Child Abuse : రైలు మిస్సై స్టేషన్లో నిద్రపోయిన తల్లీబిడ్డ.. లేచి చూసేసరికి ఘోరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Child Abuse : ఓ తల్లి తన మూడేళ్ల చిన్నారితో రైల్లే స్టేషన్ కు వచ్చింది. కాస్త లేట్ కావడంతో రైలు మిస్సయ్యింది. చేసేదేంలేక స్టేషన్లోనే తన చిన్నారితో నిద్రపోయింది. తెలవారడంతో నిద్రిస్తున్న చిన్నారిని కదపకుండా టాయిలెట్ కు వెళ్లింది. తిరిగి వచ్చి చూసే సరికి కూతురు కనిపించలేదు. ఆ తర్వాత ఆ మహిళ చాలా ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ తెలియలేదు. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.. వారు చుట్టుపక్కల గాలించగా స్టేషన్ వెలుపల ఓ సిమెంట్ బెంచీపై చిన్నారి కనిపించింది. దగ్గరకెళ్లి చూసిన ఆ తల్లికి ఒక్కసారిగా కళ్లు బైర్లు కమ్మాయి.
Read Also: Greece Train Crash: గ్రీస్ ట్రైన్ క్రాష్లో షాకింగ్ ట్విస్ట్.. డ్రైవర్ అలా చేయాల్సింది కాదు!
Also Read
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
- Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
- CJP Protest: సీజేపీ ఉద్యమానికి ఖలిస్తాన్ ఉగ్రవాది మద్దతు..? వైరల్ అవుతున్న వీడియో..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పన్వేల్ రైల్వే స్టేషన్లోని ఒకటో నంబర్ ప్లాట్ఫారమ్ పక్కన ఓ మహిళ తన మూడేళ్ల కుమార్తెతో నిద్రిస్తోంది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మహిళ టాయిలెట్కు వెళ్లింది. చిన్నారి తల్లి వెళ్లడాన్ని చూసిన ఓ వ్యక్తి మూడేళ్ల బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. తిరిగి వచ్చేసరికి కూతురు కనిపించలేదు. బాలిక కోసం వెతుకులాట ప్రారంభించగా.. రైల్వే స్టేషన్లోని పడమటి వైపున ఉన్న సిమెంట్ బెంచీపై బాలిక అపస్మారక స్థితిలో కనిపించింది. బాలికను ఆమె తల్లి ఆసుపత్రిలో చేర్చింది. ఈ కేసులో జిఆర్పి పోక్సో కింద కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు ప్రారంభించారు.
Read Also:Anand Mahindra – Thar: ఈ వీడియో చూస్తే ఇక ట్రాక్టర్లు కొనరేమో?
సీసీటీవీని పరిశీలించిన తర్వాత, నిందితుడు, చెత్త సేకరించే యువకుడు, తల్లి వద్ద బాలిక లేకపోవడంతో, బాలికను స్టేషన్లోని అవతలి వైపుకు తీసుకెళ్లినట్లు తేలింది. అంతేకాదు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని వెలుగులోకి వచ్చింది. నిందితుడి కోసం పన్వెల్ లోహ్ మార్గ్ పోలీసులు అన్ని చోట్లా వెతికారు. సీసీటీవీ సాయంతో విచారణ జరిపిన పోలీసులు నిందితుడిని జుయినగర్ ప్రాంతంలో పట్టుకున్నారు. నిందితుడికి 30 ఏళ్లు ఉంటాయి. చెత్త ఏరుకుంటూ జీవిస్తున్నాడు. అతను సియోన్-పన్వేల్ హైవేపై కలంబోలి వంతెన కింద ఉంటున్నట్లు విచారణలో వెల్లడైంది. పోలీసులు అతడిని అరెస్టు చేసి బాలలపై వేధింపుల నిరోధక చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
CM Chandrababu : భూములకు బ్లాక్చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
-
Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
-
The India Story : కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
-
KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
-
CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?