Uttar Pradesh: కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుకుని.. లవర్లతో జంప్ అయిన 11 మంది వివాహిత మహిళలు..
- ఉత్తర్ ప్రదేశ్లో ఘరానా మోసం..
- పీఎం హౌసింగ్ స్కీమ్ డబ్బులు తీసుకుని లవర్లతో ఉడాయింపు..
- ప్రియులతో పారిపోయిన 11 మంది వివాహిత మహిళలు..
- యూపీలోని మహారాజ్ గంజ్ జిల్లాలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్లో ఘరానా మహిళల విషయం వెలుగులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించిన డబ్బులు తీసుకుని కొంత మంది వివాహిత మహిళలు తమ లవర్లతో ఉడాయించారు. మహరాజ్ గంజ్ జిల్లాలో ప్రధాని మంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి మొదటి విడత పొందిన తర్వాత 11 మంది వివాహితలు ప్రేమికులతో పారిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ప్రభుత్వ పథకం పేద, మధ్యతరగతి కుటుంబాలకు శాశ్వత నివాసాన్ని నిర్మించుకునేందుకు ఆర్థిక సాయాన్ని అందిస్తోంది.
ఈ పథకం మొదటి విడత రూ.40,000 అందిన తర్వాత సంజయ్ అనే వ్యక్తి తన భార్య సునియా కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహరం బయటకు వచ్చింది. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన డబ్బును తీసుకుని సునియా గుర్తుతెలియని వ్యక్తితో పారిపోయిందని బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రాథమిక విచారణలో తేలింది. మహారాజ్ గంజ్ జిల్లాలో మొత్తం 2350 మంది ఈ పథకం కింద డబ్బులు అందుకున్నారు.
Also Read
- karnataka: మంత్రులకు శాఖలు కేటాయింపు.. డీకే.శివకుమార్ దగ్గరే కీలక శాఖ
- Delhi: ఢిల్లీ ఎయిర్పోర్టులో కలకలం.. హైదరాబాద్ ప్రయాణికుడి బ్యాగ్లో కోతి పుర్రె..
- Retail Inflation: ఉల్లి-వెల్లుల్లి ధరల మంట.. 4.45%కి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం
- Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
Read Also: Kathua Ambush: కథువా ఉగ్రదాడికి ప్రతీకారం తప్పుడు.. పాక్కి భారత్ వార్నింగ్..
ఈ ఘటన తర్వాత ఇలాంటివే మొత్తం 10 కేసులు వెలుగులోకి వచ్చాయి. అక్కడ కూడా భర్తలు తమ భార్యలు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ అనునమ్ ఝా మాట్లాడుతూ..‘‘ధాన మంత్రి ఆవాస్ యోజన మొదటి విడతను ఇళ్ళ నిర్మాణానికి ఉపయోగించని 11 మంది మహిళలు దుర్వినియోగం చేసినట్లు దృష్టికి వచ్చింది. లబ్ధిదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖను ఆదేశించాం, నిధులను రికవరీ చేయాలని సూచించాం’’ అని అన్నారు. సునియా కేసులో మిగిలిన రెండు విడతల డబ్బుల్ని తన కుమారుడు సంజయ్ ఖాతాలకు బదిలీ చేయాలని ఆయన తండ్రి అధికారుల్ని వేడుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్లో ఇలా జరగడం ఇదే తొలిసారి కాడు. గతంలో బారాబంకి జిల్లాకు చెందిన నలుగురు మహిళలు పథకంలో భాగంగా ప్రభుత్వం అందించిన రూ. 50,000 తీసుకుని తమ ప్రియులతో ఉడాయించారు.
తాజావార్తలు
-
Solar Eclipse 2026: మరికొన్ని గంటల్లో సూర్య గ్రహణం.. ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి..
-
karnataka: మంత్రులకు శాఖలు కేటాయింపు.. డీకే.శివకుమార్ దగ్గరే కీలక శాఖ
-
Delhi: ఢిల్లీ ఎయిర్పోర్టులో కలకలం.. హైదరాబాద్ ప్రయాణికుడి బ్యాగ్లో కోతి పుర్రె..
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్ల టవర్స్.. రేపు సీఎం రేవంత్ చేతుల మీదుగా శంకుస్థాపన
-
Iran-Trump: ట్రంప్ దిగిపోయేంత వరకు పోరాడతాం.. ఇరాన్ కొత్త శపథం
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..