Madhya Pradesh: రైలులో మహిళను వేధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. కేసు నమోదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2 Congress MLAs booked for harassing woman: బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ప్రజాప్రతినిధులే వేధింపులకు పాల్పడ్డారు. మహిళ అని కనీస గౌరవం లేకుండా ప్రవర్తించారు. రైలులో ప్రయాణిస్తున్న మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. మద్యంమత్తులో రైలులో హడావుడి చేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓ మహిళ పట్ల అసభ్యంగా నడుచుకున్నారు. రైలుతో చంటిబిడ్డతో ప్రయాణిస్తున్న మహిళను వేధించారు.
Read Also: Uttarakhand Avalanche: హిమపాతం ప్రమాదంలో 26కు చేరిన మృతుల సంఖ్య..
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
ఈ ఆరోపణలపై ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను సత్నా ఎమ్మెల్యే సిద్ధార్థ్ కుష్వాహా, కోత్మా ఎమ్మెల్యే సునీల్ సరాఫ్ గా గుర్తించారు. వీరిద్దరిపై ఐపీసీ సెక్షన్ 354( మహిళ గౌరవాన్ని కించపరచడం, ఉద్దేశపూర్వకంగా దాడి, బలప్రయోగం) కింద కేసు నమోదు చేశారు. సాగర్ స్టేషన్ పరిధిలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కేసు నమోదు అయింది.
ఇద్దరు ఎమ్మెల్యేలు గురువారం రేవాంచల్ ఎక్స్ప్రెస్లోని ఏసీ కోచ్లో ప్రయాణిస్తున్నారు. మద్యం మత్తులో కట్నీ స్టేషన్ లో వీరు రైలులోకి ఎక్కారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమయంలో రైలులో ప్రయాణిస్తున్న మహిళపై వేధింపులకు పాల్పడ్డారు. తన భర్తకు ఫోన్ చేసి సదరు మహిళ అప్రమత్తం చేసింది. దీంతో భర్త రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే పోలీసులకు వేధింపుల గురించి ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ఇద్దరు ఎమ్మెల్యేపై రైల్వే పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. వీరిద్దరిపై ప్రస్తుతం ఎఫ్ఐఆర్ నమోదు అయింది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!