Family Reunuion: పాక్లో అన్న, ఇండియాలో తమ్ముడు.. 75 ఏళ్ల తరువాత కుటుంబాల కలయిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sikh Brothers Separated During Partition, Reunite After 75 Years: 1947 భారత్ – పాకిస్తాన్ దేశవిభజన ఎన్నో చేదు గుర్తలను మిగిల్చింది. వేల సంఖ్యలో హిందూ, ముస్లిం, సిక్కులు ఊచకోతకు గురయ్యారు. చాలా కుటుంబాలను విభజన చిన్నాభిన్నం చేసింది. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని కొన్ని దశాబ్ధాల తర్వాత అన్నదమ్ములు, అన్నా చెల్లిళ్లు, వారి కుటుంబాలు కలుసుకుంటున్నాయి. అయితే తాజాగా ఇలాంటి ఘటనే మరోటి జరిగింది. దేశ విభజన సమయంలో విడిపోయిన ఇద్దరు అన్నదమ్ముల కుటుంబాలు 75 ఏళ్ల తరువాత పాకిస్తాన్ లోని కర్తార్ పూర్ కారిడార్ లో కలుసుకున్నారు. ఒకరిని ఒకరు చూసుకుంటూ భావోద్వేగంలో మునిగిపోయారు.
హర్యానాకు చెందిన సోదరులు గురుదేవ్ సింగ్, దయా సింగ్ హర్యానాలోని మహేంద్రనగర్ జిల్లాలోని గోమ్లా గ్రామంలో నివసించే వారు. వీరి తండ్రి చనిపోవడంతో అతని స్నేహితుడు కరీం బక్ష్ తో కలిసి నివసించే వారు. అయితే దేశవిభజన సమయంలో కరీం బక్ష్ గురదేవ్ సింగ్ తో కలిసి పాకిస్తాన్ వలస వెళ్లారు. అతని తమ్ముడు దయాసింగ్ తన మామతో కలిసి హర్యానాలోనే ఉన్నాడు. పాకిస్తాన్ లోని లాహోర్ కు 200 కిలోమీటర్ల దూరంలో పంజాబ్ ప్రావిన్స్ లోని ఝాంగ్ జిల్లాకు వెళ్లారు. అక్కడ గురుదేవ్ సింగ్ పేరును గులామ్ మహ్మద్ గా మార్చాడు. కొన్నేళ్ల క్రితం గురుదేవ్ సింగ్ మరణించాడు.
Also Read
- Manipur: మణిపూర్లో ఉగ్రవాదుల ఘాతుకం.. ఇద్దరు జవాన్లు మృతి..
- PoK Protest: ప్లీజ్ మాకు సాయం చేయండి.. భారత్ను వేడుకుంటున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్..
- Gold Ring: తవ్వకాలు జరుపుతుండగా బయటపడిన బంగారపు ఉంగరం.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
- Taj Mahal: తాజ్మహల్పై అలహాబాద్ హైకోర్టు కీలక విచారణ.. కేంద్రానికి నోటీసులు
Read Also: Child Abuse : రైలు మిస్సై స్టేషన్లో నిద్రపోయిన తల్లీబిడ్డ.. లేచి చూసేసరికి ఘోరం
గురుదేవ్ సింగ్ కొడుకు మహ్మద్ షరీఫ్ మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి ఆయన తమ్ముడు దయాసింగ్ ఆచూకీ కోసం కొన్నేళ్లుగా భారత ప్రభుత్వానికి ఉత్తరాలు రాశారని చెప్పారు. ఆరు నెలల క్రితం సోషల్ మీడియా ద్వారా దయాసింగ్ ను కొనుక్కున్నామని చెప్పాడు. రెండు కుటుంబాలు కూడా కర్తార్ పూర్ సాహిబ్ లో కలుసుకోవానలి నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. హర్యానాలోని తమ పూర్వీకుల ఇంటిని సందర్శించేందుకు వీలుగా భారత ప్రభుత్వం వీసాలు ఇవ్వాలని కోరారు.
గతేడాది కూడా ఇలాగే విభజన సమయంలో విడిపోయిన సోదరులు పాక్ కు చెందిన మహ్మద్ సిద్ధిక్(80), భారతదేశానికి చెందిన హబీబ్ (78) 2022 జనవరిలో కర్తార్ పూర్ కారిడార్ లోనే కలుసుకున్నారు. కర్తార్ పూర్ సాహిబ్ సిక్కులకు పవిత్ర స్థలం. పాకిస్తాన్ లో ఉన్న కర్తార్ పూర్ లో సిక్కుమత వ్యవస్థాపకుడు గురునానక్ దేవ్ చివరి రోజులు గడిపారు. కర్తార్ పూర్ కారిడార్ భారత్ లోని గురుదాస్ పూర్ జిల్లాలోని డేరా బాబా నానక్ మందిరంతో కలుపుతుంది. నాలుగు కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ కారిడార్ ను సందర్శించేందుకు భారతీయ సిక్కులకు వీసా రహిత అనుమతి ఉంది.
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!