Child Abuse : రైలు మిస్సై స్టేషన్లో నిద్రపోయిన తల్లీబిడ్డ.. లేచి చూసేసరికి ఘోరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Child Abuse : ఓ తల్లి తన మూడేళ్ల చిన్నారితో రైల్లే స్టేషన్ కు వచ్చింది. కాస్త లేట్ కావడంతో రైలు మిస్సయ్యింది. చేసేదేంలేక స్టేషన్లోనే తన చిన్నారితో నిద్రపోయింది. తెలవారడంతో నిద్రిస్తున్న చిన్నారిని కదపకుండా టాయిలెట్ కు వెళ్లింది. తిరిగి వచ్చి చూసే సరికి కూతురు కనిపించలేదు. ఆ తర్వాత ఆ మహిళ చాలా ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ తెలియలేదు. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.. వారు చుట్టుపక్కల గాలించగా స్టేషన్ వెలుపల ఓ సిమెంట్ బెంచీపై చిన్నారి కనిపించింది. దగ్గరకెళ్లి చూసిన ఆ తల్లికి ఒక్కసారిగా కళ్లు బైర్లు కమ్మాయి.
Read Also: Greece Train Crash: గ్రీస్ ట్రైన్ క్రాష్లో షాకింగ్ ట్విస్ట్.. డ్రైవర్ అలా చేయాల్సింది కాదు!
Also Read
- Green Chillies Storage Tips: ఈ సింపుల్ ట్రిక్ చాలు.. పచ్చిమిరపకాయలు వారాల తరబడి ఫ్రెష్గా ఉంటాయి
- IND vs ENG: మ్యాచ్ రద్దు.. భారత్ బ్యాటింగ్లో కనిపించిన కీలక లోపాలు
- Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏఐఏడీఎంకేకు షాక్.. విజయ్ పార్టీకి భారీ బూస్ట్..
- Nara Lokesh: ఇప్పుడు 'మావిగన్'.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్తాహై’ అంటారేమో..!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పన్వేల్ రైల్వే స్టేషన్లోని ఒకటో నంబర్ ప్లాట్ఫారమ్ పక్కన ఓ మహిళ తన మూడేళ్ల కుమార్తెతో నిద్రిస్తోంది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మహిళ టాయిలెట్కు వెళ్లింది. చిన్నారి తల్లి వెళ్లడాన్ని చూసిన ఓ వ్యక్తి మూడేళ్ల బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. తిరిగి వచ్చేసరికి కూతురు కనిపించలేదు. బాలిక కోసం వెతుకులాట ప్రారంభించగా.. రైల్వే స్టేషన్లోని పడమటి వైపున ఉన్న సిమెంట్ బెంచీపై బాలిక అపస్మారక స్థితిలో కనిపించింది. బాలికను ఆమె తల్లి ఆసుపత్రిలో చేర్చింది. ఈ కేసులో జిఆర్పి పోక్సో కింద కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు ప్రారంభించారు.
Read Also:Anand Mahindra – Thar: ఈ వీడియో చూస్తే ఇక ట్రాక్టర్లు కొనరేమో?
సీసీటీవీని పరిశీలించిన తర్వాత, నిందితుడు, చెత్త సేకరించే యువకుడు, తల్లి వద్ద బాలిక లేకపోవడంతో, బాలికను స్టేషన్లోని అవతలి వైపుకు తీసుకెళ్లినట్లు తేలింది. అంతేకాదు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని వెలుగులోకి వచ్చింది. నిందితుడి కోసం పన్వెల్ లోహ్ మార్గ్ పోలీసులు అన్ని చోట్లా వెతికారు. సీసీటీవీ సాయంతో విచారణ జరిపిన పోలీసులు నిందితుడిని జుయినగర్ ప్రాంతంలో పట్టుకున్నారు. నిందితుడికి 30 ఏళ్లు ఉంటాయి. చెత్త ఏరుకుంటూ జీవిస్తున్నాడు. అతను సియోన్-పన్వేల్ హైవేపై కలంబోలి వంతెన కింద ఉంటున్నట్లు విచారణలో వెల్లడైంది. పోలీసులు అతడిని అరెస్టు చేసి బాలలపై వేధింపుల నిరోధక చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Hardik Pandya-CSK: సీఎస్కేలోకి హార్దిక్ పాండ్యా.. క్లారిటీ ఇచ్చిన చెన్నై సీఈఓ!
-
Best Crime Thriller Movies: కేతన్ అగర్వాల్ కేసును గుర్తు చేసే థ్రిల్లర్లు.. ఈ సినిమాల ట్విస్టులు చూస్తే షాక్ అవుతారు!
-
Jananayagan Censor : జననాయగన్ కు సెన్సార్ షాక్
-
Daycare Abuse: మీకు మనసెలా వచ్చిందమ్మా.. టాయిలెట్ జెట్తో నీళ్లు చల్లి, వాషింగ్ మెషీన్లో బంధించి చిన్నారిపై చిత్రహింసలు
-
Microsoft Layoffs: ఐటీ ఉద్యోగులకు మళ్లీ బ్యాడ్ న్యూస్.. మైక్రోసాఫ్ట్లో 5,000 మంది అవుట్! ఎవరెవరి ఉద్యోగాలు ఊడనున్నాయంటే?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?