Kerala: బీజేపీ నేత హత్యలో దోషులుగా 15 మంది నిషేధిత పీఎఫ్ఐ సభ్యులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala: కేరళలో బీజేపీ నేతను హత్య చేసిన కేసులో కోర్టు 15 మందిని దోషులుగా నిర్థారించింది. వీరంతా నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) సభ్యులుగా ఉన్నారు. డిసెంబర్ 2021లో కేరళ అలప్పుజ జిల్లాలో బీజేపీ ఓబీసీ విభాగం నేతను హత్య చేశారు. హత్యలో పీఎఫ్ఐ సభ్యుల ప్రమేయం ఉంది.
Read Also: Snoring: గట్టిగా “గురక” పెడుతున్నాడని వ్యక్తి హత్య..
Also Read
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
- Nepal Floods: నేపాల్ వరదలు.. కొట్టుకొచ్చిన బంగారం, వెండి, డబ్బులు..
- Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
బిజెపి ఒబిసి మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాసన్, డిసెంబర్ 19, 2021న అతని ఇంటిలోనే దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో మావెలిక్కర అదనపు జిల్లా న్యాయమూర్తి వీజీ శ్రీదేవి 15 మందిని దోషులుగా గుర్తించారు. సోమవారం వీరందరికి శిక్షను విధించనున్నారు. 15 మందిలో 8 మందికి ఈ కేసులో ప్రత్యక్ష ప్రమేయం ఉందని కోర్టు గుర్తించింది. నేరంలో పాల్గొన్న వారితో పాటు మారణాయుధాలతో సంఘటన స్థలానికి వచ్చినందుకు నలుగురు వ్యక్తులు కూడా హత్యలో పాల్గొన్నారని కోర్టు నిర్దారించింది. మరో ముగ్గురు వ్యక్తులు ఈ హత్యకు కుట్ర పన్నినట్లు కోర్టు తేల్చింది. మొత్తంగా ఈ కేసులో 15 మందిని దోషులుగా గుర్తించింది.
తల్లి, భార్య ముందు అమాయకుడిని అత్యంత క్రూరంగా చంపడం అత్యంత అరుదైన నేరాల కిందకి వస్తుందని ప్రాసిక్యూటర్ కోర్టులో వాదించారు. వీరికి గరిష్ట శిక్ష విధించాలని కోరారు. బీజేపీ కోర్టు నిర్ణయాన్ని స్వాగతించింది. ఈ తీర్పుపై శ్రీనివాస్ కుటుంబ సభ్యులు స్పందిస్తూ.. దోషులకు గరిష్టంగా శిక్ష పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
-
CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
-
Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
-
Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు బిగ్ గుడ్ న్యూస్.. చంద్రబాబు కీలక ఆదేశాలు
-
AP Govt: 18 ఏళ్లు నిండిన వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త.. రూ.2 లక్షల చొప్పున సాయం..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!