Wrestlers Protest: వందలాది రెజ్లర్ల నిరసన.. ఈసారి మాత్రం బజరంగ్, సాక్షి మాలిక్, వినేష్లకు వ్యతిరేకంగా..
Wrestlers Protest: వందలాది మంది జూనియర్ రెజ్లర్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగారు. తమ కెరీర్లో ఒక కీలకమైన సంవత్సరాన్ని కోల్పోయామని రెజ్లర్లు నిరసనకు పిలుపునిచ్చారు. అయితే ఈ సారి మాత్రం వారంతా ప్రముఖ రెజ్లర్లు అయిన వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్లకు వ్యతిరేకంగా గళం విప్పారు. వారికి వ్యతిరేకంగా నిరసన చేయడంతో రెజ్లింగ్ సంక్షోభం కొత్త టర్న్ తీసుకుంది.
బుధవారం వందలాది మంది రెజ్లర్లు ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీలోని వివిధ ప్రాంతాల నుంచి జంతర్ మంతర్ చేరుకున్నారు. వీరిలో దాదాపు 300 మంది ఛఫ్రౌలీ, బాగ్పట్ లోని ఆర్యసమాజ్ అఖారా నుంచి వచ్చారు. మరికొందరు నరేలాలోని వీరేందర్ సింగ్ రెజ్లింగ్ అకాడమీ నుంచి వచ్చారు. హఠాత్తుగా ఇంత మంది రావడంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు కష్టపడ్డారు. వీరంతా సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం సస్పెండ్ చేసిన డబ్ల్యూఎఫ్ఐని పునరుద్ధరించాలని జూనియర్ రెజ్లర్ల కోరారు.
Also Read
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
కేంద్రానికి, రెజ్లింగ్ ఫెడరేషన్కి వ్యతిరేకంగా సాక్షి, బజరంగ్, వినేష్ గళం విప్పిన ఇదే చోట ప్రస్తుతం వారు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. గతేడాది నుంచి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలతో ముగ్గురు ఏస్ రెజ్లర్లు ఆందోళన నిర్వహించారు. బ్రిజ్ భూషణ్ని తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే ఇటీవల బ్రిజ్ భూషన్ స్థానంలో ఆయన సన్నిహితుడు సంజయ్ సింగ్ ఫెడరేషన్ ఎన్నికల్లో గెలుపొంది, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్గా ఎన్నికయ్యారు. అయితే ఈ ఎన్నికలను కూడా ముగ్గురు రెజ్లర్లు తప్పుపట్టారు. బజరంగ్ పూనియా తనకు ఇచ్చి పద్మ శ్రీని కేంద్రానికి వాపస్ ఇస్తానని ప్రకటించడంతో పాటు సాక్షి మాలిక్ రెజ్లింగ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.
ఈ నేపథ్యంలో కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ, కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్ఐ కార్యవర్గన్నా సస్పెండ్ చేసింది. నిబంధనలు, నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తించారని చెబుతూ సస్పెన్షన్ విధించింది. ఇండియన్ ఒలింపిక్స్ ఆర్గనైజేషన్కి రెజ్లింగ్ బాధ్యతలు నిర్వహించాలని కోరింది.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!