Kerala: బీజేపీ నేత హత్యలో దోషులుగా 15 మంది నిషేధిత పీఎఫ్ఐ సభ్యులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala: కేరళలో బీజేపీ నేతను హత్య చేసిన కేసులో కోర్టు 15 మందిని దోషులుగా నిర్థారించింది. వీరంతా నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) సభ్యులుగా ఉన్నారు. డిసెంబర్ 2021లో కేరళ అలప్పుజ జిల్లాలో బీజేపీ ఓబీసీ విభాగం నేతను హత్య చేశారు. హత్యలో పీఎఫ్ఐ సభ్యుల ప్రమేయం ఉంది.
Read Also: Snoring: గట్టిగా “గురక” పెడుతున్నాడని వ్యక్తి హత్య..
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
బిజెపి ఒబిసి మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాసన్, డిసెంబర్ 19, 2021న అతని ఇంటిలోనే దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో మావెలిక్కర అదనపు జిల్లా న్యాయమూర్తి వీజీ శ్రీదేవి 15 మందిని దోషులుగా గుర్తించారు. సోమవారం వీరందరికి శిక్షను విధించనున్నారు. 15 మందిలో 8 మందికి ఈ కేసులో ప్రత్యక్ష ప్రమేయం ఉందని కోర్టు గుర్తించింది. నేరంలో పాల్గొన్న వారితో పాటు మారణాయుధాలతో సంఘటన స్థలానికి వచ్చినందుకు నలుగురు వ్యక్తులు కూడా హత్యలో పాల్గొన్నారని కోర్టు నిర్దారించింది. మరో ముగ్గురు వ్యక్తులు ఈ హత్యకు కుట్ర పన్నినట్లు కోర్టు తేల్చింది. మొత్తంగా ఈ కేసులో 15 మందిని దోషులుగా గుర్తించింది.
తల్లి, భార్య ముందు అమాయకుడిని అత్యంత క్రూరంగా చంపడం అత్యంత అరుదైన నేరాల కిందకి వస్తుందని ప్రాసిక్యూటర్ కోర్టులో వాదించారు. వీరికి గరిష్ట శిక్ష విధించాలని కోరారు. బీజేపీ కోర్టు నిర్ణయాన్ని స్వాగతించింది. ఈ తీర్పుపై శ్రీనివాస్ కుటుంబ సభ్యులు స్పందిస్తూ.. దోషులకు గరిష్టంగా శిక్ష పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
US Navy Deployment Cuba: క్యూబాపై ట్రంప్ దృష్టి.. కరేబియన్కు చేరుకున్న అమెరికా యుద్ధనౌక
-
Hardik Pandya: “సాకులు చెప్పను.. మేం తప్పు చేశాం”.. ముంబై వైఫల్యాలపై హార్దిక్ ఓపెన్ టాక్!
-
Astrology: మే 21 గురువారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజ చేస్తే మేలు..
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!