Sambhal Violence: సంభాల్ మసీదు సర్వేలో హింస.. ముగ్గురు మృతి, 30 మంది పోలీసులకు గాయాలు..
- హింసాత్మకంగా మారిన సంభాల్ మసీదు సర్వే..
- అధికారులు, పోలీసులపై రాళ్ల దాడి..
- హింసలో ఇద్దరు మృతి, వాహనాలకు నిప్పు..
- బాబార్ సమయంలో ఆలయంపై మసీదు నిర్మించారని కోర్టులో కేసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sambhal Violence: ఉత్తర్ ప్రదేశ్లోని సంభాల్లో ఈ రోజు తీవ్ర హింస చెలరేగింది. మొఘల్ కాలం నాటి జామా మసీదుపై కోర్టు సర్వేకి ఆదేశించింది. ఈ సర్వే కోసం వచ్చిన అధికారులపై స్థానికులు రాళ్లలో దాడికి పాల్పడ్డారు. పోలీసులకు, అధికారులకు గాయాలయ్యాయి. ఈ ఘర్షణలు హింసాత్మకంగా మారి ముగ్గురి వ్యక్తుల మరణానికి దారి తీసింది. మసీదు హిందూ దేవాలయం ఉన్న స్థలంలో నిర్మించబడిందనే వాదనలపై కోర్టు సర్వేకి ఆదేశాలు ఇచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం.. అడ్వకేట్ కమీషనర్ నేతృత్వంలోని సర్వే టీం తన పని ప్రారంభించే సమయంలో మసీదు సమీపంలోని జనం గమిగూడటంతో హింస మొదలైంది. మసీదులోకి అధికారులు ప్రవేశించకుండా పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దాదాపుగా 1000 మంది, సంఘటన స్థలంలో పోలీసులు, ఇతర అధికారులపై రాళ్లు రువ్వారు. పదికి పైగా వాహనాలకు నిప్పుపెట్టారు. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ హింసాత్మక ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. 30 మంది పోలీసులకు గాయాలయ్యాయి.
Also Read
- Karnataka Tragedy: కర్ణాటకలో ఘోర విషాదం.. ముత్యపుచిప్పల కోసం మృత్యు ఒడిలోకి! నదిలో మునిగి ఎనిమిది మంది మృతి..
- Viral: ఫుడ్ పాయిజనింగ్కు రూ. 65 వేల బిల్లు.. నెట్టింట వైరల్గా మారిన ఆ హాస్పిటల్ దోపిడీ..
- Falta Re-polling Result: అభిషేక్ బెనర్జీ అడ్డాలోనే టీఎంసీ ఖల్లాస్.. ఫల్తా రీపోలింగ్లో బీజేపీ క్లీన్ స్వీప్!
- Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ ప్రాంతాలకు వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్..
Read Also: Sanjay Raut: మా ఓటమికి మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ కారణం.. సంజయ్ రౌత్ సంచలన ఆరోపణ..
సోమవారం ఉదయం 7.30 గంటలకు ప్రారంభమైన సర్వే, మంగళవారం కూడా కొనసాగుతుండటంతో సంభాల్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. 1529లో మొఘల్ చక్రవర్తి బాబర్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు ‘‘బాబర్నామా’’,‘‘ఐన్-ఏ-అక్బరీ’’ వంటి చారిత్రక గ్రంథాలలో ఉన్నట్లు పిటిషనర్లు వాదించారు. సర్వేలో చారిత్రక నిజాలను వెలికితీసేందుకు సర్వేని కోర్టు ఆదేశించింది. అయితే, మరో వర్గం మాత్రం 1991 ప్రార్థనా స్థలాల చట్టం ప్రకరాం.. సర్వే మత పవిత్రతను ఉల్లంఘించేలా ఉందని ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం రాళ్లదాడి, హింసాత్మక ఘటనలకు సంబంధించి 10 మంది వ్యక్తులను అధికారులు అదుపలోకి తీసుకున్నారు. ఉత్కంఠ నెలకొన్నా అధికారులు అనుకున్న ప్రకారం సర్వే పూర్తి చేశారు. న్యాయవాది విష్ణు శంకర్ జైన్ మాట్లాడుతూ, కోర్టు ఆదేశాల మేరకు వీడియోగ్రఫీ మరియు ఫోటోగ్రఫీ ద్వారా సర్వే బృందం సైట్ యొక్క వివరణాత్మక పరిశీలనను నిర్వహించింది. నవంబర్ 29లోగా సర్వే నివేదిక అందచేయాల్సి ఉంది. అయితే, ఈ ఘటన ఇప్పుడు యూపీలో రాజకీయ దుమారాన్ని రేపుతోంది. బీజేపీ ఎన్నికల్లో అవకతవల నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ హింసను ప్రేరేపించిందని సమాజ్వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. సమాజ్ వాదీ పార్టీ తన గుండాలతో దాడులకు పాల్పడుతోందని బీజేపీ ఆరోపించింది.
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!