Brain eating amoeba: అద్భుతం.. “మెదుడుని తినే అమిబా”ని జయించిన 14 ఏళ్ల బాలుడు
- అద్భుతం.. మెదడుని తినే అమీబాని జయించిన బాలుడు..
- అత్యంత అరుదైన కేసుగా వ్యాఖ్యానించిన మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brain eating amoeba: అత్యంత ప్రాణాంతకమైన ‘‘బ్రెయిన్ ఈటింగ్ అమీబా’’ నుంచి కేరళకు చెందిన 14 ఏళ్ల బాలుడు బయటపడ్డాడు. అమీబా వల్ల కలిగి ‘‘మెనింగోఎన్సెఫాలిటిస్’’ నుంచి కోలుకున్నట్లు ఆ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. ఈ ఇన్ఫెక్షన్లో అత్యధిక మరణాలు రేటు ఉంటుంది. ఈ వ్యాధి సోకిన వారిలో 97 శాతం మంది మరణిస్తుంటారు. అయితే, కేరళకు చెందిన బాలుడు మాత్రం అనూహ్యంగా ఈ వ్యాధి నుంచి కోలుకున్నాడు. ఈ వ్యాధిలో మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని, దేశంలో ఇది అరుదైన సంఘటన అని మంత్రి అభివర్ణించారు.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే ‘‘మెదడుని తినే అమీబా’’ వ్యాధి నుంచి కేవలం 11 మంది మాత్రమే కోలుకున్నారు. అబ్బాయి ప్రాణాలు కాపాడిన డాక్టర్లను మంత్రి వీణా జార్జ్ కొనియాడు. కోజికోడ్ జిల్లాలోని తిక్కోడికి చెందిన బాలుడికి అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ సోకింది. బాలుడికి మూర్చ వ్యాధి లక్షణాలు ఉండటంతో అతడి తండ్రి పయ్యోలిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అమీబిక్ వ్యాధి లక్షణాలు ఉండటంతో అతడిని జూలై 1న కోజికోడ్లోని బేబీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు.
Also Read
- Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
- EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
- Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
- Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
Read Also: Hyderabad: సూసైడ్ నోట్ రాసి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. కారణమిదే..?
వైద్యులు ఆలస్యం చేయకుండా అతనికి అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్కు చికిత్స చేయడం ప్రారంభించారు. బాలుడు తొమ్మిది రోజుల పాటు ఐసీయూలో చికిత్స పొందాడు. మొత్తం 22 రోజుల పాటు చికిత్స తీసుకున్నాడు. ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో నెగిటివ్ రావడంతో అతడిని డిశ్చార్జ్ చేశారు. గత రెండు నెలలుగా కేరళలో ముగ్గురు పిల్లల ప్రాణాలను ఈ వ్యాధి బలిగొంది. మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.
అమీబిక్ మెనింగోఎన్సాఫాలిటిస్ అనేది నీటి ద్వారా వ్యాపించే అత్యంత అరుదైన వ్యాధి. నెగ్లియో ఫౌలేరి అనే అమీబా ఉన్న నీటిలో స్నానం చేయడం, ఈతకు వెళ్లడం ద్వారా ముక్కులోకి నీరు చేరిన సందర్భంలో ఇది శరీరంలోకి ప్రవేశిస్తుంది. ముఖ్యంగా మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. 26 లక్షల్లో కేవలం ఒకరికి మాత్రమే ఈ వ్యాధి సోకుుతుంది. తలనొప్పి, జ్వరం, వికారం మరియు వాంతులు వంటి బాక్టీరియల్ మెనింజైటిస్ను పోలి ఉండే ప్రారంభ లక్షణాలతో సంక్రమణ వేగంగా అభివృద్ధి చెందుతుంది. అమీబా మెదడు కణాలను నాశనం చేస్తుంది. దీంతో మూర్ఛ, గందరగోళం, కోమా వంటి లక్షణాలు త్వరగా ఏర్పడుతాయి. చివరకు మరణం సంభవిస్తుంది.
తాజావార్తలు
-
Explainer: కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చుంటున్నారా? డాక్టర్ల షాకింగ్ వార్నింగ్
-
Anangsha Biswas: ‘నాతో ఉండు.. కారు, ఇల్లు ఇస్తా’.. 70 ఏళ్ల నిర్మాత మాటలకు షాక్.. భయంతో పారిపోయిన నటి!
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
Bank Strike Alert: బ్యాంక్ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. ఆరోజున దేశవ్యాప్త సమ్మె.. కీలక వివరాలు ఇవే
-
N. Ramchander Rao: ఫీజు రీయింబర్స్మెంట్పై బీజేపీ పోరుబాట.. సీఎం రేవంత్పై బీజేపీ చీఫ్ ఫైర్
ట్రెండింగ్
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!