Jammu Kahmir Encounter: ఇద్దరు ఉగ్రవాదుల హతం.. జవాన్ని కాపాడుతూ ఆర్మీ డాగ్ మృతి
Jammu Kahmir Encounter: జమ్మూ కాశ్మీర్లో రాజౌరీ ప్రాంతంలో ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఈ ఎన్కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. మంగళవారం సాయంత్రం జరుగుతున్న ఈ ఎన్కౌంటర్ లో ఒక ఆర్మీ జవాన్ మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. ఆర్మీ డాగ్ యూనిట్ కి చెందిన కెంట్ అనే ఆరేళ్ల ఆడ లాబ్రడార్ కాల్పుల్లో మరణించింది.
Read Also: Apple IPhone 15: ఐఫోన్ 15 లాంచ్ అయిన వెంటనే ఆపిల్కు రూ.4 లక్షల కోట్ల నష్టం.. ఎలాగో తెలుసుకోండి
Also Read
- RGV: టీవీకే విజయ్ గెలుపుపై.. ఆర్జీవీ సంచలన కామెంట్స్..
- AirAsia Recruitment : విమానయాన రంగంలో కొత్త శకం.. చెన్నైస్ అమృతలో ఎయిర్ఏషియా భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్.!
- Mamata Banerjee: మమత రాజీనామా చేయకపోతే ఏం జరుగుతుంది? నెక్ట్స్ పరిణామం ఇదేనా?
- Viral: మమతా బెనర్జీ నన్ను రూ.5 కోట్లు అడిగింది.. ప్రముఖ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
రాజౌరీలోని నార్ల గ్రామంలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతుండగా.. ఉగ్రవాదులు, భద్రతాబలగాలకు మధ్య కాల్పులు జరిగినట్లు అడిషనల్ డీజీపీ ముఖేష్ సింగ్ తెలిపారు. జమ్మూ ప్రాంతంలో ఉండే పూంచ్, రాజౌరీ జిల్లాలు చాలా ఏళ్ల క్రితమే ఉగ్రవాదం నుంచి బయటపడ్డాయి. కాశ్మీర్ లో ఉగ్రవాద కార్యక్రమాలు జరగుతున్నప్పటికీ జమ్మూ ప్రాంతంలో ఈ కార్యకలాపాలు తక్కువగా ఉండేవి. అయితే ఇటీవలి కాలంలో జమ్మూలోని రియాసీ, పూంచ్, రాజౌరీ జిల్లాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. పీఓకే సరిహద్దు జిల్లాలైన పూంచ్, రాజౌరీ జిల్లాల్లో ఈ ఏడాది జరిగిన ఎన్కౌంటర్లలో 25 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టారు. ఇందులో 10 మంది భద్రతా సిబ్బంది మరణించారు.
తాజాగా రాజౌరీలో జరుగుతున్న ఎన్కౌంటర్ లో ఆర్మీ డాగ్ యూనిట్ కు చెందిన కెంట్ అనే డాగ్ మరణించడంపై పలువురు జవార్లు ఎమోషనల్ అయ్యారు. తన హ్యాండ్లర్ ప్రాణాలు రక్షించేందుకు కెంట్ తన ప్రాణాలను త్యాగం చేసింది. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో బుల్లెట్లు తగిలి మరణించింది. కెంట్ త్యాగానికి గుర్తుగా ఆర్మీ ఒక వీడియోను షేర్ చేసింది. కెంట్ గత 5 ఏళ్లలో 8 ఆపరేషన్లలో పాల్గొంది. దట్టమైన అటవీ మార్గంలో కెంట్ ఉగ్రవాదుల జాడను పసిగట్టింది.
Sad news coming in-
Brave Canine Warrior KENT of 21 Army Dog Unit laid down her life serving in ongoing OP SUJALIGALA at Rajouri, J&K earlier today – 12 September 2023.
The six year old female Labrador was leading a column of soldiers on the trail of fleeing terrorists. The… pic.twitter.com/L5j7MDZNiX
— LestWeForgetIndia🇮🇳 (@LestWeForgetIN) September 12, 2023
తాజావార్తలు
-
Harish Rao : యూరియా అమ్మకాలపై ఆంక్షలు దారుణం..
-
RGV: టీవీకే విజయ్ గెలుపుపై.. ఆర్జీవీ సంచలన కామెంట్స్..
-
Sun Risers Hyderabad: సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు శుభవార్త.. కాటేరమ్మ కొడుకు వచ్చేస్తున్నాడు..
-
AirAsia Recruitment : విమానయాన రంగంలో కొత్త శకం.. చెన్నైస్ అమృతలో ఎయిర్ఏషియా భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్.!
-
US: ఖతార్లో అమెరికా సైనిక విమానం అదృశ్యం.. రంగంలోకి సైన్యం!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!