Chhattisgarh: ఛత్తీస్గఢ్లో భద్రతా దళాల వేట.. 19 మంది మావోల అరెస్ట్
- ఛత్తీస్గఢ్లో భద్రతా దళాల వేట
- 19 మంది మావోల అరెస్ట్
అక్టోబర్ ప్రారంభంలో ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగలింది. భద్రతా దళాల కాల్పుల్లో దాదాపు 35 మందికి పైగా మావోయిస్టులు హతమయ్యారు. తాజాగా మరోసారి సుక్మా జిల్లాలో భద్రతా దళాలు వేర్వేరు ఆపరేషన్లు నిర్వహించారు. అడవిలో జల్లెడ పట్టగా 19 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. జాగర్గుండ పోలీస్స్టేషన్ పరిధిలో 14 మంది నక్సలైట్లు పట్టుబడగా.. భెజ్జీ పోలీస్స్టేషన్ పరిధిలో ఐదుగురు ఆదివారం పట్టుబడ్డారని అధికారి తెలిపారు. మొత్తం 19 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Tejas MK1A: తేజస్ ఇంజిన్ డెలివరీ ఆలస్యం.. అమెరికన్ కంపెనీకి భారత్ భారీ జరిమానా..
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
ఈ నక్సలైట్లపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఒక్కొక్కరికి లక్ష రూపాయల రివార్డు ప్రకటించింది. పలువురు నక్సలైట్లపై అరెస్ట్ వారెంట్లు కూడా జారీ అయ్యాయి. సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ మాట్లాడుతూ.. జిల్లాలో నక్సల్స్ నిర్మూలన కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్నామన్నారు. భేజ్జీ పోలీస్ స్టేషన్ పరిధిలోని భండార్పదర్, గొంపాదర్ అడవుల్లో నక్సలైట్లు గుమిగూడి అవాంఛనీయ ఘటనకు పాల్పడ్డారని ఇన్ఫార్మర్ నుంచి సమాచారం అందింది. సమాచారం ఆధారంగా భేజ్జీ పోలీస్ స్టేషన్ సిబ్బంది, సీఆర్పీఎఫ్ సంయుక్త బృందం అక్టోబర్ 27న భండార్పదర్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ సైనికులు చుట్టుముట్టి 5 మంది నక్సలైట్లను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నక్సలైట్లకు అరెస్ట్ వారెంట్ జారీ అయింది.
ఇది కూడా చదవండి: Minister Anagani: ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తోంది..
జాగర్గుండ పోలీస్స్టేషన్ పరిధిలోని తుమల్పాడ్ ప్రాంతంలో సోదాలు చేసేందుకు డీఆర్జీ, కోబ్రా, సీఆర్పీఎఫ్ల సంయుక్త బృందం వెళ్లింది. పోలీసుల పార్టీని చూసిన కొందరు అనుమానితులు తుమ్మలపాడు అడవుల్లో తలదాచుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు చుట్టుముట్టి 14 మందిని పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి మెటీరియల్, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. నక్సలైట్లందరూ 8-10 సంవత్సరాలుగా మావో సంస్థలో చురుకుగా ఉంటున్నారని ఎస్పీ తెలిపారు.
నక్సలైట్లు ఐఈడీ పేలుడు, దహనం, దోపిడీలు, రోడ్లు తవ్వడం, బ్యానర్లు, పోస్టర్లు వేయడం వంటి నేరాలకు పాల్పడ్డారు. అరెస్టయిన నక్సలైట్ల నుంచి 300 గ్రాముల గన్ పౌడర్, 3 ముక్కలు టైగర్ క్రాకర్ బాంబు, 2 అగ్గిపెట్టెలు, 3 జిలెటిన్ రాడ్లు, 2.50 మీటర్ల కోడెక్స్ వైర్, 6 పెన్సిల్ సెల్స్, 3 డిటోనేటర్లు, 4 మీటర్ల ఎలక్ట్రిక్ వైరును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జాగరగుండ పోలీస్ స్టేషన్లో అరెస్టయిన 14 మంది నక్సలైట్లలో బర్సే హద్మా, బర్సే హింగా, హేమ్లా మంగడు, బర్సే నగేష్, బర్సే జోగా, మడ్కం రాకేష్, హేమ్లా జీతు, బర్సే మంగ్డు, బర్సే హింగా, మద్వి హద్మా, మద్కం ఐతు, మద్కం హింగ, మద్వి నంద ఉన్నారు. భెజ్జి పోలీస్ స్టేషన్ నుండి అరెస్టయిన ఐదుగురు నక్సలైట్లు వంజమ్ ఆయత, పొడియం కోస, సోడి ఆయత, సోడి హద్మా, పొడియం పొజ్జా ఉన్నారు.
ఇది కూడా చదవండి: Bangladesh: షేక్ హసీనా లగ్జరీ ప్యాలెస్.. ఇప్పుడు ‘‘విప్లవ మ్యూజియం’’..
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!