Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News 15 Years After Breaking Ties Naveen Patnaiks Bjd Hints At Nda Return

NDA: బీజేపీ కూటమిలోకి నవీన్ పట్నాయక్.. 15 ఏళ్ల తర్వాత బీజేడీ హింట్..

Published Date :March 7, 2024 , 3:45 pm
By Venu Goapl Reddy
NDA: బీజేపీ కూటమిలోకి నవీన్ పట్నాయక్.. 15 ఏళ్ల తర్వాత బీజేడీ హింట్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

NDA: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కి చెందిన బిజూ జనతాదళ్(బీజేడీ), బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈమేరకు చోటు చేసుకుంటున్న పరిణామాలు అందరిలోనూ ఇదే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. 15 ఏళ్ల తర్వాత బీజేడీ ఎన్డీయే కూటమిలో చేరేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసిపోటీ చేస్తాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, అధికారికంగా పొత్తుపై ఎలాంటి ప్రకటన రానప్పటికీ, రెండు పార్టీల నేతలు మాత్రం పొత్తుపై సంకేతాలు ఇస్తున్నారు. సీట్ల పంపకంలో చర్చలు విఫలమైన తర్వాత 11 ఏళ్ల రాజకీయ భాగస్వామ్యం తర్వాత 2009లో బీజేడీ ఎన్డీయే నుంచి వైదొలిగింది.

ఒడిశాలో మొత్తం 21 లోక్‌సభ స్థానాలు, 147 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 13 స్థానాల్లో బీజేడీ, 8 స్థానాలు బీజేపీకి ఇచ్చే అవకాశం ఉందని బీజేడీ వర్గాలు తెలిపాయి. అయితే, బీజేపీ 9 లోక్‌సభ స్థానాలు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 55 సీట్లను కోరుకుంటోంది. ప్రస్తుతం బీజేపీకి 8 మంది ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

Also Read

  • West Bengal polls: బీజేపీ గుర్తుపై టేపులు.. రీపోలింగ్‌కు ఆదేశం..
  • PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
  • Rs 397 Crore Transformer Scam: ​ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
  • JMI VC Mazhar Asif: "భారతీయులందరిది మహాదేవుడి డిఎన్‌ఏ!".. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

బుధవారం నవీన్ పట్నాయక్, పార్టీ కీలక నేతలతో తన నివాసంలో 3 గంటల పాటు సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. మరోవైపు ఒడిశా బీజేపీ నాయకులు కూడా అమిత్ షా, జేపీ నడ్డాలతో సమాంతర సమావేశాలను నిర్వహించారు. సమావేశంలో వారు బీజేడీతో పొత్తు గురించి చర్చించినట్లు సమాచారం. బీజేడీ సమావేశం తర్వాత ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ఎమ్మెల్యే దేబి ప్రసాద్ మిశ్రా మాట్లాడుతూ.. బీజేపీతో పొత్తు గురించి చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఒడిశా ప్రజల ప్రయోజనాలకు బీజేడీ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఇదే విషయాన్ని బీజేడీ సీనియర్, ప్రధానకార్యదర్శి అరుణ్ కుమార్ సాహూ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు. పొత్తుపై కేంద్ర నాయకత్వం చర్యలు తీసుకుంటుందని బీజేపీ ఎంపీ జుయల్ ఓరమ్ తెలిపారు.

2019 ఎన్నికల్లో బీజేపీ 8 మంది ఎంపీలను గెలుచుకోగా.. 23 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. బీజేడీకి 12 ఎంపీ, 112 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. 1998లో బీజేడీ, బీజేపీతో పొత్తు పెట్టుకుంది, కంధమాల్ అల్లర్ల తర్వాత ఇరు పార్టీలు 2009లో విడిపోయాయి.

కంధమాల్ అల్లర్లలో పొత్తుకు బీటలు:

ఆగస్ట్ 25, 28, 2008 మధ్య జరిగిన పెద్ద ఎత్తున హింసలో దాదాపు 40 మంది క్రైస్తవులు మరణించారు. 395 చర్చిలు ధ్వంసం చేయబడ్డాయి మరియు 600 గ్రామాలు దోచుకున్నాయి. అదనంగా, 5,600 కంటే ఎక్కువ ఇళ్లు లూటీ చేయబడ్డాయి మరియు 54,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) నాయకుడు స్వామి లక్ష్మణానంద సరస్వతి, అతని నలుగురు అనుచరులను ముసుగులో వచ్చిన దుండగులు హత్య చేయడంతో అల్లర్లు ప్రారంభమయ్యాయి. వీరి హత్యకు మావోయిస్టులు కారణమని పోలీసులు ఆరోపించినప్పటికీ.. కంధమాల్ జిల్లాలోని స్థానికులు మాత్రం ఈ హత్యల వెనకాల క్రిస్టియన్ ఆదివాసీల హస్తం ఉందని భావించారు, దీంతో అల్లర్లు ప్రారంభయ్యాయి.

సరస్వతి అనేక పాఠశాలలు, ఆశ్రమాలను స్థాపించారు. వీహెచ్‌పీ, సంఘ్ పరివార్ సంస్థలు క్రైస్తవం నుంచి తిరిగి హిందూ మతంలోకి రావడానికి చర్యలు తీసుకున్నాయి. ఇదిలా ఉంటే అల్లర్లకు ముందు డిసెంబర్ 2007న క్రిస్మస్ సందర్భంగా సంఘ్ పరివార్, క్రైస్తవులకు మధ్య ఘర్షణ జరిగింది. వందలాది ఇళ్లు తగలబడ్దాయి, దీనికి ప్రతిగా క్రైస్తవ మూకలు, హిందువుల ఇళ్లను తగలబెట్టారు.

అల్లర్లు జరిగిన ఒక ఏడాది తర్వాత 2009లో నవీన్ పట్నాయక్ బీజేపీ వాటాను 9 ఎంపీ స్థానాల నుంచి 6కి, అసెంబ్లీలో 63 నుంచి 40కి తగ్గించాలని ప్రతిపాదించాడు. దీంతో కంధమాల్ అల్లర్లకు కారణంగా బీజేడీ, బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయించుకుంది. కంధమాల్ అల్లర్లలో దోషిగా 2010లో బీజేపీ ఎమ్మెల్యే మనోష్ ప్రధాన్‌తో సహా 18 మంది దోషులుగా తేలారు. ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించబడింది.

అయితే, ఎన్డీయే నుంచి వైదొలిగినప్పటికీ నవీన్ పట్నాయక్ బీజేపీతో, ప్రధాని మోడీతో సఖ్యతతోనే ఉంటున్నారు. 2012, 2017, 2022లో జరిగి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు. ఇటీవల జరిగిన ఒడిశా పర్యటనలో ప్రధాని మోడీ నవీన్ పట్నాయక్ తండ్రి బిజు పట్నాయక్‌కి నివాళులు అర్పించారు. రాష్ట్ర అభివృ‌ద్ధికి బిజూ బాబా సేవలు సాటిలేనివని ప్రధాని కొనియాడారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BJD
  • bjp
  • Kandhamal riots
  • Lok Sabha elections-2024
  • Naveen Patnaik

తాజావార్తలు

  • Elon Musk vs OpenAI Lawsuit: ప్రపంచ కుబేరుల మధ్య AI యుద్ధం.. ఎలోన్ మస్క్ వర్సెస్ సామ్ ఆల్ట్‌మాన్.. అసలేం జరుగుతోంది?

  • West Bengal polls: బీజేపీ గుర్తుపై టేపులు.. రీపోలింగ్‌కు ఆదేశం..

  • MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!

  • AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..

  • PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions