Brain eating amoeba: అద్భుతం.. “మెదుడుని తినే అమిబా”ని జయించిన 14 ఏళ్ల బాలుడు
- అద్భుతం.. మెదడుని తినే అమీబాని జయించిన బాలుడు..
- అత్యంత అరుదైన కేసుగా వ్యాఖ్యానించిన మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brain eating amoeba: అత్యంత ప్రాణాంతకమైన ‘‘బ్రెయిన్ ఈటింగ్ అమీబా’’ నుంచి కేరళకు చెందిన 14 ఏళ్ల బాలుడు బయటపడ్డాడు. అమీబా వల్ల కలిగి ‘‘మెనింగోఎన్సెఫాలిటిస్’’ నుంచి కోలుకున్నట్లు ఆ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. ఈ ఇన్ఫెక్షన్లో అత్యధిక మరణాలు రేటు ఉంటుంది. ఈ వ్యాధి సోకిన వారిలో 97 శాతం మంది మరణిస్తుంటారు. అయితే, కేరళకు చెందిన బాలుడు మాత్రం అనూహ్యంగా ఈ వ్యాధి నుంచి కోలుకున్నాడు. ఈ వ్యాధిలో మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని, దేశంలో ఇది అరుదైన సంఘటన అని మంత్రి అభివర్ణించారు.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే ‘‘మెదడుని తినే అమీబా’’ వ్యాధి నుంచి కేవలం 11 మంది మాత్రమే కోలుకున్నారు. అబ్బాయి ప్రాణాలు కాపాడిన డాక్టర్లను మంత్రి వీణా జార్జ్ కొనియాడు. కోజికోడ్ జిల్లాలోని తిక్కోడికి చెందిన బాలుడికి అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ సోకింది. బాలుడికి మూర్చ వ్యాధి లక్షణాలు ఉండటంతో అతడి తండ్రి పయ్యోలిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అమీబిక్ వ్యాధి లక్షణాలు ఉండటంతో అతడిని జూలై 1న కోజికోడ్లోని బేబీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు.
Also Read
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
Read Also: Hyderabad: సూసైడ్ నోట్ రాసి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. కారణమిదే..?
వైద్యులు ఆలస్యం చేయకుండా అతనికి అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్కు చికిత్స చేయడం ప్రారంభించారు. బాలుడు తొమ్మిది రోజుల పాటు ఐసీయూలో చికిత్స పొందాడు. మొత్తం 22 రోజుల పాటు చికిత్స తీసుకున్నాడు. ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో నెగిటివ్ రావడంతో అతడిని డిశ్చార్జ్ చేశారు. గత రెండు నెలలుగా కేరళలో ముగ్గురు పిల్లల ప్రాణాలను ఈ వ్యాధి బలిగొంది. మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.
అమీబిక్ మెనింగోఎన్సాఫాలిటిస్ అనేది నీటి ద్వారా వ్యాపించే అత్యంత అరుదైన వ్యాధి. నెగ్లియో ఫౌలేరి అనే అమీబా ఉన్న నీటిలో స్నానం చేయడం, ఈతకు వెళ్లడం ద్వారా ముక్కులోకి నీరు చేరిన సందర్భంలో ఇది శరీరంలోకి ప్రవేశిస్తుంది. ముఖ్యంగా మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. 26 లక్షల్లో కేవలం ఒకరికి మాత్రమే ఈ వ్యాధి సోకుుతుంది. తలనొప్పి, జ్వరం, వికారం మరియు వాంతులు వంటి బాక్టీరియల్ మెనింజైటిస్ను పోలి ఉండే ప్రారంభ లక్షణాలతో సంక్రమణ వేగంగా అభివృద్ధి చెందుతుంది. అమీబా మెదడు కణాలను నాశనం చేస్తుంది. దీంతో మూర్ఛ, గందరగోళం, కోమా వంటి లక్షణాలు త్వరగా ఏర్పడుతాయి. చివరకు మరణం సంభవిస్తుంది.
తాజావార్తలు
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్బస్టర్!!
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
-
Gunasekhar: అలా పుట్టిందే ‘ఒక్కడు’ సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!