతుల్ కుబ్రా మసీదులో ఈ పేలుడు జరిగింది. శుక్రవారం కావడంతో మసీదు నిండా జనాలు కిక్కిరిసిపోయారు. ప్రార్థనలు మొదలవుతున్న సమయంలోనే దుండగుడు మసీదు గేటు దగ్గర ఆత్మాహుతి పేలుడుకు పాల్పడ్డాడు. భద్రతా సిబ్బంది అతడిని ఆపే ప్రయత్నం చేసిన తరుణంలో తన శరీరానికి కట్టుకున్న బాంబును పేల్చేశాడు.
READ MORE: NBK : బాలయ్య గ్రీన్ సిగ్నల్ కోసం.. బారులు తీరిన నలుగురు స్టార్ దర్శకులు..
Also Read
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
- OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
- Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్లను మెరిపించే సీక్రెట్స్..
- Team India-A: 452 పరుగులకు డిక్లేర్.. శతకాలతో తుక్కు రేపిన జురెల్, సాయి సుదర్శన్..
ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటన అనంతరం మసీదులోని జనాలు శబ్దంతో భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనపై 52 ఏళ్ల మహమ్మద్ కాజిమ్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. “నమాజ్ మొదటి భాగంలో వంగుతున్న సమయంలో తుపాకీ శబ్దం వినిపించింది. ఆ వెంటనే భయంకరమైన పేలుడు జరిగింది” అని చెప్పాడు. మరో వ్యక్తి ఇమ్రాన్ మహ్మూద్ మాట్లాడుతూ.. దుండగుడికి, అక్కడున్న భద్రతా సిబ్బందికి మధ్య కాల్పులు జరిగాయని వెల్లడించాడు. ఒక వాలంటీర్ అతడిని కాలిలో కాల్చిన తర్వాతే అతడు పేలుడు జరిపాడని అన్నాడు. పేలుడు తర్వాత పరిస్థితి అత్యంత విషాదంగా మారింది. ఆసుపత్రుల్లో రక్తంతో తడిసిన బట్టలతో గాయపడినవారిని స్ట్రెచర్లపై తీసుకొచ్చారు. కొందరిని చేతుల్లో, మరికొందరిని కార్లలో తీసుకొచ్చారు. ఒక బాధితుడిని కారు డిక్కీలో తీసుకొచ్చిన దృశ్యం అందరినీ కలిచివేసింది. ఆసుపత్రి బయట బంధువులు ఏడుస్తూ కేకలు వేస్తూ కనిపించారు.
ఈ ఘటన అనంతరం మసీదు చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. నేలపై రక్తపు మరకలు, చెప్పులు, విరిగిన అద్దాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. వాటిలో మసీదు గేటు దగ్గర శవాలు పడి ఉన్నట్లు కనిపించింది. అయితే వాటిని అధికారికంగా నిర్ధారించలేదు. ఈ దాడిపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా స్పందించారు. దాడి చేసినవారిని వదిలిపెట్టబోమని, తప్పక శిక్షిస్తామని చెప్పారు. ఉప ప్రధాని ఇషాక్ దార్ ఈ ఘటనను “మానవత్వంపై జరిగిన ఘోర నేరం”గా పేర్కొన్నారు. ఇలాంటి దాడులు ఇస్లాం సూత్రాలకు పూర్తిగా విరుద్ధమని అన్నారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సైతం పౌరులపై, ప్రార్థనా స్థలాలపై దాడులు అంగీకరించలేమని అన్నారు.
తాజావార్తలు
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
-
OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
-
Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్లను మెరిపించే సీక్రెట్స్..
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
-
Team India-A: 452 పరుగులకు డిక్లేర్.. శతకాలతో తుక్కు రేపిన జురెల్, సాయి సుదర్శన్..
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!